AP News: భూసేకరణ లేకుండానే.. డమ్మీ ఇళ్ల పట్టాలు సిద్ధం
అధికారం దక్కించుకోవాలనే స్వార్థంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని..
11 గ్రామాల్లో పంపిణీకి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు
డిప్యూటీ తహసీల్దార్ను నిలదీసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
బైఠాయించి నిరసన తెలుపుతున్న రామకృష్ణారెడ్డి, టీడీపీ శ్రేణులు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, అనపర్తి: అధికారం దక్కించుకోవాలనే స్వార్థంతో అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నారని.. అందులో అధికారులు భాగస్వాములవ్వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడుకాకుండా తయారు చేస్తున్న డమ్మీ పట్టాల అక్రమ వ్యవహారం గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకులు శనివారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లి బట్టబయలు చేశారు. స్థల సేకరణ చేయకుండా పట్టాలు ఎలా సిద్ధం చేస్తున్నారని.. ఎవరు తయారు చేయమని సూచించారని డీటీని నిలదీశారు. తొలుత కలెక్టర్ ఆదేశించారని పేర్కొన్నాయి. ఆర్డర్ కాపీ చూపించమని కోరగా.. మౌఖికంగా చెప్పారని చెప్పారు. స్థానిక నాయకులు ఆదేశాల మేరకు చేస్తున్నారా? అని ప్రశ్నించగా... ఆయన మౌనం దాల్చారు. దీంతో పట్టాల వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ‘సూర్య’జాలం జరుగుతోందని, లేని భూములకు పట్టాలు తయారు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆదేశాల మేరకు డీటీ సుమారు 2,000 దొంగపట్టాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ జరగని భూముల్లో 11 గ్రామాలకు చెందిన పట్టాలు సిద్ధం చేసి సర్వే నంబర్లు, సరిహద్దులను ఒక్కరే రాసేస్తున్నారని నిప్పులు చెరిగారు. మూడు గ్రామాల్లో 58 ఎకరాల సేకరణకు ప్రతిపాదనలు మాత్రమే పంపించారని.. ఇప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. ఇదంతా కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాలతో కాదని.. ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతోందని దుయ్యబట్టారు. మండలంలో నకిలీ పట్టాలు తయారు చేస్తున్న విషయమై డీటీపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే కనీసం విచారణ కూడా చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. మూడు గ్రామాలకు భూసేకరణ అని డీటీ చెబుతున్నారని, మరి 11 గ్రామాల ప్రజలకు పట్టాలు తయారు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, సీఎం జగన్ను మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి డీటీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు