logo

పరీక్షలు సజావుగా జరిగేలా చూడండి

మార్చి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎస్‌కేఆర్‌ మహిళా కళాశాలలో సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం జరిగింది.

Published : 25 Feb 2024 06:32 IST

మాట్లాడుతున్న ఆర్‌జేడీ శారద

శ్యామలాసెంటర్‌: మార్చి 1 నుంచి జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎస్‌కేఆర్‌ మహిళా కళాశాలలో సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌జేడీ ఐ.శారద మాట్లాడుతూ పరీక్షలు సజావుగా జరిగేలా చీఫ్‌ సూపరింటెండెంట్‌(సీఎస్‌), డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు(డీఓ)లు బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులకు  అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్‌ఐఓ ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం మాట్లాడుతూ ప్రశ్నపత్రాల సెట్‌ వివరాలు తెలుసుకుని సమయానికి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీవీఈఓ జేవీఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని