ఏమైంది ‘వీరికి!’.. రాజమహేంద్రవరంలో దంపతుల అనుమానాస్పద మృతి
దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజమహేంద్రవరంలో శనివారం చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా..
దేవి, శ్రీధర్(పాతచిత్రం)
రాజమహేంద్రవరం నేరవార్తలు: దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన రాజమహేంద్రవరంలో శనివారం చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. మూడో పట్టణ సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ వివరాల మేరకు..
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు(7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమహేంద్రవరం వచ్చి ఆనందనగర్లో ఉంటోంది. శ్రీధర్ తాపిమేస్త్రీ. రెండేళ్లకు దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో దేవి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే కొంతకాలంగా ఉంటోంది. వారం కిందట శ్రీధర్ అత్తారింటికి వెళ్లి వారితో మాట్లాడి పిల్లలను అక్కడే ఉంచి, భార్యను తీసుకుని శనివారం నగరానికి వచ్చాడు. సాయంత్రం స్థానిక బంధువు ఒకరు శ్రీధర్ ఇంటి వచ్చి అతడ్ని పిలిచేసరికి ఎటువంటి స్పందన లేదు. కిటికిల్లోంచి చూసేసరికి శ్రీధర్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. దేవి మెడకు చున్నీ బిగిసిపోయి గదిలో పడి మృతి చెంది ఉంది. శ్రీధర్ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ మృతి చెంది ఉన్నాడు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటే ఒకరు నేలపై, మరొకరు ఫ్యానుకు వేలాడుతూ ఎలా ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామని ఎస్సై నాగబాబు చెప్పారు.
అనాథలైన చిన్నారులు
ఏడాది కిందట శ్రీధర్కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ క్రమంలో అతడి రెండు కాళ్లలోను స్టీల్ ప్లేట్లు ఉంచడంతో దేవి తిరిగి కాపురానికి వచ్చిందని.. కొంతకాలం సజావుగా సాగిన అనంతరం తిరిగి వివాదాలు వస్తే పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని ఆమె తరఫు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం నగరానికి వచ్చిన శ్రీధర్ భార్యను ఇంట్లో దించి గంట తరువాత ఓ మద్యం సీసా తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లినట్లుగా స్థానికులు పోలీసులుకు వివరించారు. మద్యం మత్తులో శ్రీధర్ ఈ ఘాతుకం తలపెట్టాడా.. కావాలనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అమ్మానాన్న మృతితో ఇద్దరు చిన్నారులు ఒంటరయ్యారని ఘటనా స్థలంలోని స్థానికులు, కుటుంబీకులు ఆవేదన చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
[ 17-06-2024]
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. -
అమ్మకు కడుపుకోతే
[ 17-06-2024]
పురిటి నొప్పులు తట్టుకుని పండంటి బిడ్డను ప్రసవించడం మహిళకు మరో జన్మ. కాన్పు కష్టమైతే అనేక సమస్యలు. ప్రసవ ద్వారం చిన్నదిగా ఉన్నా, బిడ్డ అడ్డం తిరిగినా, గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పయ్యే సూచనలు -
బడి బాటతో.. బంగారు లోకం
[ 17-06-2024]
భగవంతుడు కనుక ప్రత్యక్షమైతే... నా బాల్యాన్ని తిరిగి ఇవ్వమంటాను.. ఇదీ విశ్వకవి రవీంద్రుడి మాట. బాల్యం ప్రతి వ్యక్తి జీవితంలో మరపురాని జ్ఞాపకం. బంగారు లోకంలో విహరించాల్సిన వయస్సు. -
మట్టి కొండలు మాయం..
[ 17-06-2024]
అయిదేళ్ల కాలంలో మట్టి, ఇసుక, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా వైకాపా నాయకులు సహజ వనరులను కొల్లగొట్టారు. వారి ఆగడాలు భరించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. -
పోస్టుల భర్తీకి ప్రత్యేక శ్రద్ధ
[ 17-06-2024]
వైద్యుల భర్తీ, పూర్తిస్థాయిలో వైద్యసేవలు, మెరుగైన చికిత్స అందించే రీతిలో జిల్లాలోని ఆసుపత్రులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ ఎన్పీ పద్మశ్రీరాణి అన్నారు. -
కొత్త ప్రభుత్వంపై గుత్తేదారుల ఆశలు
[ 17-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై గుత్తేదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర.భ., పంచాయతీరాజ్శాఖల్లో సుమారు రూ.468 కోట్లు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. -
నిర్వహణ మరిచారా.. నిండా ముంచేస్తుంది..!
[ 17-06-2024]
ఇటీవల జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా కార్ల టైర్లు పేలి, పంక్చరై అదుపుతప్పుతున్నాయి. -
కాకినాడలో భారీ వర్షం.. అంధకారం
[ 17-06-2024]
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా జోరు వాన కురవడంతో ఎక్కడిక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
ఉప్పాడ జాంధానీ.. ఉపాధి కల్పించేనా..!
[ 17-06-2024]
ఉప్పాడ జాంధానీ ఊబిలోకి చేరింది.. నేత కార్మికుల బతుకు కష్టాలతో పరేషానీ అవుతోంది.. అయిదేళ్లుగా రాయితీలు అందకపోవడం, సరైన ప్రోత్సాహం కరవవడం.. వెరసి చేనేత కుటుంబాలు వలసెళ్లిపోవడం పరిపాటైంది.. -
నన్నయలో కొత్త కోర్సులు
[ 17-06-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో యువత ఉపాధి పొందేందుకు వీలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా మూడు కోర్సులు ప్రవేశపెట్టారు. ఇందుకు గాను వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. -
పవన్కల్యాణ్తో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి: వర్మ
[ 17-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్కల్యాణ్ ప్రమాణసీˆ్వకారం చేసిన నేపథ్యంలో రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. -
మహిళ దారుణ హత్య
[ 17-06-2024]
మహిళ దారుణ హత్యకు గురైన విషాద ఘటన కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట ఫిషింగ్ హార్బర్లో ఆదివారం చోటుచేసుకుంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన
-
విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం
-
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
-
క్రోమ్లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్ పేజీలు వినొచ్చు
-
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
-
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా