Annavaram: అంతా అడ్డగోలు.. భక్తుల సొమ్ము మట్టిపాలు
ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటే ఎంత ప్రణాళిక ఉండాలి.. మరెంత ముందు చూపు ఉండాలి.. కానీ అన్నవరంలో అదే కొరవడింది.
సత్యదేవుని సాక్షిగా పనుల్లో లోపాలు
సత్యగిరి నుంచి గిరి ప్రదక్షిణ రోడ్డుకు అనుసంధానం చేస్తూ నిర్మించిన కచ్చారోడ్డు
అన్నవరం, న్యూస్టుడే: ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారంటే ఎంత ప్రణాళిక ఉండాలి.. మరెంత ముందు చూపు ఉండాలి.. కానీ అన్నవరంలో అదే కొరవడింది. గత ఏడాది కాలంలో దేవస్థానం వద్ద చేపట్టిన అభివృద్ధి పనుల్లో డొల్లతనానికి తావిచ్చారు. అంతర్గత రహదారులంటూ ఇష్టారాజ్యంగా రోడ్లు తవ్వేశారు.. అత్యవసరం అన్నట్లు అడ్డదారులు వేసేశారు. పచ్చదనం నాశనం చేశారు.. కనీసం నిపుణుల సలహా తీసుకోలేదు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు సైతం సమస్య సృష్టించారు. ఇదే విషయాన్ని దేవాదాయశాఖ సాంకేతిక నిపుణులు, ఇతర నిపుణుల బృందం తేల్చింది. ఇప్పుడు ఈ అడ్డగోలు పనులను సరిచేసేందుకు మరిన్ని నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. సిద్ధం చేసిన అంచనాలకు ఈ నెల 14న ధర్మకర్తల మండలిలో చర్చించి ఆమోదం సైతం తెలిపారు.
రక్షణ గోడ విస్మరించారు
రత్న, సత్యగిరి కూడలి నుంచి హరిహరసదన్ వరకు అంతర్గత రహదారి, మల్టీ లెవెల్ పార్కింగ్కు కచ్చా రోడ్డును రూ.10 లక్షలతో నిర్మించారు. ఇందుకు కొండను తొలిచారు. ఒక పద్ధతి లేకుండా కొండను తొలిచారని, ఒకవైపు రాతి బండలు ఉండటంతో రక్షణ గోడ నిర్మించకపోతే వర్షాకాలంలో ఇబ్బందులు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు. దీంతో కచ్చా రోడ్డు, కొండకు మధ్య రిటైనింగ్ వాల్ ఏర్పాటుకు ఇప్పుడు రూ. 9.50 లక్షలు అవసరమట.
ఇంతే కాదు.. ఇంకా ఉంది
అంతర్గత రహదారుల కోసం చేపట్టిన పనులను సరిచేసేందుకు ప్రస్తుతం సిద్ధం చేసిన అంచనాలు కొంత మొత్తమేనని తెలుస్తోంది. వీటికి మరింత వ్యయం చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష నిర్ణయాల వల్ల భక్తుల సొమ్ము వృథాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
పునాదులపై ప్రభావం
వనదుర్గ మార్గ్
ఎగువ ఘాట్రోడ్డు మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయం వరకు కొండను తవ్వి వనదుర్గ మార్గ్ కచ్చా రోడ్డు నిర్మాణం చేశారు. సుమారు రూ. 17 లక్షలు వెచ్చించారని తెలుస్తోంది. తీరా నిపుణుల కమిటీ చూశాక గాని లోపాలు బయటపడలేదు. భూమి జారిపోయే అవకాశముందని, సమీపంలో (డార్మెటరీ, ప్రసాదం తయారీ భవనం, సెంటినరీ కాటేజీల ముందు సీసీ రోడ్డు) నిర్మాణాల పునాదులపై ప్రభావం చూపుతుందని తేల్చారు. రక్షణ చర్యలు చేపట్టాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని నివేదిక ఇచ్చారు. దీంతో గేబియన్ వాల్ నిర్మించి మట్టి పూడ్చేందుకు రూ. 26 లక్షలతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది.
కచ్చా రోడ్డులో ఎంత వ్యత్యాసమో..
సత్యగిరి నుంచి కొండ దిగువన గిరిప్రదక్షిణ మార్గానికి అనుసంధానం చేస్తూ మూడవ ఘాట్రోడ్డు (1.5 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆరు వరుసల్లో (ఐదు మలుపుల్లో రోడ్డు నిర్మాణానికి) కొండను కొట్టి కచ్చా రోడ్డు వేశారు. సుమారు రూ.18 లక్షలు వెచ్చించారు. పరిశీలించిన నిపుణుల కమిటీ వాలులో సుమారు 300 అడుగుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. సమగ్ర పరిశీలనకు సూచించింది.అప్పటి వరకు ఈ మార్గాన్ని మూసివేయాలని పేర్కొంది. ఈ కచ్చా రోడ్డును తాత్కాలికంగా మూసివేయడానికి రాతి గోడ నిర్మాణం, రక్షణ నిమిత్తం తగిన మట్టితో నింపడానికి రూ.4.50 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు.
తుపానుకు కొట్టుకుపోయింది
ఆదిశంకర్ మార్గ్
కొండపై నుంచి దిగువ ఘాట్రోడ్డు మూడో మలుపు వద్ద కలుపుతూ అర కిలోమీటరు మేర ఆదిశంకర్ మార్గ్ నిర్మాణం చేపట్టారు. 5.5 మీటర్ల వెడల్పు, 470 మీటర్ల పొడవున రోడ్డుకు కొండను తొలచి ఎర్త్వర్క్ చేసి గ్రావెల్ నింపి బీటీ రోడ్డు వేశారు. ఇందుకు రూ.1.60 కోట్లు వెచ్చించారు. వేసిన నెల రోజుల్లోనే డిసెంబరులో తుపానుకు రోడ్డు పక్కన గ్రావెల్ బెర్మ్ పలు చోట్ల కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి రోడ్డుకు ఒకవైపు 30-60 అడుగుల లోయ కారణంగా వర్షాకాలంలో కొత్త రహదారి కోతకు గురయ్యే అవకాశముందని స్పష్టంచేశారు. రక్షణగోడ (రివిట్మెంట్) నిర్మించాల్సి ఉందని సూచించారు. దీంతో బీటీ రోడ్డు వెంబడి డ్రైయిన్కు, కొండకు మధ్య మట్టి ఫిల్లింగ్ చేసి కాంక్రీట్ వేసేందుకు రూ.6.30 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు