బడి బస్సు.. భారమే బాసు..!
రాష్ట్ర ప్రభుత్వం లారీలు, బస్సులు, ట్యాక్సీలతోపాటు పలు వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం మోపడంతో రవాణా రంగం నానాటికీ కుదేలవుతోంది.
అమలాపురంలో బస్సు సామర్థ్యం పరీక్షిస్తున్న రవాణాశాఖ అధికారి
- అల్లవరం మండలం గోపాయిలంకకు చెందిన సీహెచ్.దుర్గాభవాని అమలాపురం పట్ణణంలోని కళాశాలకు వెళ్లివచ్చేందుకు ఏడాదికి రూ.16 వేలు బస్సు రుసుం చెల్లించేది. ప్రస్తుతం కళాశాల, పాఠశాల బస్సులపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచేయడంతో ఈ ఏడాది యాజమాన్యం రవాణాకు రూ.22 వేలు చెల్లించాలని తెలిపింది.
- ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన బండారు సురేష్ అమలాపురం మండల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఇతని నుంచి ఇప్పటివరకు బస్సు రుసుం రూ.18 వేలు వసూలు చేసిన యాజమాన్యం ఈ ఏడాది నుంచి రూ.24 వేలు చెల్లించాలని తేల్చిచెప్పింది.
- ఇది వీరిద్దరి సమస్యే కాదు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు నడుపుతున్న బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులందరిదీ.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం లారీలు, బస్సులు, ట్యాక్సీలతోపాటు పలు వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం మోపడంతో రవాణా రంగం నానాటికీ కుదేలవుతోంది. గతేడాది నుంచి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులపై వైకాపా ప్రభుత్వం పన్నులను విపరీతంగా పెంచేసింది. దీంతో యాజమాన్యాలు ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతున్నాయి. చివరకు ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్నది పేద విద్యార్థుల తల్లిదండ్రులే కావడం గమనార్హం.
సీట్ల వారీగా పన్ను..
గతంలో మూడు నెలలకోసారి పన్ను చెల్లించేవారు. ఆ విధానానికి స్వస్తి పలికి గత సంవత్సరం మధ్యలో నుంచి సీట్ల వారీగా పన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. గతంలో ఏడు టన్నులలోపు బరువున్న పాఠశాల బస్సులకు మూడు నెలలకు రూ.725 చొప్పున పన్ను విధించేవారు. ఏడు టన్నులు దాటితే రూ.1,420 వసూలు చేసేవారు. గత విద్యా సంవత్సరం మధ్యలో నుంచి బరువుతో సంబంధం లేకుండా సీటుకు రూ.100 చొప్పున పన్ను విధిస్తున్నారు. బస్సులో ఎన్ని సీట్లుంటే అన్ని వందలు మూడు నెలలకోసారి చెల్లించాలి. ఇప్పటికే ఫీజుల బాదుడుతో సతమతమవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను బస్సుల ఛార్జీలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 8 ఇంజినీరింగ్ కళాశాలలు, 67 ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలలు, 250 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది వరకు చదువుతున్నారు. పాఠశాల బస్సులపై పన్ను భారం మోపడం వల్ల పరోక్షంగా వీరందరిపైనా భారం పడనుంది.
ఇవి తప్పనిసరి..
ఏపీ మోటారు వాహన చట్టం ప్రకారం సూచించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. విద్యాసంస్థ పేరు, చరవాణి నంబరు, పూర్తి చిరునామా, బస్సు ఎడమవైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా ఉండాలి. బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టె తప్పక ఉండాలి. వాహన చోదకుడు విధుల్లో ఉన్న సమయంలో ఖాకీ దుస్తులే ధరించాలి. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం నడిపే వ్యక్తి కంటిచూపు బాగుండాలి. 60 ఏళ్లు పైబడినవారిని వాహన చోదకులుగా నియమించకూడదు. అగ్నిమాపక పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండాలి.
మొదలైన సామర్థ్య పరీక్షలు
బడి బస్సులకు ఏటా సామర్థ్య ధ్రువీకరణ పత్రం(ఎఫ్సీ) విధిగా తీసుకోవాల్సిఉంటుంది. ఈ నెల 16వ తేదీనుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. పలు పాఠశాలల బస్సులను ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు తీసుకువస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాత మాత్రమే వాటికి అనుమతులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల