నెత్తు‘రోడ్డు’తున్నాయ్!
సవ్యంగా లేని దారులు.. వాహనాలు నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యాజమాన్యాలు.. రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి.
ప్రమాదాలతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
వీడని నిర్లక్ష్యం.. రహదారి భద్రతలో వైఫల్యం
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, దానవాయిపేట
పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సవ్యంగా లేని దారులు.. వాహనాలు నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యాజమాన్యాలు.. రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి.. కారణాలేమైతేనేం రహదారులపై రుధిర ధారలు పారుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. అయినవారిని కోల్పోయిన కుటుంబాలు జీవితాంతం కోలుకోలేని శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ప్రమాదాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి.
నెత్తుటి మరకలు..
- ఆరుగురి ప్రాణాలు ఆవిరి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద ఈనెల 14న ఆగిఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. చికిత్సపొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. రహదారి చెంత జట్టు కూలీలు ట్రాక్టర్లో ధాన్యం బస్తాలు వేసి పగ్గం కడుతుండగా.. రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
- విశ్రాంత న్యాయమూర్తితో సహా మరొకరు..: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం సమీప జాతీయ రహదారి వద్ద ఈనెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి వి.మోహన్కుమార్, కారు డ్రైవర్ శ్రీను మృతిచెందారు. వీరి కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొంది. దీంతో అదుపుతప్పి మరో వాహనంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- దేవరపల్లి మండలం బందపురం సమీప హైవేపై జనవరి 2న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
దేవరపల్లి మండలం బందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఢీకొని ధ్వంసమైన కార్లు
తరచూ ఘటనలు జరిగే ప్రాంతాలు
- కాకినాడ జిల్లా: తుని, అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, జగ్గంపేట, తాళ్లరేవు
- తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం, రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం పరిధి
- కోనసీమ: ఐ.పోలవరం, ముమ్మిడివరం, అమలాపురం, రావులపాలెం. (కేంద్ర పాలిత ప్రాంతంలోని యానాంలో కూడా తీవ్రత ఎక్కువగానే ఉంది.)
ప్రమాదాలకు కారణాలు ఇవే..
- మితిమీరిన వేగంతో వాహనం నడపడం
- డ్రైవింగ్లో చోదకుని నిర్లక్ష్యం
- నైపుణ్యం లేనివారు బండి తీయడం
- అధ్వాన రహదారులు
- మద్యం మత్తు.. చరవాణిలో మాట్లాడుతూ ప్రయాణించడం
- వాహనాల సామర్థ్యం సరిగ్గా లేకపోవడం
- ట్రాఫిక్ సమస్యలు
- రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి
- జాతీయ రహదారి (ఎన్హెచ్), రాష్ట్రీయ రహదారులు (ఎస్హెచ్) కొంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా- మండల- గ్రామీణ రహదారులు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. కొన్ని కీలక మార్గాల నిర్మాణాల్లో ఏళ్లుగా జాప్యమే. రాకపోకల క్రమంలో ప్రమాదాలు తప్పడంలేదు.
- అపసవ్య దిశలో రాకపోకలు సాగించడం.. శిరస్త్రాణం, సీటు బెల్ట్లు పెట్టుకోకుండా దూసుకెళ్తుండంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టానికి దారితీస్తోంది.
- నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో కాకుండా జాతీయ రహదారి, పలు ప్రాంతాల్లో రోడ్లపైన, వాటిని ఆనుకుని వాహనాలు నిలిపివేస్తున్నారు. కనీసం అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్తో కూడిన ట్రయాంగిల్ గుర్తులూ వాడకపోవడంతో వేగంగా వస్తున్న వాహనాలు నిలిపి ఉన్నవాటిని గుర్తించలేక ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలకు ముందు వెనక పసుపు, ఎరుపు రంగులతో రేడియం స్టిక్కర్లు (రిఫ్లెక్టర్లు) ఉన్నా అవి నాసిరకానివి కావడం.. దుమ్ముధూళితో ఉండడం వల్ల చీకట్లో వాహనం ఉందోలేదో తెలుసుకోలేని పరిస్థితి.
నియంత్రణకు చర్యలు
జిల్లాలో ప్రస్తుతం 15 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్న మరో 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి రిజిస్ట్రేషన్కు పంపించాం. గతేడాది ప్రమాదాలు 373 జరిగితే ఈఏడాది 286కి తగ్గాయి. మరణాలు 152 నుంచి 104కి తగ్గాయి. గాయపడిన వారి సంఖ్య 353 నుంచి 309కి తగ్గింది. కీలక మార్గాల్లో హెచ్చరిక బోర్డులు, డ్రమ్ముల ఏర్పాటు.. మలుపుల్లో ముళ్లపొదలు తొలగించడం.. సర్వీసు రోడ్ల దగ్గర స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు.. వాహనాలు నడిపేవారిని అప్రమత్తం చేసే చర్యలతో ఈ ఫలితాలు సాధించగలిగాం. హెల్మెట్లు, సీట్ బెల్టులు పెట్టుకుని అప్రమత్తంగా నడిపితే చాలావరకు ప్రమాదాలు తగ్గించవచ్చు. ప్రాంగణాలు అందుబాటులో లేక రోడ్ల పక్కనే దాబాల దగ్గర లారీలు నిలపడం సమస్యగా మారుతోంది. వీటిపైనా దృష్టిసారిస్తాం.
పి.జగదీష్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం