ఉపాధ్యాయులకూ పరీక్షే...!
ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి.
పరీక్ష విధానాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో కిరణ్బాబు
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రస్తుతం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్ఏ-2 పరీక్షలు విద్యార్థులకే కాకుండా.. ఉపాధ్యాయులకూడా పరీక్షగానే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రశ్నపత్రం చేతికి ఇస్తే వాటిని చూసి విద్యార్థులు సమాధానాలు రాసేవారు. ఇప్పుడు ప్రశ్నలను బోర్డుపై రాస్తే.. పిల్లలు వాటిని చూసి తెల్లకాగితాలపై రాసుకుని సమాధానాలు పూర్తి చేయాలి. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఎఫ్ఏ-2 (ఫార్మెటివ్ అసెస్మెంట్) పరీక్ష విధానం తీరుపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్లో ప్రశ్నపత్రాలు
ఎఫ్ఏ-2 పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేయలేదు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రధానోపాధ్యాయుల చరవాణికి వాట్సాప్లో ప్రశ్నపత్రం వస్తుంది. దాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులందరికీ పంపిస్తున్నారు. వారు గదుల్లో బోర్డులపై ప్రశ్నలను రాస్తుంటే విద్యార్థులు వాటిని చూసి రాసుకుని, జవాబులు రాయాల్సివస్తోంది. కొన్నిచోట్ల కొందరు ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తుండగా, మరికొందరు చదివి వినిపిస్తున్నారు. ఇంకొందరు తమ సొంత ఖర్చుతో పరీక్ష గదిలో ఎంతమంది విద్యార్థులున్నారో అన్ని నకలు కాపీలు తీయించి విద్యార్థులకు అందజేస్తున్నారు. బోర్డుపై రాయడానికి కనీసం 20 నిమషాల సమయం పడుతుందని, దానిని విద్యార్థులు తిరిగి రాసుకోవడానికి మరో 20 నిమషాలు ఇలా సుమారు గంట వరకు సమయం వృథా అవుతోందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
రోజుకో మార్పు..
పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫార్మెటివ్-2 పరీక్షలు రెండు రోజులక్రితం ప్రారంభంకాగా.. నిర్వహణ తలనొప్పిగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. రెండో రోజు శనివారం మరికొన్ని నిబంధనలను తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసి వారి తల్లిదండ్రులకు పంపించడం, ఆన్లైన్లో మార్కుల నమోదుకు తేదీలు నిర్ణయించడం వంటివాటిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందించలేని స్థితిలో ప్రభుత్తం ఉందంటూ ఉపాధ్యాయులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పరీక్ష మొదటి రోజు రెండు పూటలకు సంబంధించిన పత్రాలు ఉదయం 8 గంటలకే ప్రధానోపాధ్యాయుల చరవాణికి వచ్చినా, రెండో రోజు మాత్రం ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు వేరువేరుగా పంపించారని చెబుతున్నారు.
తప్పని అవస్థలు
ఒకే ఉపాధ్యాయుడు రెండుమూడు తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాలు బోర్డుపై రాయాల్సిరావడం, విద్యార్థులు సరిగా రాసుకున్నారా, లేదా అనేది పర్యవేక్షించాల్సిరావడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. సీబీఏ(క్లాస్ రూం బేసిడ్ ఎసెస్మెంట్) పరీక్షలకు ఓఏంఆర్ జవాబు పత్రాల విధానం తీసుకొచ్చి రూ.లక్షలు ఖర్చుచేశారు. ఫార్మేటివ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకటిరెండు తరగతులకు సంబంధించి శుక్రవారం ఇచ్చిన ప్రశ్నపత్రాల్లో కొన్ని బొమ్మలుకూడా ఉన్నాయి. వాటిని బోర్టుపై వేయాల్సిరావడం, తెలుగులో పేరాగ్రాఫ్ తరహా ప్రశ్నలు ఉండటం వాటిని బోర్డుపై రాయడానికే అధిక సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా..?
అల్లవరం: ఓ పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
ఈ పరీక్షను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నిర్వహించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాట్సాప్లో వచ్చిన ప్రశ్నపత్రం చూసి బోర్డుపై రాస్తే.. విద్యార్థులు ప్రశ్నలు రాసుకుని.. వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో అన్ని తరగతులవారికి బోర్డుపై రాయడమెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అన్ని తరగతులకు సంబంధించిన ప్రశ్న పత్రాలను జిరాక్స్ తీయించి విద్యార్థులకు అందజేయాల్సివస్తోందని, సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు.
ముద్రణకు సమయం లేకనే..
ఫార్మేటివ్ పరీక్షల్లో మొదటిదానికి రెండో పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉన్న కారణంగా పరీక్ష పత్రాల ముద్రణకు సరిపడా సమయం లభించలేదు. దాంతో నేరుగా ఉపాధ్యాయుల వాట్సాప్కు ప్రశ్నపత్రం పంపిస్తున్నాం. దానిని వారు బోర్డుపై రాసి విద్యార్థులతో పరీక్ష నిర్వహిస్తున్నారు.
రవిసాగర్, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు