క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలు
క్రీడల గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీస సౌకర్యాలు కొరవడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని జిల్లా క్రీడామైదానం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది.
మూలకు చేరిన జిమ్ సామగ్రి
న్యూస్టుడే, గాంధీనగర్, మసీదుసెంటర్: క్రీడల గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో కనీస సౌకర్యాలు కొరవడి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని జిల్లా క్రీడామైదానం 19 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ) ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ గతంలో 22 రకాల క్రీడల్లో శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ఇష్టపడుతూ, పోటీపడే ఫుట్బాల్, యోగా, బాల్బ్యాడ్మింటన్, అథ్లెటిక్్్స, తైక్వాండో, టేబుల్ టెన్నిస్, వాలీబాల్కు కోచ్లు లేకపోవడంతో అనేక మంది ఆ క్రీడలకు దూరమవుతున్నారు. 1997-98లో కాకినాడలో రీజనల్ అకాడమీ స్థాపించి ఖోఖో, కబడ్డీలో శిక్షణ ప్రారంభించారు. తొలినాళ్లలో వీరి సంఖ్య పదుల సంఖ్యలో ఉండటంతో డీఎస్ఏ మైదానంలోని కార్యాలయంలోనే వసతి కల్పించేవారు. అనంతరం బాస్కెట్బాల్, వాలీబాల్, అనంతరం వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇక్కడ వసతితో శిక్షణ అందేది. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో అద్దె భవనాల్లో వారికి వసతి కల్పించారు.
నిరుపయోగంగా జిమ్ సామగ్రి..
జిల్లా క్రీడా మైదానంలో జిమ్ సౌకర్యం లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో సామగ్రి సమకూర్చినా దానికి అవసరమైన స్థలం, భవనం లేకపోవడంతో అవి మూలకు చేరాయి. ఎక్కువమంది నేర్చుకునే షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, స్విమ్మింగ్ ఆడిటోరియం, స్విమ్మింగ్ ఫూల్ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. దీంతో అనేక మంది క్రీడాకారులు ఈ క్రీడలకు దూరమయ్యారు. అధిక రుసుముల కారణంగా టెన్నిస్, స్విమ్మింగ్ నేర్చుకునే వారి సంఖ్య తగ్గడంతో లీజుదారులు వాటి నిర్వహణను తిరిగి డిఎస్ఏకు అప్పగించారు. మైదానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో విలువైన క్రీడా సామగ్రి చోరీకి గురవుతోంది.
ఫీజులు పెంచడంతో..
గతంలో క్రీడాకారుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేసి ‘పే అండ్ ప్లే’ విధానం క్రీడాకారులకు శిక్షణ అందేది. దీంతో ఎక్కువమంది పేద, మధ్యతరగతి క్రీడాకారులు తమకిష్టమైన అంశాల్లో శిక్షణ పొంది, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధించేవారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక చెల్లించు-ఆడుకో(పేఅండ్ప్లే) విధానంలో ఫీజులను ఒక్కసారిగా మూడు నాలుగు రెట్లు పెంచేశారు. పేద, మధ్యతరగతి క్రీడాకారులు రుసుములు చెల్లించలేక క్రీడలకు దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజులు నామమాత్రంగా ఉన్న సమయంలో సుమారు 1200 మంది వరకు క్రీడాకారులు వివిధ క్రీడల్లో శిక్షణ పొందితే, ప్రస్తుతం ఆసంఖ్య సగానికి పైగా తగ్గింది. రెండేళ్లుగా వసూలు చేసిన రుసుముల మొత్తాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఖాతాలకు మళ్లించారు. దీంతో మైదానం నిర్వహణ, కనీస సౌకర్యాల కల్పన చేయలేని దుస్థితి నెలకొంది.
అసంపూర్తి నిర్మాణాలే..
2017లో క్రీడాకారుల వసతికోసం రీజినల్ అకాడమీ నిర్మించేందుకు జి ప్లస్ 2 భవన నిర్మాణానికి రూ. కోట్లు వెచ్చించారు. నిధుల కొరత, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. గ్రౌండ్ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు సౌకర్యం, తలుపులు, మరుగుదొడ్లు నిర్మించినా క్రీడాకారులు వసతి కోసం కొంతవరకు ఆ భవనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం