వర్షాకాలానికి ముందే తొంగి చూసిన డెంగీ
చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు..గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది. నగర/పురపాలక, పంచాయతీ సిబ్బంది మేల్కొనక పోతే జనాలు రోగాల బారిన పడటం ఖాయం.
నేనున్నానంటున్న మలేరియా
మేల్కొనకుంటే ముప్పే
న్యూస్టుడే, సీతానగరం
చినుకు రాలింది.. ‘ఖాళీ’ స్థలాలు..గుంతల్లో నిలిచిన నీటిలో దోమ పుట్టింది. నగర/పురపాలక, పంచాయతీ సిబ్బంది మేల్కొనక పోతే జనాలు రోగాల బారిన పడటం ఖాయం. వర్షాకాలం రాకమునుపే అప్పుడే కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రతిచోట అపరిశుభత్ర వెంటాడుతోంది. ఏటా పన్నుల రూపేణా ఆదాయం పొందుతున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు ఆ స్థాయిలో ప్రజారోగ్యంపై దృష్టి సారించడం లేదు. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా తొలగించే పరిస్థితి కానరావడం లేదు. జనం జర్వాలు, డెంగీ, మలేరియా బారిన పడుతున్నారు. ప్రాణాల మీదికొస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. అధికార యంత్రాంగం మేల్కొనకపోతే జనాలకు రోగాల ముప్పు తప్పేలా లేదనేది సృష్టమవుతోంది.
పట్టించుకోని ప్రజారోగ్య వ్యవస్థ..
పంచాయతీల్లో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం అందించే ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం టైడ్లో 30 శాతం తాగునీరు, 30 శాతం పారిశుద్ధ్యం పనులకు ఖర్చు చేయాలి. దోమల నివారణకు ప్రతి పంచాయతీలో రూ.లక్షకు పైబడి వెచ్చించవచ్చు. 2023 వరకు పంచాయతీల్లో నిధులను విద్యుత్తు బిల్లుల బకాయిల పేరుతో ప్రభుత్వం వెనక్కి లాగేసింది. 2023-24కు వచ్చేసరికి రెండు విడతల నిధులు మాత్రమే ఇచ్చింది. మూడో విడత ఇవ్వలేదు. 2024-25కు సంబంధించి ఆర్థిక సంఘం నిధులు ఒక్క విడత కూడా రాలేదు. మేజర్ పంచాయతీల్లోనే పారిశుద్ధ్య పనులు దారుణంగా ఉంటే మైనర్ పంచాయతీల్లో అసలు వీటి జోలికి పోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. జిల్లాలో అరకొరగా ఉన్న ఫాగింగ్ యంత్రాలు, పిచికారీ పరికరాలు పక్కన పెట్టేశారు. వీటికి గత నాలుగేళ్లుగా ఉపయోగించకుండా మూలనపెట్టేయడంతో తుప్పుపట్టి పాడైపోయాయి.
సీతానగరం మండలం ముగ్గళ్ల పంచాయతీ వద్ద మూలకు చేరిన ఫాగింగ్ వాహనం
కానరాని ప్రత్యేక కార్యక్రమాలు..
2014-19 మధ్యకాలంలో ‘దోమలపై దండయాత్ర’ పేరుతో నివారణ చర్యలు చేపట్టేవారు. ఇవి ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసేవి. ప్రతి శుక్రవారం ప్రై డే..డ్రై డే నిర్వహించేవారు. దోమల ఆవాసాలను గుర్తించి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. ఇక వార్డుల్లో నీటి తొట్టెలు, పాత సామగ్రి, అపరిశుభ్రత, ట్యాంకులను తెరిచి ఉంచడం, టెంకాయ చిప్పలు, టైర్లలో నీరు నిలిచి ఉండడం తదితరాలతో వచ్చే అనర్థాలను జనాలకు వివరించేవారు. వారిని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టేవారు. వైకాపా ప్రభుత్వంలో ఇలాంటివి కనిపించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. కేసులు వచ్చిన చోట ఏం చేయాలి? భవిష్యత్తు కార్యచరణ ఏమిటి ? అనే ఆలోచన లేకపోయింది.
నిధుల లేమితో వాహనాలకు తుప్పు
నగరపాలక సంస్థలు/పురపాలకసంఘాలతోపాటు గ్రామ పంచాయతీలకు రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వాహనాలు కొనుగోలు చేసి పంపించింది. తడి, పొడి చెత్తసేకరణతోపాటు దోమల మందు పిచికారీ చేసేలా ఫాగింగ్ యంత్రాల ఆటోలు వచ్చాయి. వీటిల్లో ఇంధనం నింపేందుకు కూడా చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో పలుచోట్ల వాహనాలను మూలన పడేశారు. చోదకులకు వేతనాలు ఇవ్వలేక ఇచ్చిన వాహనాలు మాకొద్దంటూ పలు పంచాయతీల పాలకవర్గాలు వెనక్కి ఇచ్చేశాయి. వాటిని ఏం చేయాలో తెలియక సచివాలయాల వద్ద అలంకార ప్రాయంగా ఉంచడంతో తుప్పుపట్టాయి. చాలాచోట్ల మరమ్మతులకు వచ్చిన వాహనాలను బాగు చేయకుండానే వదిలేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే వాహనాలు మూలన పడి ఉన్నాయి. పంచాయతీల్లో ప్రస్తుతం అరువుపై తెచ్చిన నాసిరకం బ్లీచింగ్ తప్ప మలాథియన్ ద్రావణం అందుబాటులో లేదు. దోమల గుడ్లు వృద్ధిచెందకుండా చల్లే ఎబిట్ రసాయనం పూర్తిగా కనుమరుగైంది.
మండు వేసవిలోనే కేసులు..
జిల్లాలో గతేడాది రాజమహేంద్రవరంలోనే అత్యధికంగా 73 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాకినాడ, అమలాపురం నగరాల్లోనే 178, , రాజానగరంలో 22 కేసులు బయటపడ్డాయి. మిగతాచోట్ల ఒకటి నుంచి అయిదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి ఈ నెల 28 వరకు 53 డెంగీ, రెండు మలేరియా కేసులు రావడంతో ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది. రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణం, కాకినాడ నగరం, తుని, అమలాపురం, రావులపాలెం, కొవ్వూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో ఈ కేసులు బయటపడడం, ఇవన్నీ అధికారికంగా ఆరోగ్యశాఖకు వచ్చిన లెక్కలు. ఇక డెంగీ, మలేరియాతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. మండు వేసవిలోనే డెంగీ కేసులు రావడం చూస్తుంటే ఇక వర్షాకాలంలో పరిస్థితిని తలచుకుంటే ఆందోళన కలిగిస్తోందంటున్నారు.
పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నాం..
నగరపాలక/పురపాలకసంఘాలు, పంచాయతీల్లో పారిశుద్ద్య పరిస్థితులు మెరుగుపడేలా అధికార యంత్రాంగంతో ఇప్పటికే సదస్సులు పూర్తి చేశాం. వైద్య సిబ్బందితో కలిసి వార్డుల్లో పరిశుభత్రపై అవగాహన తీసుకొచ్చేలా పర్యటిస్తున్నాం. అన్ని పీహెచ్సీలు, సామాజిక ఆసుపత్రుల్లో డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహించేలా అవసరమైన రాపిడ్/స్లైడ్ కిట్లు అందుబాటులో ఉంచాం. ప్రాథమికంగా వైద్య పరీక్షల్లో సందేహం ఉంటే రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, తుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలీసా పరీక్షలు పెంచాం. ప్రధానంగా దోమలు వృద్ధి చెందకుండా స్థానిక సంస్థలు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. అవసరమైన రసాయనాలు కూడా సరఫరా చేస్తున్నాం. మురుగునిల్వల గుంతలు, పూడికతీత లేని కాలువలను ఆరోగ్యసిబ్బంది గుర్తించి సంబంధిత సంస్థలకు తెలియజేసి శుభ్రత పనులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎస్.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత