ఇలా ఉంటే.. వానొస్తే మునగదా మరి!
చారిత్రాక నగరం చినుకుపడితే చాలు చిగురుటాకులా గజగజలాడిపోతోంది. తేలికపాటి వర్షం కురిసినా నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి.
లలితానగర్: కాలువ నిర్మాణం కారణంగా రోడ్డుపై పారుతున్న మురుగు, చెత్త
చారిత్రాక నగరం చినుకుపడితే చాలు చిగురుటాకులా గజగజలాడిపోతోంది. తేలికపాటి వర్షం కురిసినా నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. గోదావరికి చెంతన ఉన్న ప్రాంతాలే కాకుండా దూరంగా ఉన్న కాలనీల్లో సైతం మోకాలి లోతు మురుగు చేరి నగరవాసుల రోజువారీ జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. రానున్నది వర్షాకాలం. ఇప్పటికీ నగరంలో పూర్తిస్థాయిలో పూడికలు తీయకపోవడంతో పలుచోట్ల మురుగు, వ్యర్థాలు రోడ్డెక్కి పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వానలు కురవకముందే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని నగరవాసులు విన్నవిస్తున్నారు.
న్యూస్టుడే, ఏవీఏ రోడ్డు
చెత్త, పూడికతో తుమ్మలావ పెద్ద కాలువ
నగరం నడిబొడ్డున గోదావరికి సమీపాన ఉన్న శ్యామలసెంటర్తో పాటు గోదావరికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.ఎల్.పురం వంటి ప్రాంతాలు సైతం వర్షానికి జలమయంగా మారుతున్నాయి. వర్షం వస్తే నగరంలో ముందుగా ముంపునకు గురయ్యే తుమ్మలావ, శ్యామల సెంటర్, కృష్ణనగర్, కంబాలచెరువు, హైటెక్ బస్టాండ్, చిరంజీవి బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, లలితానగర్ రోడ్డు, వి.ఎల్.పురం తదితర ప్రాంతాల్లోని కాలువల్లో పూడికతీత పనులు లేవు. పలు ప్రాంతాల్లో కాలువలు వ్యర్థాలతో నిండిపోయి మురుగు రోడ్డెక్కుతోంది. కొన్నిచోట్ల కాలువలకు గట్లు లేక మురుగు రహదారికి సమాంతరంగా ప్రవహిస్తోంది. ఇలాంటిచోట పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపర్చడంతో పాటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి అవసరముందని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు.
లింగంపేట పెద్ద కాలువలో చెత్త ఉండడంతో రోడ్డుపైకి చేరిన మురుగు, చెత్త
కాలువ నిర్మాణం త్వరగా పూర్తిచేయండి...
కాలువలు, రహదారుల నిర్మాణమంటూ మా ప్రాంతంలో నెల క్రితం ఉన్న కాలువలకు అడ్డుకట్ట కట్టారు. దీంతో కాలువలు పూర్తిగా నిండి మురుగు, చెత్త రోడ్డెక్కుతున్నాయి. అటువైపుగా సంచరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పాదచారుల పరిస్థితి మరీ దారుణం. త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చూడాలి.
మణికంఠ, లలితానగర్
వర్షం వస్తే అంతే..
ప్రధాన రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న ఆల్క్ట్తోట ప్రాంతమంతా గంట వర్షానికే నీరు చేరి బస్సులు సైతం మునిగిపోతున్నాయి. మా వీధుల్లో ఇంట్లోకి సైతం మురుగు నీరు వస్తోంది. సామగ్రి కూడా పాడవుతోంది. మా ప్రాంతంలో కాలువలపై చాలావరకు పలకలు సరిగా ఉండవు. కాలువలు పూర్తిగా చెత్త, వ్యర్థాలతో నిండి వర్షాలకు అవన్నీ ఇంట్లోకి చేరుతున్నాయి. వర్షాలు పూర్తిగా మొదలవకముందే సంబంధిత అధికారులు పూడికలు, చెత్త వంటివి తొలగించాలి.
సుబ్రహ్మణ్యం, ఆల్కట్తోట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల