logo

ఓటరు జాబితా పరిశీలనకు ప్రత్యేక అధికారి

ఓటరు జాబితా సవరణకు సంబంధించి పరిశీలకులుగా జిల్లాకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ యువరాజు రానున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు.

Published : 07 Dec 2023 05:24 IST

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తున్న డీఆర్వో సత్తిబాబు

అమలాపురం కలెక్టరేట్‌:  ఓటరు జాబితా సవరణకు సంబంధించి పరిశీలకులుగా జిల్లాకు పరిశ్రమల శాఖ కమిషనర్‌ యువరాజు రానున్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా స్వచ్ఛీకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారి ఈనెల 7వ తేదీన జిల్లాకు వస్తున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయనను కలిసి అభ్యంతరాలను తెలపవచ్చన్నారు.  గురువారం నుంచి గ్రామాల్లో ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దూరి రాజేష్‌, వడ్డి నాగేశ్వరరావు, సంసాని వెంకట భాస్కర్‌ రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని