కీలక దశ.. అడుగులు వడివడిగా..
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడికి గడువు సమీపించింది.
కౌంటింగ్ ఏర్పాట్లపై సూక్ష్మస్థాయి కార్యాచరణ
కౌంటింగ్ అధికారుల విధులు, బాధ్యతలు వివరిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల వెల్లడికి గడువు సమీపించింది. జూన్ 4న నన్నయ విశ్వవిద్యాలయంలోని కౌంటింగ్ కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళికను జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కౌంటింగ్ రోజున ఎవరు ఏఏ విధులు నిర్వర్తించాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.
కౌంటింగ్ అధికారుల విధులు, బాధ్యతలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలకమైన కౌంటింగ్, ఫలితాల ప్రకటనకు సమయం సమీపిస్తున్నందున ఎవరూ ఏఏ విధులను నిర్వర్తించాలనే విషయమై ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్పై అవగాహన కల్పించారు.
ఎవరెవరికీ ఏయే బాధ్యతలంటే..
- నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలో రెండు అంబులెన్సులు, ప్రతి కౌంటింగ్ హాలు వద్ద మెడికల్ బృందం ఏర్పాటు చేసే బాధ్యతలు డీఎంహెచ్వోకు అప్పగించారు. కౌంటింగ్ రోజు అత్యవసర వైద్యసేవల కోసం జీఎస్ఎల్ ఆసుపత్రితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
- విద్యుత్తు సరఫరాలో అటంకాలు లేకుండా ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్కు, తాగునీటి ఏర్పాట్ల విషయంలో డ్వామా పీడీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
- అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకురావడానికి దివాన్చెరువు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలంలో బస్సుల సిద్ధం చేసే బాధ్యతలను జిల్లా రవాణా అధికారికి అప్పగించారు.
- జిల్లా గ్రామపంచాయతీ అధికారి ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ ఏర్పాట్లు
- విశ్వవిద్యాలయం పరిపాలన భవనం రెండో అంతస్తులో పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు నిర్వహించనున్నారు. 50 చొప్పున పోస్టల్ బ్యాలెట్ పత్రాలు బండిల్స్గా కట్టి 14 ప్లస్ 4 టేబుల్స్ ద్వారా ఓట్ల లెక్కింపు, తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సీలింగ్ వరకు ప్రణాళిక సిద్ధం చేశారు. కౌంటింగ్ సిబ్బంది హాజరు నమోదు, గుర్తింపు కార్డుల జారీ ఇతర అనుబంధ ఏర్పాట్లు, నివేదికలు, రౌండ్ వారీగా ఫలితాల ప్రకటన కోసం ఎవరు ఏ విధులు చేపట్టాలో సమగ్రంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- ఈవీఎం యూనిట్లలో పోలైన ఓట్లు లెక్కింపు కోసం నిర్ధిష్టమైన కార్యాచరణపై ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సిబ్బందికి విధుల కేటాయింపులో భాగంగా ఆయా శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ప్రధాన మార్గంలో కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డు ఉన్నవారిని కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారిని నియమించారు.
- జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో 2న లెక్కింపు నమూనా ప్రక్రియ ఉదయం 9 నుంచి నిర్వహిస్తారు. దీనికి కౌంటింగ్ సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం కలెక్టరేట్ నుంచి, దివాన్ చెరువు వద్ద బస్సులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం