పింఛనుదారులకు ఈసారీ పాట్లు తప్పవా!
సామాజిక భద్రత పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలు పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు అవస్థలు పడ్డారు.
న్యూస్టుడే, వి.ఎల్.పురం
బ్యాంకు వద్ద లబ్ధిదారుల పడిగాపులు (పాతచిత్రం)
సామాజిక భద్రత పింఛను డబ్బులు తీసుకునేందుకు రెండు నెలలు పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు మండుటెండలో వచ్చి వృద్ధులు నానాయాతన అనుభవించారు. ఈసారీ లబ్ధిదారులు పాట్లు తప్పేట్లు లేదు. జూన్ నెలకు సంబంధించి పింఛను సొమ్మును కూడా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది.
రాజమహేంద్రవరం డివిజన్లో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 1,42,920 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరిమహిళ, కళాకారులు, చర్మకారులు తదితర సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులు ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 29,583 మంది వరకు ఉన్నారు. వీరికి మొత్తం రూ.8,94,07,000 వరకు పింఛను సొమ్ము విడుదల చేయాల్సి ఉంది.
రెండు నెలల పాటు తిప్పలు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో గ్రామ, వార్డు సచివాలయాలకు పింఛనుదారులను రప్పించి ప్రభుత్వం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. బ్యాంకుల్లో నగదు ఉపసంహరణ విషయంలో సాంకేతిక సమస్య ఏర్పడిందంటూ గంటల తరబడి లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి కల్పించింది. దీనిపై ఆందోళనలు వ్యక్తమవడంతో మే నెలకు సంబంధించిన పింఛన్లు డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారిని ఏకంగా బ్యాంకుల చుట్టూ తిప్పించింది. సామాజిక భద్రత పింఛన్లు ప్రత్యేక కేటగిరి కింద ఉన్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల వద్ద సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసి.. మిగతా వారందరికీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. గత నెల దివ్యాంగులు, సైనిక సంక్షేమం కింద పింఛను పొందుతున్నవారు, అనారోగ్య కారణాల రీత్యా మంచం పైనుంచి లేవలేనిస్థితిలో ఉన్నవారు తదితరులు కొంతమందిని ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి వారికి మాత్రమే ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేశారు. మిగతా వారందరికీ వారి బ్యాంకు ఖాతాలో పింఛను డబ్బులు జమ చేయడంతో వాటిని తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలామందికి బ్యాంకు వ్యవహారాలపై అవగాహన లేక నగదు ఉపసంహరణకు అవస్థలు పడ్డారు. ఈసారీ ఇదే పరిస్థితి ఉంటే ఇబ్బందేనని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల వద్ద పింఛను అందించేలా ఏర్పాటు చేయాలని పలువురు పింఛనుదారులు అధికారులను కోరుతున్నారు. జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో తమ బాధలు వినేదెవరని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?