యువత చేతుల్లో భవిత
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంశెట్టి లక్ష్మణరెడ్డి సూచించారు.
కళాజాత కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు
అల్లవరం, న్యూస్టుడే: రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంశెట్టి లక్ష్మణరెడ్డి సూచించారు. గురువారం అల్లవరం మండలంలోని ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు హక్కు వినియోగం’పై విద్యార్థులకు కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోసం పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. భావితరాలకోసం మంచి పాలకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఓటు వేస్తారని, మనదగ్గర అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. మద్యం, డబ్బు, కులం చూసి ఓట్లువేసే రోజులు పోవాలని, వాటిని నిలువరించడం కేవలం యువతకు మాత్రమే సాధ్యమన్నారు. అనంతరం ఓటుహక్కు వినియోగంపై సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
రకరకాల మాఫియాల వారు బరిలోకి దిగుతున్నారు..
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇసుక, మట్టి, మద్యం, గనులు, ఫ్యాక్షనిస్టులు వంటి మాఫియాలకు చెందినవారు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది. ఓటింగ్ శాతం పెంచడం, విలువలున్న నాయకులను ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కళాజాత కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తున్నా.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి
మేధావుల మౌనం ప్రజాస్వామ్యానికి చేటు
అత్యున్నత ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత గల మేధావులు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం వాటిల్లి, నిరక్షరాస్యులు, గూండాలు రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా జరక్కుండా ఉండాలంటే మేధావులు, విద్యావేత్తలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉన్న ఏకైక ఆయుధం ఓటుహక్కు వినియోగంపై మిగతా అందరికీ అవగాహన కల్పించాలి. ఓటు హక్కు అనేది రామబాణం లాంటిది. దాని ద్వారా మంచి పాలకులను ఎన్నుకోవాలి.
చంద్రమౌళి, బీవీసీ కళాశాల ప్రిన్సిపల్
నేర చరిత్ర ఉన్నవారిని బహిష్కరించాలి
ఒక విద్యార్థి ఎంతో కష్టపడి తన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత ప్రవర్తన, నేర చరిత్ర వంటి అంశాలకు సంబంధించి పోలీసుశాఖ ద్వారా విచారణ చేయించిన తరువాత మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేస్తున్నారు. అలాంటిది చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి, ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులకు మాత్రం ఎలాంటి ఉన్నత విద్యార్హత అవసరం లేకుండాపోయింది. తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నవారు కూడా చట్టసభల్లో కూర్చుని నేరాల నియంత్రణకు చట్టాలు చేసే దుస్థితి నెలకొంటోంది. యువత ఆలోచించి మంచివారిని ప్రజా
ప్రతినిధులుగా ఎన్నుకోవాలి.
ఈఆర్ సుబ్రహ్మణ్యం, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి
అనర్హులతో సమాజ తిరోగమనం
ఎన్నికల్లో డబ్బు, మద్యం, కులం వంటి ప్రలోభాలకులోనై అనర్హులను గెలిపిస్తే సమాజం తిరోగమనంలో పయనిస్తుంది. ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూనేఉంటున్నారు. వాటిని నిలువరించేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
ఉప్పుగంటి భాస్కరరావు, లోక్సత్తా ప్రతినిధి
ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
అయిదేళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి రాజధాని అనేది లేకుండానే కాలం గడిచిపోయింది. ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధికి నాంది పలకాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలుస్తుంది.
జనార్ధనరావు, బీవీసీ అధ్యాపకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..