చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటే ఎలా..!
చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది.
పంటలు మునిగాక హడావుడిగా పనులు
బుధవారం రాజులపాలెంలో జేసీబీతో మురుగుకాల్వ పనులు
పి.గన్నవరం, న్యూస్టుడే: చేతులు కాలాక ఆకులుపట్టుకుంటే ప్రయోజనం ఏమిటి...? అధికార యంత్రాంగం పరిస్థితి అలాగే ఉంది. తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షానికి జిల్లాలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరిపంట ముంపుబారినపడింది. ఇప్పటికిప్పుడు ఉపాధికూలీలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో మురుగుకాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇప్పుడు అక్కడక్కడా వీటిని బాగుచేస్తున్నారు. వాస్తవానికి ఏటా వేసవి క్లోజర్ పిరియడ్లో మురుగుకాలువలు, పంటకాలువలు బాగుచేయాలి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా పనులు చేయడం లేదు. ఒ.అండ్.ఎం. నిధులతో మాత్రం అరకొరగా పనులు చేస్తున్నారు. పంటకాలువలు, మురుగుకాలువలకు వేసవి క్లోజర్పిరియడ్లో పనులుచేసి తూడు, గుర్రపుడెక్క తొలగించటం, గట్లు పటిష్టం చేయటం వంటి పనులు చేయాలి. ఇలా చేస్తే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి అవి సర్వసన్నద్ధంగా ఉంటాయి. తుపానులు, అధికవర్షాలు కురిస్తే ముంపునీరు ఈ మురుగుకాలువల నుంచి వేగంగా బయటకు పోయేందుకు వీలుంటుంది. ఈ బాపతు పనులు చేయకపోవటం కారణంగా జిల్లాలో మురుగుకాలువలు, పంటకాలువలు అధ్వానంగా తయారై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయానికి సాగునీరు ఎంతముఖ్యమో మురుగునీటిపారుదల వ్యవస్థ అంతకంటే ముఖ్యం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 379 కిలోమీటర్లమేర 20 ప్రధాన, 363 కిలోమీటర్లమేర 45 మధ్యతరహా, 1184 కిలోమీటర్లమేర 272 చిన్నతరహా మురుగుకాలువలతోపాటు 700 కిలోమీటర్ల పొడవునా వెయ్యివరకు రెవెన్యూ మురుగుకాలువలు ఉన్నాయి. వీటిలో 50శాతం పైబడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు నష్టం కూడా కోనసీమ లోనే పెద్దఎత్తున జరిగింది. ప్రభుత్వం తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకనే తాము నష్టపోయినట్లు వాపోతున్నారు.
ముంపునీరు బయటకెళ్లక రాజులపాలెంలో మునిగిన వరిచేలు
ఎక్కడ చూసినా ఆక్రమణలే...
పంట కాలువలు, మురుగుకాలువలపై ఆక్రమణలకు అంతేలేకుండా పోతుంది. 2021లో జిల్లాలో తూర్పుడెల్టాలో 690, మధ్యడెల్టా అయిన కోనసీమలో 3,100 ఆక్రమణలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిని తొలగించే ధైర్యం చేయలేదు. దీనికి రాజకీయపైరవీలు మోకాలడ్డుతున్నాయి. ఇప్పటికైనా పంటకాలువలు, మురుగుకాలువలపై ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పుడు హడావుడిగా చేస్తున్నారు
- పోల్నాటి సుబ్బారావు, రైతు, రాజులపాలెం
మా గ్రామంలో బుధవారం నుంచి మురుగుకాలువలను జె.సి.బి.తో అధికారులు బాగుచేయిస్తున్నారు. ఇప్పుడుచేస్తే ప్రయోజనం ఏమిటి. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షానికి చేలన్నీ ముంపులోనే ఉన్నాయి. ఏటా ఖరీఫ్సాగు ప్రారంభానికి ముందే పంటకాలువలు, మురుగుకాలువలు బాగుచేయాలి. అంతేకాని అంతా మునిగాక హడావుడి చేస్తే ప్రయోజనం ఏమిటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు