ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో ఓటేద్దాం!
‘ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉద్యమ స్ఫూర్తితో ఓటు వేయాలి.. నిశ్శబ్ద విప్లవం మొదలైతే.. ఏ నియంతృత్వశక్తీ నిలవలేదు. చివరికి గెలిచేది ప్రజలే.. ప్రజాస్వామ్యమే..
సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్
సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, కాకినాడ నగరం: ‘ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉద్యమ స్ఫూర్తితో ఓటు వేయాలి.. నిశ్శబ్ద విప్లవం మొదలైతే.. ఏ నియంతృత్వశక్తీ నిలవలేదు. చివరికి గెలిచేది ప్రజలే.. ప్రజాస్వామ్యమే.. అని రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ అన్నారు. కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన సీఎఫ్డీ రాష్ట్రస్థాయి కళాజాతలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. అధికారులు.. ప్రజాప్రయోజనం కోసం పనిచేయాలని హితవు పలికారు. అక్రమాలు బహిర్గతం అయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యువ, పట్టణ, నిరాశక్తతతో ఉన్న ఓటర్లచేత ఓటు వేసే ఒక సామాజిక బాధ్యతను గుర్తుచేయాలన్నది కళాజాత ఉద్దేశమన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా.. వివేకంతో ఓటు వేసి రాజ్యాంగస్ఫూర్తిని కాపాడాలని కోరారు.
అంతా శపథం చేయండి
ప్రభుత్వాన్ని నిలబట్టే.. పడగొట్టే సామర్థ్యం ఓటుకే ఉంది. ప్రజా వ్యతిరేకతను చూపాలన్నా, సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నా ఇదే కీలకం. నాది ఒక్క ఓటేకదా.. వేయకపోయినా ఏమవుతుందనే అభిప్రాయం వద్దు. విజేతలను నిర్ణయించేది కొద్ది ఓట్లే. అయిదేళ్ల పాలనను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆరోజు సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ, నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓటు వేయాలనే శపథం ప్రతిఒక్కరూ తీసుకోవాలి.
ఐ.వి.రావు, పూర్వ ఉప కులపతి, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం
పరిష్కారం.. మంచి పాలన
రాజకీయం పవిత్ర గ్రంథం అనే రోజుల నుంచి.. ఇప్పుడు అనైతిక, ప్రజాకంటక వ్యవస్థగా మారిపోయింది. మార్పునకు ప్రజాచైతన్యమే మార్గం. ప్రజాహితం కాంక్షించని పార్టీలను మార్చుకోవాలి.. మరో ప్రత్యామ్నాయం లేదు. చెత్త పాలనకు పరిష్కారం మంచిపాలన. బాధ్యతగా ఓటు వేస్తే మార్పు వస్తుందన్నది యువత గుర్తెరగాలి. మెరుగైన సమాజం కోసం శ్రమించాలి.
ఉప్పలపాటి మాచిరాజు, సామాజిక ఉద్యమకారుడు
తప్పుడు ఓట్లు పోలవ్వకుండా చూడాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడం.. ఓటర్లలో చైతన్యం తేవడం.. సమాజంలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా సీఎఫ్డీ పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను ఎన్నికల కమిషన్, న్యాయస్థానం, మీడియా దృష్టికి తీసుకెళ్లి కొంత వరకు ప్రక్షాళన చేయగలిగాం. ఇంకా చనిపోయిన వారి పేరుతో ఓట్లున్నాయి. తప్పుడు ఓట్లు నమోదయ్యాయి. ఇలాంటి ఓట్లు పోలవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఫలానా పార్టీకి ఓటెయ్యమని చెప్పదు. మన రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సంయుక్త కార్యదర్శి, సీఎఫ్డీ
గత ప్రయత్నాలకు మించి ఉండాలి
17వ లోక్సభలో 540 మంది ఎంపీలు ఉంటే.. దాదాపు 240 మందికి నేర చరిత్ర ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మార్పుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకతవకలు ఆగడంలేదు. మనం చేయాల్సిన ప్రయత్నం ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలకు మించి ఉండాలి. విలువలున్న నాయకులను ఎన్నుకోవాలి.
జి.అబ్బయ్య, విశ్రాంత ఆచార్యుడు, జేఎన్టీయూకే
- రంగం రాజేశ్ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం ఓటు చైతన్యంపై నిర్వహించిన కళాజాత ఆహుతులను ఆలోచింపజేసింది. చనిపోయినవారికీ ఓట్లున్నాయనే నృత్యరూపకం ఆలోచింపజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్