నిధుల్లేవ్.. నీళ్లు అడగొద్దు
ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలి.. ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల రక్షిత జలాలు ఇవ్వాలి. ఈ పనులు 2024 మార్చిలోగా పూర్తవ్వాలి..
ఇంటింటికీ కుళాయిల ఏర్పాటులో తీవ్ర జాప్యం
బిల్లుల బకాయిలే రూ.83 కోట్లు
‘జల్ జీవన్ మిషన్’ పనుల్లో అంతా గడబిడే
ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించాలి.. ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల రక్షిత జలాలు ఇవ్వాలి. ఈ పనులు 2024 మార్చిలోగా పూర్తవ్వాలి.. ఇదీ కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ పథకానికి నిర్దేశించిన లక్ష్యం. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున వాటా నిధులతో పూర్తిచేయాల్సిన ఈ పథకం ప్రగతి చూస్తే నత్త గుర్తుకొస్తుంది. గడువు దాటినా పూర్తికాలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరుకాక.. కొత్త నిధులు కేటాయించక ఈ దుస్థితి ఎదురైంది.
- బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,348.. కాకినాడ 667, తూర్పుగోదావరి జిల్లాలో 239 ఆవాస ప్రాంతాల్లో జల జీవన్మిషన్ (జేజేఎం) ద్వారా నీటి కష్టాలకు తెరదించాల్సిఉంది. రూ.5 లక్షల లోపు పనులు.. ఆ పైన ఉన్నవి విభజించి చేస్తున్నారు. గ్రామాల్లోని తాగునీరు, పారిశుద్ధ్య కమిటీల ద్వారా చేపట్టాల్సి ఉండగా.. ఈ పనుల్లో రాజకీయం వేలు పెట్టడంతో గుత్తేదారులతో చేయిస్తున్నారు. అవీ గంపగుత్తగా కొందరికే కేటాయించడంతో ఆశించిన రీతిలో ముందుకు సాగడంలేదు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జల్ జీవన్ మిషన్ నిధులతో ఏర్పాటుచేసిన కుళాయి
రాజానగరం మండలంలో జల్ జీవన్ మిషన్ నిధులతో రక్షిత పథకం నిర్మాణం
ఈనాడు, కాకినాడ: అయిదేళ్ల క్రితం ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ పనులకు నేటికీ మోక్షం దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సవ్యంగా ఇవ్వక.. చేసినవాటికి బిల్లులు చెల్లించకపోవడం ఇందుకు కారణం. ఇన్నాళ్లూ నత్తనడకన సాగిన పనులు ఎన్నికల కోడ్తో పూర్తిగా పడకేశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసిన పనుల బిల్లులు ఏకంగా రూ.83 కోట్లు బకాయిలు ఉండడంతో గుత్తేదారులు మొండికేశారు. ఇటీవల విజయవాడలో సమావేశమై బిల్లులు ఇవ్వకపోతే పనులు నిలిపివేయాలని నిర్ణయించడంతో నీలి నీడలు కమ్ముకున్నాయి. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి అటుంచితే.. ఇంకా ప్రారంభం కానివాటి పరిస్థితేమిటో అర్థంకావడంలేదు.
లక్ష్యానికి, అమలుకు ఎంతో తేడా
- జల జీవన్ మిషన్ పనులు వాస్తవంగా ఈ ఏడాది మార్చినాటికి పూర్తికావాలి.. క్షేత్రస్థాయి ప్రతికూలతలతో 2025 జూన్ నాటికి పూర్తిచేయాలని కొత్తగా లక్ష్యం నిర్దేశించుకున్నారు. జిల్లాలో గతంలోనే తాగునీటి పథకాలు, కుళాయిల వ్యవస్థ చాలావరకు ఏర్పాటవడంతో.. లక్ష్యం పూర్తికి ఈ ఏడాది డిసెంబర్ గడువు నిర్దేశించుకున్నారు. అవి ఊపందుకోవాలంటే వాటా నిధులు, బకాయిలు విడుదలచేయాలి.
- కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులకు రూ.407.66 కోట్లు మంజూరైతే.. ఇప్పటిరకు రూ.120 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. మొత్తం పనుల్లో 541 పూర్తయితే.. 269 వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో 3.89 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా జలాలు ఇవ్వాలి. గతంలోనే 1.25 లక్షల గృహాలకు ఉన్న కనెక్షన్లతో కలిపి 3.15 లక్షల కుళాయిలు ఏర్పాటుచేశారు. మరో 78వేల గృహాలకు ఇవ్వాలి.
- తూర్పుగోదావరి జిల్లాలో జేజేఎం ప్రాజెక్టుకు రూ.480 కోట్లు మంజూరైతే.. ఇప్పటివరకు కేవలం రూ.68 కోట్లు మాత్రమే వెచ్చించారు. 216 పనులు పూర్తయితే.. మరో 450 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో 3.10 లక్షల కుళాయి కనెక్షన్లు ఏర్పాటు లక్ష్యంగా కాగా.. ఇప్పటికి 37వేలు కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగారు.
- కోనసీమ జిల్లాలో రూ.515.92 కోట్లతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు పట్టాలెక్కించాల్సి ఉంటే.. ఇప్పటికి రూ.171.18 కోట్లు ఖర్చుచేశారు. 966 పనులు పూర్తవగా, 853 ప్రగతిలో ఉన్నాయి. రెండు ప్రారంభం కాలేదు.
వేగవంతానికి చర్యలు
జల్ జీవన్ మిషన్ పనులు ఈ ఏడాది మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యమే అయినా ప్రతికూలతల వల్ల సాధ్యపడలేదు. డిసెంబర్ కల్లా చేయాలని నిర్దేశించుకున్నాం. ఎన్నికల కోడ్ కారణంగా నిర్మాణంలో ఉన్న పనులు, కొత్తగా ప్రారంభించాల్సినవి నిలిపివేయాల్సి వచ్చింది. ఆంక్షలు ముగిశాక మొదలవుతాయి. నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. పనులు వేగవంతం చేసి ఇంటింటికీ కుళాయిల లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకుంటాం.
ఎం.శ్రీనివాస్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, కాకినాడ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి