అయిదేళ్ల పాలనకు ఆలోచించి ఓటేయాలి
నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ సూచించారు.
సదస్సులో మాట్లాడుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం. చిత్రంలో నిమ్మగడ్డ రమేశ్కుమార్, ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు
టి.నగర్(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎఫ్డీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి కళాజాత నిర్వహించారు. ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ పేరిట హోటల్ రివర్బేలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేశ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. మేధావులు, విద్యావేత్తలు అంతా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఓటుతోనే ప్రజాభిప్రాయంతో కూడిన పాలన తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. అయిదేళ్ల పాలన కోసం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్పు మన దగ్గర నుంచి మొదలవ్వాల్సి ఉందన్నారు. గతంలో పేద, మధ్యతరగతి పరిస్థితుల నుంచి రాజకీయ నేతలు పుట్టుకొచ్చేవారన్నారు. అదే సంస్కృతి పునరావృతం కావాలంటే మేధావివర్గం మౌనం వీడి ముందుకు రావాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన
ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో మేధావుల మౌనం మంచిదికాదు. ఓటు హక్కు వినియోగించుకుని రాజులవుతారో, లేదంటే బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజాధనంతో గౌరవవేతనం ఇస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం పార్టీకి వినియోగించుకుంటోంది. అన్ని వర్గాలు ఆమోదించే ప్రభుత్వం రావాలి.
ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు
యువత చేతుల్లోనే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా సిద్ధాంతాలు పాటించడం లేదు. దేశం బాగుపడాలంటే యువత చేతుల్లోనే ఉంది. నూతన సంస్కరణలు తీసుకొచ్చినప్పడే మార్పు సాధ్యమవుతుంది.
కంటిపూడి సర్వారాయుడు, వ్యాపారవేత్త
తప్పుడు ఓట్లు పోలవ్వకుండా చూడాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడం.. ఓటర్లలో చైతన్యం తేవడం.. సమాజంలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా సీఎఫ్డీ పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను ఎన్నికల కమిషన్, న్యాయస్థానం, మీడియా దృష్టికి తీసుకెళ్లి కొంత వరకు ప్రక్షాళన చేయగలిగాం. ఇంకా చనిపోయిన వారి పేరుతో ఓట్లున్నాయి. తప్పుడు ఓట్లు నమోదయ్యాయి. ఇలాంటి ఓట్లు పోలవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఫలానా పార్టీకి ఓటెయ్యమని చెప్పదు. మన రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి ఉంది.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సంయుక్త కార్యదర్శి, సీఎఫ్డీ
మేధావులు పోరాటం చేయాలి
కొత్త సమాజం కోసం మేధావులు పోరాటం కొనసాగించాలి. తద్వారా బలమైన పునాది వేయగలం. భవిష్యత్తులో దాని ఫలితాలు ఉంటాయి.
కృష్ణకుమార్, జర్నలిస్టు
సద్వినియోగం చేసుకోవాలి
అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే ప్రభుత్వం అవసరం. మంచి పాలన కోసం ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి. అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
నిరూపరాణి, నన్నయ వర్సిటీ మాజీ వీసీ
మంచోడెవరో.. ముంచేదెవరో చూసిమరీ ఓటేద్దాం..
రంగం రాజేశ్ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం ఓటు చైతన్యంపై నిర్వహించిన కళాజాత ఆహుతులను ఆలోచింపజేసింది. ‘నాయకుడు కాదు.. ఓటరు గెలవాలి.. ఓటేసే బాధ్యత స్వీకరించాలి.. మెరుగైన సమాజం స్థాపించాలి’.. ‘ఓటేద్దమా.. ఓటరూ ఓటేద్దమా.. మంచోడెవరో.. ముంచేది ఎవరో చూసిమరీ
ఓటేద్దామా..?’.. అంటూ సాగిన గీతాలు ఆకట్టుకున్నాయి. చనిపోయినవారికీ ఓట్లున్నాయనే నృత్యరూపకం ఆలోచింపజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి