అక్కాచెల్లెమ్మలకు అందని సొమ్ము
జగనన్న బటన్ నొక్కి నెలరోజులు దాటినా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు ఆసరా సొమ్ము జమ కాలేదు. జనవరి 23న ఆసరా సాయం విడుదల చేసినా, నేటికీ 40 శాతం డ్వాక్రా సంఘాల సభ్యులకు డబ్బులు అందలేదు.
జిల్లాలో 13వేల సంఘాలకు దక్కని ‘ఆసరా’
బటన్ నొక్కి అయిదు వారాలైనా రాని రూ.116 కోట్లు
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
జనవరి 23న నమూనా చెక్కు అందజేసిన కలెక్టర్
జగనన్న బటన్ నొక్కి నెలరోజులు దాటినా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు ఆసరా సొమ్ము జమ కాలేదు. జనవరి 23న ఆసరా సాయం విడుదల చేసినా, నేటికీ 40 శాతం డ్వాక్రా సంఘాల సభ్యులకు డబ్బులు అందలేదు. వీటి కోసం డ్వాక్రా మహిళలు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. 2019, ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాన్ని.. నాలుగు విడతలుగా చెల్లించడానికి ఆసరా పథకాన్ని వైకాపా ప్రభుత్వం ఆమల్లోకి తెచ్చింది. రెండు పర్యాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సొమ్ము మహిళల ఖాతాలకు జమ చేసినా.. మూడు, నాలుగు విడతల్లో వీటి విడుదలకు చుక్కలు చూపించారు. ఎన్నికల వేళ నాలుగో విడత సాయాన్ని విడుదల చేసినా.. ఇంకా వేల సంఖ్యలో సంఘాల ఖతాలకు సొమ్ము వేయలేకపోయారు.
ఆది నుంచీ అవాంతరాలే..?:
కాకినాడ జిల్లాలో మూడు విడతలుగా 37,525 డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.902 కోట్ల మేర రుణమాఫీని అమలు చేశారు. 2020-21 నుంచి ఈ సాయాన్ని ఏటా చెల్లిస్తున్నారు. అప్పటి నుంచి 2022-23 వరకు ప్రతిసారీ చాలా సంఘాలకు వివిధ కారణాలతో సొమ్ము జమ కావడంలేదు. ఒక సంఘం సొమ్ము మరో సంఘానికి వెళ్లిపోవడం, సాంకేతిక కారణాలతో కొన్ని నిలిచిపోవడం, సభ్యులు మరణిస్తే నామినీకి చెల్లించే క్రమంలో ఇబ్బందులు, ఈకేవైసీ, బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్య అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో చాలా మందికి ఆసరా సొమ్ము దక్కలేదు. ఇలా పొరపాట్లు జరిగిన వాటిని సరిదిద్ది.. ఏడాదికి ఒకసారి ఆగిపోయిన అన్ని పథకాలతో పాటు ఆసరాకు చెల్లింపులు చేసే క్రమంలోనూ అనేక అవరోధాలు ఎదురవడంతో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఇవి దక్కలేదు. మొదట్లో సంఘం ఖాతాకు సొమ్ము జమ చేసిన క్రమంలో కొందరే వీటిని వాడేసుకున్నారు. దీన్ని దిద్దుబాటు చేసి సంఘం ఖాతాకు సొమ్ము పడగానే, సంఘ తీర్మానంతో సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టడంతో ఉపశమనం కలిగింది.
- కాకినాడ గ్రామీణం మండలంలో తొమ్మది సంఘాలకు గత రెండు పర్యాయాలు ఆసరా సొమ్ము దక్కలేదు. ఈ సంఘాల ఐడీ నంబర్లు వేరొక సంఘాలకు ట్యాగింగ్ కావడంతో ఇప్పటికీ సమస్యను పరిష్కరిచక, వీరంతా ఆసరా సొమ్ము కోల్పోయారు.
- 2022-23కు సంబంధించి వివిధ కారణాలతో నిలిచిపోయిన 170 డ్వాక్రా సంఘాలకు ఆసరా సొమ్ము నిలిచిపోగా, వీటికి ఈ ఏడాది జనవరిలో సొమ్ము విడుదల చేయగా, కేవలం 122 సంఘాలకు రూ.2.57కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా సంఘాలకు ఇప్పటికీ ఆసరా దక్కలేదు.
ఇదీ పరిస్థితి..
కాకినాడ జిల్లాలోని 20 మండలాల పరిధిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 29,477 డ్వాక్రా సంఘాలకు నాలుగో విడత సాయం కింద రూ.242 కోట్లు మంజూరు చేశారు. జనవరి 23న ఈ ప్రక్రియ ప్రారంభించారు. సీఎం బటన్ నొక్కిన తర్వాత జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వైకాపా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా రూ.లక్షలు ఖర్చు చేసి సభలు పెట్టి మరీ మండలాల వారీగా నమూనా చెక్కులు అందజేసి ఎన్నికల ప్రకారం చేసుకున్నారు. ఇప్పటి వరకు 16,135 సంఘాలకు రూ.125 కోట్లు జమ చేశారు. ఇంకా 13,342 సంఘాలకు రూ.116కోట్లు మేర చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ వస్తే ఈ సొమ్ము వస్తుందో.. రాదోనని అంతర్మథనం చెందుతున్నారు.
దశల వారీగా విడుదల
జిల్లాలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత ఆర్థిక సాయం దశల వారీగా విడుదలవుతోంది. రోజుకు కొన్ని సంఘాలకు సొమ్ము జమ చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం సంఘాలకు చెల్లించారు. మిగతా సంఘాలకు వీలైనంత త్వరగా అందిస్తారు.
బీవీ పద్మావతి, డీపీఎం (బ్యాంకు లింకేజీ), డీఆర్డీఏ, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం