logo

తెలుగు జాతి గౌరవం ఎన్టీఆర్‌

తెలుగు జాతి గౌరవం నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు.

Published : 29 May 2024 03:27 IST

జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు

టి.నగర్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: తెలుగు జాతి గౌరవం నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలోని నగర ఎమ్మెల్యే కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలోంచి పుట్టిందన్నారు. తారకరాముడు అనూహ్య నిర్ణయానికి దిల్లీ కోటలు కదిలాయన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టారన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు పయనిస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చల్లా శంకరరావు, యర్రా వేణుగోపాలరాయుడు, కాశీ నవీన్‌కుమార్, వాసిరెడ్డి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, కుడిపూడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు