logo

‘వైకాపా పతనం తథ్యం’

తెదేపా-జనసేన కూటమితో వైకాపా పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే అభ్యర్థి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, జనసేన నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ అన్నారు.

Published : 29 Feb 2024 05:57 IST

తాడేపల్లిగూడెం బయలుదేరిన తెదేపా- జనసేన నేతలు, కార్యకర్తలు

టి.నగర్‌, న్యూస్‌టుడే: తెదేపా-జనసేన కూటమితో వైకాపా పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే అభ్యర్థి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, జనసేన నగర ఇన్‌ఛార్జి అత్తి సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో తలపెట్టిన బహిరంగ సభకు బుధవారం భారీగా కార్లు, ద్విచక్రవాహనాలపై తరలివెళ్లారు. ముందుగా కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చేది ప్రజలు మెచ్చిన ప్రజాపాలన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని