ఆర్భాటంగా ఆదేశాలు..అమలు చెత్తపాలు!
జిల్లాలోని కంపోస్టు యార్డులను ఎన్జీటీ బృంద సభ్యులు గతేడాది చివర్లో పరిశీలించారు. ప్రజారోగ్య రక్షణకు, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
అమలాపురంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త
జిల్లాలోని కంపోస్టు యార్డులను ఎన్జీటీ బృంద సభ్యులు గతేడాది చివర్లో పరిశీలించారు. ప్రజారోగ్య రక్షణకు, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘ నిధులు కేటాయిస్తున్నా.. పనులు కావడం లేదు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇలా..
జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పురపాలికలు కాగా, ముమ్మిడివరం నగర పంచాయతీగా కొనసాగుతోంది. వీటిల్లో గడిచిన అయిదేళ్లలో వైకాపా సర్కారు చెత్తశుద్ధిపై కనీస దృష్టి సారించలేదు. కంపోస్టు యార్డుల్లో చెత్తను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నా.. సద్వినియోగం చేసుకోవడంలో అయిదు సంవత్సరాలుగా వైకాపా సర్కారు పూర్తిగా విఫలం చెందిందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డంపింగ్యార్డుల్లో వందల టన్నుల చెత్త పేరుకుని పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.
జరిమానా విధిస్తామన్నా..
మార్గదర్శకాల ప్రకారం కంపోస్టు యార్డులు పచ్చదనంతో కనిపించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ఇటీవల ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కళ్లు తెరిచిన అధికారులు ఆగమేఘాలపై చెత్తశుద్ధికి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ నిధుల భారం మోయలేమని చేతులెత్తేశారు. చివరకు కేంద్రం 15వ ఆర్థిక సంఘ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందులో కేంద్రం 33 శాతం, మిగిలిన 67 శాతం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పురపాలిక భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
అమలాపురం పురపాలికలో..
అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో బైపాస్ రహదారిలో చెత్తను పోగేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పగాఉంది. ఇక్కడ శుద్ధిచేసే పనులకు సంబంధించి టన్నుకు రూ.600 నుంచి రూ.650 వరకు స్వచ్ఛాంధ్ర] కార్పొరేషన్ నుంచి చెల్లించేందుకు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఇక్కడ ఆరు నెలల కిందట యంత్రాలు బిగించి శుద్ధిపనులు చేపట్టారు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధిచేసి కుప్పగా పోశారు. తూకం వేయకుండా పనులు చేపట్టడంతో బిల్లుల చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో గుత్తేదారులు పనులు నిలిపి వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురపాలికల్లో పేరుకుపోతున్న చెత్తను శుద్ధిచేసి కర్మాగారాలకు తరలించి, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
గతంలోనే ఆదేశాలున్నా..
జిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీ పరిధిలో నిత్యం 84 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇదంతా డంపింగ్ యార్డులకు తరలించి పోగు చేస్తున్నారే తప్ప.. శుద్ధిచేసే చర్యలు చేపట్టడం లేదు. గతంలో 13వ ఆర్థిక సంఘం సమయంలో పూర్తి నిధులు చెత్తశుద్ధికి వినియోగించుకోవాలని ఆదేశాలివ్వడంతో అప్పట్లో డంపింగ్యార్డుల్లో కొన్ని వసతులు కల్పించినా రోజువారీగా పోగవుతున్న చెత్తను శుద్ధి చేయడంలో మాత్రం సఫలీకృతం కాలేకపోయారు.
కాలుష్యమయంగా..
పురపాలికల్లో రోజువారీగా వస్తున్న చెత్తను శివారు ప్రాంతాల్లోని డంపింగ్యార్డుల్లో పోగు చేస్తున్నారు. దానికి నిప్పంటుకుని రావణకాష్టంలా కాలుతూనేఉంటోంది. దట్టమైన పొగ పరిసర వార్డుల్లోకి వస్తోంది. డంపింగ్ యార్డులకు వచ్చే చెత్తలో పలు రకాల వ్యర్థాలు ఉండటం, వాటికి నిప్పంటుకుని ఘాటైన వాసనతో కూడిన పొగ తమను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి