ఉపాధ్యాయులకూ పరీక్షే...!
ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి.
పరీక్ష విధానాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో కిరణ్బాబు
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రశ్నపత్రం చేతికి ఇస్తే వాటిని చూసి విద్యార్థులు సమాధానాలు రాసేవారు. ఇప్పుడు ప్రశ్నలను బోర్డుపై రాస్తే.. పిల్లలు వాటిని చూసి తెల్లకాగితాలపై రాసుకుని సమాధానాలు పూర్తి చేయాలి. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఎఫ్ఏ-2 (ఫార్మెటివ్ అసెస్మెంట్) పరీక్ష విధానం తీరుపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్లో ప్రశ్నపత్రాలు
ఎఫ్ఏ-2 పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేయలేదు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రధానోపాధ్యాయుల చరవాణికి వాట్సాప్లో ప్రశ్నపత్రం వస్తుంది. దాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులందరికీ పంపిస్తున్నారు. వారు గదుల్లో బోర్డులపై ప్రశ్నలను రాస్తుంటే విద్యార్థులు వాటిని చూసి రాసుకుని, జవాబులు రాయాల్సివస్తోంది. కొన్నిచోట్ల కొందరు ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తుండగా, మరికొందరు చదివి వినిపిస్తున్నారు. ఇంకొందరు తమ సొంత ఖర్చుతో పరీక్ష గదిలో ఎంతమంది విద్యార్థులున్నారో అన్ని నకలు కాపీలు తీయించి విద్యార్థులకు అందజేస్తున్నారు. బోర్డుపై రాయడానికి కనీసం 20 నిమషాల సమయం పడుతుందని, దానిని విద్యార్థులు తిరిగి రాసుకోవడానికి మరో 20 నిమషాలు ఇలా సుమారు గంట వరకు సమయం వృథా అవుతోందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
రోజుకో మార్పు..
పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫార్మెటివ్-2 పరీక్షలు రెండు రోజులక్రితం ప్రారంభంకాగా.. నిర్వహణ తలనొప్పిగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. రెండో రోజు శనివారం మరికొన్ని నిబంధనలను తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసి వారి తల్లిదండ్రులకు పంపించడం, ఆన్లైన్లో మార్కుల నమోదుకు తేదీలు నిర్ణయించడం వంటివాటిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందించలేని స్థితిలో ప్రభుత్తం ఉందంటూ ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పరీక్ష మొదటి రోజు రెండు పూటలకు సంబంధించిన పత్రాలు ఉదయం 8 గంటలకే ప్రధానోపాధ్యాయుల చరవాణికి వచ్చినా, రెండో రోజు మాత్రం ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు వేరువేరుగా పంపించారని చెబుతున్నారు.
తప్పని అవస్థలు
ఒకే ఉపాధ్యాయుడు రెండుమూడు తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాలు బోర్డుపై రాయాల్సిరావడం, విద్యార్థులు సరిగా రాసుకున్నారా, లేదా అనేది పర్యవేక్షించాల్సిరావడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. సీబీఏ(క్లాస్ రూం బేసిడ్ ఎసెస్మెంట్) పరీక్షలకు ఓఏంఆర్ జవాబు పత్రాల విధానం తీసుకొచ్చి రూ.లక్షలు ఖర్చుచేశారు. ఫార్మేటివ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకటిరెండు తరగతులకు సంబంధించి శుక్రవారం ఇచ్చిన ప్రశ్నపత్రాల్లో కొన్ని బొమ్మలుకూడా ఉన్నాయి. వాటిని బోర్టుపై వేయాల్సిరావడం, తెలుగులో పేరాగ్రాఫ్ తరహా ప్రశ్నలు ఉండటం వాటిని బోర్డుపై రాయడానికే అధిక సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా..?
అల్లవరం: ఓ పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
ఈ పరీక్షను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నిర్వహించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాట్సాప్లో వచ్చిన ప్రశ్నపత్రం చూసి బోర్డుపై రాస్తే.. విద్యార్థులు ప్రశ్నలు రాసుకుని.. వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో అన్ని తరగతులవారికి బోర్డుపై రాయడమెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని తరగతులకు సంబంధించిన ప్రశ్న పత్రాలను జిరాక్స్ తీయించి విద్యార్థులకు అందజేయాల్సివస్తోందని, సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
ముద్రణకు సమయం లేకనే..
ఫార్మేటివ్ పరీక్షల్లో మొదటిదానికి రెండో పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉన్న కారణంగా పరీక్ష పత్రాల ముద్రణకు సరిపడా సమయం లభించలేదు. దాంతో నేరుగా ఉపాధ్యాయుల వాట్సాప్కు ప్రశ్నపత్రం పంపిస్తున్నాం. దానిని వారు బోర్డుపై రాసి విద్యార్థులతో పరీక్ష నిర్వహిస్తున్నారు.
రవిసాగర్, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.