సామర్లకోట రైల్వేగేటు మూసివేత
విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మార్గంలోని సామర్లకోట జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే గేటును అధికారులు బుధవారం నుంచి మూసివేశారు.
పై వంతెనపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
గేటు మూసివేస్తున్నట్లు ఏర్పాటుచేసిన బోర్డు
సామర్లకోట, న్యూస్టుడే: విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మార్గంలోని సామర్లకోట జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే గేటును అధికారులు బుధవారం నుంచి మూసివేశారు. సామర్లకోట-కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో ప్రయాణించే ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్, గూడ్సు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా ట్రాక్ను పటిష్ఠం చేసే పనులు చేపడుతున్న కారణంగా గేటు మూసివేసినట్లు స్టేషన్ మేనేజర్ ఎం.రమేశ్ తెలిపారు. పనులు వారం రోజుల పాటు జరుగుతాయని మార్చి 6వ తేదీ వరకు గేటును నిరంతరాయంగా మూసివేస్తామని వివరించారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో రైలు పట్టాలు కొంతవరకు కిందకు ఉన్నాయని, ట్రాక్ పటిష్టంతో పాటు ఎత్తు పెంచే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్యం వాహనాల రద్దీతో, ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొనే రైల్వే గేటును వారం రోజుల పాటు మూసివేస్తామని అధికారులు ప్రకటించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సామర్లకోట మీదుగా కాకినాడ వెళ్లే వాహనదారులకు రెండు మార్గాలు ఉన్నా అత్యధికులు రైల్వేగేటు మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. మరో మార్గంగా రైల్వేస్టేషన్ సెంటర్ ఫ్లైఓవరు బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. కాకినాడ వెళ్లేవారు గాంధీబొమ్మ సెంటర్ నుంచి రైల్వే గేటు మీదుగా కెనాల్రోడ్డుకు చేరుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా రెండు మార్గాలు ఉన్నా పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ సమస్య నిత్యం ఎదురవుతూనే ఉంది.
గేటువేస్తే గంటల తరబడి నిరీక్షణే..
సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లాలన్నా, కాకినాడ నుంచి సామర్లకోట రావాలన్నా ప్రధాన మార్గంలో ఉన్న ఈ గేటు వద్ద గంటల తరబడి వేచి ఉండాలి. ప్రధాన పట్టణాలు, పరిసర ప్రాంతాలైన జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం గోకవరం వాసులు దగ్గర దారని రైల్వే గేటులోంచే రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం-విజయవాడ మార్గంలో సామర్లకోట ప్రధానమైన రైల్వేజంక్షన్ కావడంతో రైళ్ల రాకపోకల తాకిడి అధికంగా ఉంటోంది. ఒక్కోసారి గేటు వేస్తే నాలుగైదు ప్రయాణికుల రైళ్లు, ఒకటీ, రెండు గూడ్సు రైళ్లు వెళ్లే వరకు తెరిచే అవకాశం ఉండదు. దీంతో వాహనదారులు ఎండ, వర్షంలో నిరీక్షించాల్సి వస్తుంది. ప్రస్తుతం ట్రాక్ పటిష్టం చేసే పనుల కారణంగా వారం రోజుల పాటు గేటును మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. మరో మార్గమైన రైల్వే వంతెన దాటి వెళ్లాలంటే బ్రిడ్జి ఇరుకు కావడం, అధిక సంఖ్యలో ఏడీబీ, కెనాల్ రోడ్డు, ఏజెన్సీ ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. ఇదే రోడ్డులో అధిక సంఖ్యలో ఉదయం, సాయంత్రం వేళల్లో పలు విద్యా సంస్థల బస్సులు వందల సంఖ్యలో తిరుగుతుంటాయి. అలాగే పరిశ్రమలు, గోదాములు, గ్రావెల్ తరలించే భారీ వాహనాలు మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం గేటు మూసివేసిన కారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మొత్తం వాహనాలన్నీ బ్రిడ్జిపై నుంచే వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంతెనపై రెండు వైపులా సిబ్బంది..
గేటు మూసివేసిన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. బ్రిడ్జిపై రెండువైపులా సిబ్బందిని నియమించి రాకపోకలు క్రమబద్ధీకరిస్తాం.
సురేష్, సీఐ, సామర్లకోట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!