పాలంగి దుకాణంలో భారీ చోరీ
ఉండ్రాజవరం మండలం పాలంగిలో సిమెంటు, ఇనుము దుకాణంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.38 లక్షల నగదు, 12 కాసుల బంగారం, కిలో వెండి పోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
వివరాలు సేకరిస్తున్న అదనపు ఎస్పీ, డీఎస్పీ
ఉండ్రాజవరం, న్యూస్టుడే: ఉండ్రాజవరం మండలం పాలంగిలో సిమెంటు, ఇనుము దుకాణంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.38 లక్షల నగదు, 12 కాసుల బంగారం, కిలో వెండి పోయినట్లు బాధితులు పేర్కొంటున్నారు. అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ వి.ఎస్.ఎన్ వర్మ, ఎస్సై పేరూరి నాగరాజు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముళ్లపూడి దుర్గానాథ్, సింహాద్రి వెంకటేశ్వరరావు ఉమ్మడిగా సిమెంటు, ఇనుము దుకాణం నిర్వహిస్తున్నారు. వేరే చోట స్థలం కొనుగోలు చేసేందుకు కొంత మొత్తాన్ని దుకాణంలో ఉంచారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బల్ల మీదుగా షట్టర్పై ఉన్న ఖాళీప్రదేశం గుండా లోపలకు ప్రవేశించారు. ఇనుప కమ్మీతో బీరువా తాళం పగులగొట్టి నగదు, బంగారు, వెండితో ఉడాయించారు. బీరువా వద్ద ఉన్న సీసీ కెమెరా తీగను తొలగించాడు. వేరే ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ద్వారా దొంగ చాలా సమయం ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. బయటకు రాగానే వేరే వ్యక్తి బండితో సిద్ధంగా ఉండగా ఇద్దరూ వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే
[ 29-03-2024]
పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. -
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
[ 29-03-2024]
తిడితే పడాలి... కొడితే భరించాలి.. అధికార పక్ష నాయకుల అరాచకాలపై నోరు మెదిపితే ఇబ్బందే. -
పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
[ 29-03-2024]
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
[ 29-03-2024]
అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. -
అనకొండలు.. అధికారం అండదండలు
[ 29-03-2024]
కక్ష కట్టారో.. తప్పు జరగకపోయినా.. ఎలాంటి ఫిర్యాదులు అందకపోయినా కార్యాలయాల మీదకు వచ్చి పడతారు.. బాధితులతో బలవంతంగా ఫిర్యాదులు రాయించి మరీ వెంటాడి వేధిస్తారు.. -
పవన్.. వారాహి విజయభేరి
[ 29-03-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. -
తొలి అడుగు ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం
[ 29-03-2024]
ఇంటర్మీడియట్.. విద్యార్థి భవితకు తొలి అడుగు. కెరియర్ను ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి.. ఏ కోర్సులను ఎంచుకోవాలి.. ఎలా ముందడుగు వేయాలి.. అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. తల్లిదండ్రులకు తలెత్తుతుంటాయి. -
ఆదుకుంటున్న సీలేరు జలాలు
[ 29-03-2024]
గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. -
ప్రదర్శన దర్పం.. ప్రయోజనం దూరం
[ 29-03-2024]
వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక పరికరాల ప్రదర్శన వేదికన్నారు.. రెండు వందలకు పైగానే నమూనాలను ప్రదర్శించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. -
సంద్రంలో సమర భేరి
[ 29-03-2024]
కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. -
ప్రచారం.. కావాలి పర్యావరణ హితం
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. -
త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు పనిచేస్తాయి
[ 29-03-2024]
రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భాజపా అభ్యర్థులను కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ శ్రేణులను కోరారు. -
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
[ 29-03-2024]
ఓ మహిళతో సహజీవనం కోసం మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిపైనే కత్తిదూసి హత్యచేశాడో వ్యక్తి.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?