మేమొస్తాం.. కష్టాలు తీరుస్తాం
ఆత్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది.
వివిధ సామాజిక వర్గాలకు లోకేశ్ భరోసా
ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, తాళ్లరేవు, ముమ్మిడివరం, ఐ.పోలవరం
ఆత్మీయ పలకరింపులు.. అఖండ స్వాగతాలు.. మంగళ హారతులు.. తీన్మార్ డప్పులు.. తెదేపా-జనసేన జెండాల రెపరెపలు.. బాణసంచా కాల్పుల హోరు నడుమ గురువారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. కల్లుగీత కార్మికులు, రైతులు, మత్స్యకారులు, వ్యాపారులు, మహిళలు సంఘీభావంగా అడుగులు వేశారు. గత కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కష్టాలన్నీ తీరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో తొలుత యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది విద్యార్థులు మమేకమయ్యారు. 21 కి.మీ మేర సాగిన యాత్రలో ప్రతి గ్రామం వద్ద లోకేశ్ రాకకోసం మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపై వేచి చూడడం కనిపించింది. లచ్చిపాలెం, బాపనపల్లి, జార్జిపేట వైజంక్షన్, పి.మల్లవరం, సుంకటరేవు, గాంధీనగర్, సంతపేట, తాళ్లరేవు సెంటర్, సీతారాంపురం, కోరంగి మీదుగా యాత్ర సాగింది. కోరంగిలో భోజన విరామ సమయంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తిరిగి పునఃప్రారంభించారు. చొల్లంగిపేట వద్ద లోకేశ్ రాత్రి బస చేశారు.
గుంతల్లో రోడ్డు వెతుక్కోవాలి
వైకాపా పాలనలో రోడ్లను అభివృద్ధి చేయలేదని.. చివరికి గుంతల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. గుత్తేదారులకు రూ.2 లక్షల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ముందుకు రావడంలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామన్నారు.
స్థానికంగా ఉద్యోగాల కల్పన
తాళ్లరేవులో రిలయన్స్, జీఎస్పీ, ఓఎన్జీసీ సంస్థలున్నా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని యువత తెలపగా.. తమ ప్రభుత్వం వచ్చాక చర్చించి అవకాశాలు కల్పిస్తామన్నారు. అప్పటివరకు యువగళం నిధి కింద రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఏటా కొలువుల భర్తీ చేపడతామన్నారు.
మీరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు
తాళ్లరేవు మండలం కోరంగి వద్ద శెట్టి బలిజ సామాజిక వర్గీయులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ‘‘శెట్టిబలిజలకు మొహమాటం ఎక్కువ అని పెద్దలన్నారు.. కాదు ఆత్మగౌరవం ఎక్కువ. ముక్కుసూటిగా ఉంటారు.. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు.. పది మందికీ సేవచేయాలనే తపన ఉన్నవాళ్ల’’ని లోకేశ్ పేర్కొన్నారు.
తన్నే దున్నపోతు జోలికి వెళ్లరు..
గీత కార్మికుడు చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని కొప్పుశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కోరగా.. లోకేశ్ స్పందిస్తూ.. మీరంతా తన్నే దున్నపోతు(వైకాపాను ఉద్దేశించి) జోలికి వెళ్లరని, ఏం అడిగినా చంద్రబాబు కాదనరనే దీమా ఉందన్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత తొలుత రూ.5 లక్షలు బీమా చెల్లిస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. చక్కటి పాలసీలతో కల్లుగీత కార్మికులకు మేలు చేస్తామన్నారు.
కార్పెంటర్లకు చంద్రన్న బీమా
వైకాపా దుర్మార్గ పాలనతో చేతి వృత్తులన్నీ సర్వనాశనమైపోయాయని, ఆయా రంగాలపై ఆధారపడిన కుటుంబాలు దారుణంగా దెబ్బతిన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ఆదరణ పథకం కొనసాగిస్తామని, కార్పెంటర్లకు చంద్రన్న బీమా పథకం వర్తింపజేస్తామన్నారు. వడ్రంగి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్మికుల కష్టాన్నీ దోచుకుంటున్న వైకాపా
వైకాపా ఇసుక మాఫియా కారణంగా సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని, భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారని లోకేశ్ అన్నారు. ఇసుక నావ కార్మికుల కష్టాన్నీ దోచుకోవడం దుర్మార్గమని.. వారిని ఆదుకుంటామన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం
రాష్ట్రంలో జగన్ పాలన వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం, కౌలు రైతుల బలవన్మరణాల్లో రెండోస్థానంలో ఉన్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో దెబ్బతిన్నవారికి పెట్టుబడి రాయితీలు, బీమా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. తాము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని, రైతుమిత్ర గ్రూపులకు రుణాలు అందజేస్తామన్నారు.
ఈ ప్రభుత్వం తనపై 22 కేసులు పెట్టిందని లోకేశ్ అన్నారు.. తెదేపా నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడిపై కూడా పెట్టారన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి, వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు జైలులో నిర్బంధించారన్నారు. యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప ఓ వివాహానికి వెళ్తే అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. * కోరంగి వద్ద పెద్దబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకారులు లోకేశ్కు చేప బహుమతిగా ఇవ్వగా.. శెట్టిబలిజల సమావేశంలో ఓ కార్మికుడు ఇచ్చిన కల్లు లోకేశ్ తాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం