సాగుబాటలో సవాళ్లు!
జిల్లాలో ఖరీఫ్ సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది.
జిల్లాలో ఖరీఫ్కు భారీ ప్రణాళిక
జూన్ 15 తర్వాతే నారుమడులు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
జిల్లాలో ఖరీఫ్ సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెలువడనున్న నేపథ్యంలో ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది. జూన్ ఒకటి నుంచి గోదావరి కాలువలకు నీటిని విడుదల చేయడం రివాజుగా ఉన్నా.. ఈ ఏడాది 15 తర్వాత గాని నీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో పక్క ఏలేరు ప్రస్తుతం డెడ్ స్టోరేజిలో ఉండటం, పంపా రిజర్వాయర్లో నీటి నిల్వలు లేకపోవడం వంటివి ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. జూన్ 15 నుంచి నారుమడులు సిద్దం చేసేసేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. మెట్ట ప్రాంతాల్లో ఆగస్టు 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇదీ ప్రణాళిక..
జిల్లాలో 28,616 హెక్టార్లలో వెదజల్లే విధానం, 29,994 హెక్టార్లలో బెంగాల్ విధానంలో వరుస క్రమంలో నాట్లు వేయడం, 27,451 హెక్టార్లలో నారు ద్వారా నాట్లు వేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ ఖరీఫ్లో 67వేల మందికి సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నారు. వీరిలో 46వేల మందికి రూ.190 కోట్ల మేర రుణాలు కల్పించాలని యోచిస్తున్నారు. వరితోపాటు ఇతర వ్యవసాయ పంటలు సాధారణ విస్తీర్ణం 2.40 లక్షల ఎకరాలు కాగా, 2.22 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగు, మిగతా విస్తీర్ణంలో అపరాలు, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు వంటి 11 రకాల వ్యవసాయ పంటల సాగు జరగనుంది.
41,522 క్వింటాళ్ల విత్తనాలు అవసరం..
జిల్లాలో 41,522 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. రైతుల వద్ద 18,089 క్వింటాళ్లు, ప్రైవేటు డీలర్ల వద్ద 17,757 క్వింటాళ్లు, సహకార సంఘాల వద్ద 833 క్వింటాళ్లు, ఏపీఎస్ఎస్డీసీ వద్ద 4,843 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. ఈ విత్తనాలు ఏ మేరకు సరిపోతాయో చూడాలి.
ఎరువుల సరఫరా ఎలా..?: ఖరీఫ్ సాగుకు 58,996 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా 17,812 టన్నుల ఎరువులు సరఫరాకు నిర్ణయించారు. సహకార సంఘాల వద్ద 7,252 టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 33,831 టన్నులు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కేవలం ప్రణాళిక మాత్రమే. రానున్న రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.
ఉత్పాదకత పెంచడమే లక్ష్యం
ఖరీఫ్లో ధాన్యం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేశాం. ఆరుతడి పంటలు ఎక్కువగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తాం. జూన్ 15 నుంచి నారుమడులు వేసేలా ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతాం.
ఆరుతడి పంటలపై దృష్టి..
జిల్లాలో వరితో పాటు ఇతర వ్యవసాయ పంటలు సాధారణ విస్తీర్ణంలో 98 శాతం వరకు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్.విజయకుమార్, జిల్లావ్యవసాయ అధికారి, కాకినాడ
నారుమడులు త్వరగా సిద్ధం చేసే పరిస్థితి లేకపోతే వెదజల్లే విధానంలో నాట్లు వేసేలా ప్రణాళికలు తయారు చేశారు. పశ్చిమబెంగాల్ తరహాలో వరుసగా నాట్లు వేసే విధానాన్ని ఈసారి అమలు చేయాలని యోచిస్తున్నారు. పూర్తిస్థాయిలో సాగునీరు లభ్యం కాకపోతే .. ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఎకర వరిసాగుకు వినియోగించే నీరు రెండున్న ఎకరాల ఆరుతడి పంటలకు సరిపోనున్న నేపథ్యంలో వీటిని ఎక్కువగా సాగు చేయాలని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..