అపార నష్టం.. కోలుకోలేని కష్టం
రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది.
ఆరుగాలాల శ్రమను మింగేసిన తుపాను
వేలాది ఎకరాల్లో వరిపంటకు తీవ్ర నష్టం
బొమ్మూరులో ఈదురుగాలులకు పడిపోయిన పంటను చూపుతున్న రైతు
రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది. గుప్పెళ్లతో తీసుకుంటే బంగారంలా మెరిసిపోయే ధాన్యపు రాశులను నీడలా వెంటాడిన శత్రువు మాదిరి నీరు చుట్టేసింది.. చేసిన అప్పులు, పెట్టుకున్న ఆశలు, కుటుంబమంతా కలిసి పడ్డ శ్రమ.. ఇలా అన్నీ ఆవిరైపోయాయి. మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లాలో తీవ్ర నష్టం మిగిల్చింది.
ఈనాడు, రాజమహేంద్రవరం, -న్యూస్టుడే: వి.ఎల్.పురం, దేవీచౌక్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. కోతకు సిద్ధమైన వరి ఒరిగిపోయింది. పనల దశలో ఉన్నది తడిసింది.. కల్లాల్లో, రోడ్ల పక్కన రాశులు పోసి బరకాలు కప్పిన ధాన్యం కిందకు, వ్యవసాయ క్షేత్రాల్లోకి జలం చేరిపోయింది. వానలు తగ్గక, నీరు కదలక రైతులు పంటలను కాపాడుకోవడానికి యాతన పడుతున్నారు. తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొంటామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పట్టించుకునేవారు కరవయ్యారు. కొత్తపేట, ముమ్మిడి వరం, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల్లో దయనీయ పరిస్థితి నెలకొంది.
తూర్పున 41 గ్రామాల్లో పంట నష్టం
తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 41 గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అధికార వర్గాలు అంచనా వేశాయి. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం మంగళవారం సాయంత్రానికి జిల్లాలో 377 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి ముంపునకు గురికాగా 502 హెక్టార్లలో పంట పడిపోయింది. 193 హెక్టార్లలో పనల మీద, 562 హెక్టార్లలో కుప్పలపై, 1,140 హెక్టార్లలో ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఖరీఫ్ సీజన్లో 70,827 హెక్టార్లలో వరిసాగు జరగగా ఇప్పటికే 46,416 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 24,411 హెక్టార్లలో కోతలు జరగాల్సి ఉండగా తుపాను ముంచుకొచ్చింది. గోకవరం, గోపాలపురం, కోరుకొండ, సీతానగరం, ఉండ్రాజవరం తదితర మండలాల్లో సరాసరి మూడు వేల హెక్టార్లలో వరి కోతలు మిగిలి ఉన్నాయి.
రాజమహేంద్రవరం: ముంపు బారిన రామచంద్రరావుపేట-కృష్ణానగర్ ప్రాంతాలు
ఇబ్బందులెన్నో: ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్నిచోట్ల మిల్లులకు ధాన్యం తరలించడానికి హమాలీల కొరత ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ కూలీలను వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలిచ్చినా వారికి ఈ పనులు అలవాటు లేకపోవడంతో ధాన్యాన్ని వాహనాల్లో ఎగుమతి చేయలేని పరిస్థితి.
కూలిన స్తంభాలు.. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు
వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రాజమహేంద్రవరం నగరంతోపాటు సఖినేటిపల్లి, జి.దొంతమూరు, గండేపల్లి, జగ్గంపేట, తాళ్లరేవు, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు ఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 200 విద్యుత్తు స్తంభాలు, 100 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు ఒక్క రాజమహేంద్రవరంలోనే 40 స్తంభాలు పడిపోవడంతోపాటు ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. విద్యుత్తు శాఖకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లిందని.. ఇంకా పెరిగే అవకాశముందన్నారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సరఫరా పునరుద్ధరణకు మొత్తం 400 మంది సిబ్బందిని నియమించినట్లు ఎస్ఈ పేర్కొన్నారు.
పెరవలి: తీపర్రులో నేలవాలిన విద్యుత్తు స్తంభం
పాఠశాలలకు నేడూ సెలవు కంబాలచెరువు
(రాజమహేంద్రవరం): తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కొనసాగే పరిస్థితి ఉండడంతో బుధవారమూ జిల్లాలో పాఠశాలలకు స్థానిక సెలవు దినం ప్రకటించినట్లు డీఈవో ఎస్.అబ్రహాం ఓ ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఈ సమాచారం అందేలా చూడాలని ఆదేశించారు.
సీఎం చెబుతారు.. క్షేత్రంలో అమలుకాదంతే..
తుపాను నేపథ్యంలో తేమ శాతం చూడకుండా మిల్లులకు హుటాహుటిన ధాన్యం తరలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవి క్షేత్రస్థాయిలో అమలుకాక అన్నదాతలు ఉసూరుమంటున్నారు. రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి లారీలు, దిగుబడి ఛార్జీలు తామే భరిస్తామని, ధాన్యం కొనాలని వేడుకుంటున్నా ప్రయోజనం లేకపోయింది. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ఎంత ధర నిర్ణయిస్తారో తెలియదని, ఈ తరహా ధాన్యం తరలింపుపై తమకు ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు కోనసీమ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాజమహేంద్రవరం: మోరంపూడి సమీప ఎల్ఐసీ కార్యాలయం వద్ద సుడిగాలి బీభత్సం
60 వేల ఎకరాల్లో పంటపై ఆందోళన..
కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా 1.01 లక్షల ఎకరాల్లో కోతలు జరిగాయి. 89 వేల మెట్రిక్ టన్నులు కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40 వేల మెట్రిక్ టన్నులు ప్రైవేటు వ్యాపారులు తీసుకున్నట్లు అంచనా. మరో 60 వేల ఎకరాల్లోని పంట కోత, పనలు, కుప్పల మీద ఉంది. తుపానుతో నష్టపోయే పరిస్థితి నెలకొంది.
పైడిమెట్టలో రహదారి పక్కన రాశి కిందకు చేరిన వర్షం నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?