అభ్యర్థి.. గెలుపే గురి
తీర్పును దిశానిర్దేశం చేసే తూర్పు ప్రాంతమిది.. రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన, సామాజికవర్గాల పట్టున్న ప్రాంతమిది.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు..
తెదేపా - జనసేనలో కొత్త జోష్
జె.తిమ్మాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు గజమాలతో సత్కారం
ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం: తీర్పును దిశానిర్దేశం చేసే తూర్పు ప్రాంతమిది.. రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన, సామాజికవర్గాల పట్టున్న ప్రాంతమిది.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు.. ఓట్లున్న ఉమ్మడి జిల్లా అంటే అన్ని పార్టీలకూ అందుకే గురి.. సార్వత్రిక ఎన్నికల వేళ తెదేపా- జనసేన-వైకాపా-కాంగ్రెస్ ఇలా ప్రధాన పక్షాలన్నీ ఈ జిల్లాలపైనే దృష్టిపెట్టాయి. ప్రచార కార్యక్రమాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే వైకాపా తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో సమన్వయకర్తలను మార్చి.. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తే.. తెదేపా- జనసేన కూటమి ఉమ్మడి జిల్లాలో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సమరభేరి మోగించింది.
కీలక సమయం. కష్టేఫలి..
పార్టీకోసం కష్టపడితే.. నియోజకవర్గంలో సమన్వయంతో ముందుకెళ్తే అధిష్ఠానం గుర్తిస్తుందనడానికి తెదేపా- జనసేన ప్రకటించిన తొలి జాబితా నిదర్శనం. పెద్దాపురం, మండపేట ఎమ్మెల్యేలుగా రెండుసార్లు నెగ్గిన నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావులకు మూడోసారి పోటీచేసే అవకాశం కల్పించారు.. వివాదాలకు దూరంగా, పార్టీతో విధేయతతో ఉండడమే వీరికి విజయాలను, గుర్తింపును తెచ్చిపెట్టాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు చినరాజప్ప కీలకంగా వ్యవహరించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ, జగనన్న లేఔట్లలో అవినీతిపై ప్రత్యక్షంగా పోరాడుతూనే, న్యాయపోరాటం చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నారు. ఈక్రమంలోనే సీనియర్ నేత నెహ్రూకు తొలి జాబితాలో చోటు దక్కింది. నియోజకవర్గంపై పట్టు, మిత్ర పక్షంతో సమన్వయంతో ముందుకెళ్తున్న ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం పేర్లూ ప్రకటించడానికీ కారణం ఇదేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఆశావహులు ఎక్కువగా ఉన్నా.. జనసేన పార్టీలో జిల్లాలో కీలకంగా వ్యవహరించిన పంతం నానాజీని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు.
తొలి అడుగులు..
- ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా అసెంబ్లీకి పోటీచేసే అవకాశం తెదేపా- జనసేన పార్టీలు పలువురు యువనేతలకు కల్పించాయి.
- తుని బరిలో మంత్రి దాడిశెట్టి రాజాను ఢీకొట్టేందుకు యనమల దివ్య సిద్ధమయ్యారు. విద్యావంతురాలు..సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువయ్యారు.
- వైకాపా ప్రభుత్వంలో దగాపడ్డ దళితుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న యువకుడు మహాసేన రాజేష్కు ఊహించని రీతిలో తెదేపా టిక్కెట్ ఇచ్చింది
- రాజమహేంద్రవరం సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ను వైకాపా ఎంపీ, నగర సమన్వయకర్త మార్గాని భరత్పై అధిష్ఠానం పోటీకి దింపింది. ప్రజాసమస్యలపై పోరుబాటే గుర్తింపు తెచ్చింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆ కుటుంబం రాజమహేంద్రవరంలో 52 రోజులు బస చేస్తే.. వారికి అందుబాటులో ఉంటూనే ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
- ఈ ఏడాది జనవరి 26న జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పేరును ప్రకటించారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన తెదేపాతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు