విత్తం లేదని వరద ఆగదుగా!
ఏటా జులై మాసం వచ్చిందంటే చాలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అనేక లంక ప్రాంతాలు బితుకుబితుకుమంటాయి.
తాత్కాలిక పనులతో ఎన్నాళ్లిలా
ప్రతిపాదనల వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం
సుందరపల్లి వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట
ఈనాడు, రాజమహేంద్రవరం: ఏటా జులై మాసం వచ్చిందంటే చాలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అనేక లంక ప్రాంతాలు బితుకుబితుకుమంటాయి. భారీ ఎత్తున ప్రవాహం చుట్టుముట్టేయడం..పంట నష్టాలు, బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఏటిగట్లు తీసికట్టుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం 36 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అనేక చోట్ల నీళ్లు లీకై ఏటిగట్ల బలహీనతలను ఎత్తిచూపాయి. అప్పటికప్పుడు ఇసుక బస్తాలు, సర్వేబాదులు వేసి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. శాశ్వత పరిష్కారం లేదు. తాత్కాలిక పనులకు రూ.2 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలైతే పంపారు. ఇటీవల జలవనరుల శాఖ అధికారులు వరద సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఇసుక బస్తాలు, సర్వేబాదులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.
ప్రమాద ఘంటికలే..
ఉమ్మడి జిల్లాలో గత వరదల కాలంలో ఏటిగట్లు బలహీనపడిన చోట ఇప్పటివరకు శాశ్వత చర్యలు లేవు. ప్రస్తుతం అయిదు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఫ్లడ్ స్టోర్ల వద్ద సామగ్రి సిద్ధం చేయాలని నిర్ణయించారు.
- కె.గంగవరం మండలంలోని కూళ్ల, సుందరపల్లి వద్ద ఓ మాదిరి వరదకే గట్టు నుంచి మట్టి ఒండులుగా విడిపోతూ కోతకు గురవుతోంది. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ ప్రవాహానికి రాజోలు మండలం పరిధిలో మూడు చోట్ల గట్టు నుంచి నీరు బయటకురావడంతో అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
- ఐ.పోలవరం మండలం పాత ఇంజిరం వద్ద (బోలావారిమండి) స్లూయిస్ దెబ్బతిని అందులోంచి వరద జలాలు బయటకు పోటెత్తాయి. ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలే చేపట్టారు.
మరమ్మతులకు ప్రతిపాదనలు
వరదలు వచ్చినప్పుడు గత అనుభవాల రీత్యా తాత్కాలిక చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అయిదారు చోట్ల సమస్యాతక పరిస్థితులున్నాయి. మరమ్మతులకు ఒక్కో చోట రూ.40 లక్షల చొప్పున అవసరమని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. మంజూరైన వెంటనే పనులు చేపడతాం.
శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీరు, జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు