తుపాను నష్టాలపై నివేదికలకు ఆదేశాలు
తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు.
దొమ్మేరులో పొలాలను పరిశీలిస్తున్న జిల్లా ప్రత్యేకాధికారి వివేక్ యాదవ్
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: తుపాను కారణంగా సంభవించిన నష్టాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారి, కలెక్టర్తో పాటు ఎస్పీ జగదీష్, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీసీ అనంతరం వివేక్యాదవ్ అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన్న రహదారులను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిసారించాలన్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. రానున్న రెండు నెలల్లో ఎదుర్కొనే పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విరిగిన విద్యుత్తు స్తంభాల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించాలన్నారు. పాఠశాలల ఆవరణలో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా తోడించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంట నష్టాలను నమోదు చేస్తున్నామని, రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని తెలిపారు. ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు. గోదావరిలో నీటిమట్టం 11.75 అడుగులు ఉందని, ఎగువనున్న భద్రాచలం నుంచి నీరువచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రత విషయంలో తగు చర్యలు తీసుకున్నామన్నారు.
తుపాను తగ్గే వరకు కోతలు వద్దు
కొవ్వూరు పట్టణం: వర్షంతో మునిగిన చేలలో కోతలు చేపట్ట వద్దని సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి వివేక్ యాదవ్ అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులోని పంట పొలాలను ఆయన పరిశీలించారు. వర్షంతో చేలు మునిగిపోయాయని, పంట దెబ్బతింటుందన్న అంశాన్ని రైతాంగం ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, తహసీల్దారు డి.నాగరాజునాయక్, ఏఓ గంగాధర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్తిపాడులో బంగారం చోరీ
[ 26-07-2024]
ప్రత్తిపాడులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్