ఓపీ చూస్తే బీపీ !
నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందితో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఓపీ రాయించగా రూ.700 తీసుకున్నారు.
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూళ్లు
నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడు ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందితో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఓపీ రాయించగా రూ.700 తీసుకున్నారు. దూరం నుంచి వైద్యుడు చూసి మందులిచ్చి పంపేశారు. పది రోజుల తరువాత మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా మళ్లీ రూ.700 చెల్లించాలన్నారు. ఇదేమని ప్రశ్నించగా ఓపీ కాలపరిమితి వారం రోజులే అని చెప్పడంతో చేసేదిలేక మళ్లీ చెల్లించి వైద్య సేవలు పొందారు.
గ్రామీణంలోని ధవళేశ్వరానికి చెందిన వ్యక్తి మధుమేహం, అధిక రక్తపోటు (బీపీ) తదితర వ్యాధులతో నగరంలోని దానవాయిపేటలో ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఓపీ రూ.700 చెల్లించగా రెండు గంటలు దాటినా వైద్యుడి వద్దకు పంపలేదు. ఆలస్యమవుతుందని అత్యవసర కార్డు మరో రూ.300 చెల్లించి తీసుకున్నారు. వెంటనే వైద్యుడి వద్దకు పంపినా కనీసం నాడి పట్టకుండా పరీక్షలు రాసి మందులిచ్చి పంపేశారు. మొత్తం వైద్యసేవలకు రూ.4 వేలు దాటింది. పది రోజుల్లోనే మళ్లీ వెళ్లినా ఓపీ రుసుం చెల్లించాలన్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
వైద్యో నారాయణో హరి అంటాం.. కొందరు ప్రైవేటు వైద్యులు దాతృత్వంతో సేవలందిస్తున్నా.. మరికొందరు వైద్యులు, యాజమాన్యాల తీరు అందరికీ మచ్చ తెస్తోంది. రోగం నయం చేయడం సంగతి అటుంచితే.. ఓపీ రుసుములతో పీల్చి పిప్పి చేస్తున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ రుసుములు చూస్తే రోగులకు బీపీ వస్తోంది. జాతీయ వైద్య మండలి నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన అవుట్పేషెంట్(ఓపీ) కార్డు రుసుం వసూలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 వరకు చిన్నా పెద్దా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ నిర్దేశిత కాలపరిమితిని పక్కనపెట్టి రుసుములు వసూలు చేస్తున్నారు.
కాలపరి‘మితమే’..
గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న ఓపీ కాలపరిమితి నెల రోజులు ఉండేది. ఇప్పుడు గరిష్టంగా 15 రోజులే ఉంది. ఓపీ కాలపరిమితి పది రోజులైతే 15 రోజులకు మందులు ఇచ్చి మళ్లీ ఆసుపత్రికి రమ్మంటున్నారు. ఈలోపు మళ్లీ ఓపీ కార్డుకు డబ్బు చెల్లించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఓపీ కార్డుకు చెల్లిస్తే రెండుసార్లు వైద్యుడిని సంప్రదించేందుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం అలా జరగడం లేదని వాపోతున్నారు. కనీసం నాడి కూడా సరిగా పట్టుకోకుండా వివిధ పరీక్షలు, మందుల పేరిట రూ.వేలల్లో బిల్లులు లాగేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. జాతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో ఓపీ రుసుములు, వైద్యసేవలు, పరీక్షలు, ఇతర వసూళ్లకు సంబంధించి అన్నీ రోగులకు తెలిసేలా బోర్డులు పెట్టాలి. ఆ మొత్తమే వసూలు చేయాలి. జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో ఆ ఊసేలేదు. కొన్నిచోట్ల నామమాత్రంగా పట్టికలో చూపుతున్నా, అందులో సూచించినట్లు వసూలు చేయడం లేదు. ఓపీలో భాగంగా వైద్యులు రోగిని కనీసం పది నిమిషాలైనా పరీక్షించాలనే నిబంధన ఉన్నా అలా జరగడం లేదు. గతంలో నిశితంగా పరిశీలించిన తరువాత అవసరమైతేనే పరీక్షలు రాసేవారు. ఇప్పుడు రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే, కనీసం నాడి పట్టకుండానే పరీక్షలు, మందులు సూచిస్తున్నారు.
ఒకేసారి వందశాతం పెంపు
నేడు చిన్న రోగమొచ్చినా వైద్యులను సంప్రదిస్తున్నారు. దీంతో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ పెరిగింది. ఇదే అదనుగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు అమాంతం ఓపీ రుసుములు పెంచేశాయి. సాధారణంగా ఓపీ రుసుము రూ.200-300 ఉండేవి. ప్రస్తుతం కనీస రుసుము రూ.500, అత్యవసర కార్డు తీసుకుంటే మరో రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ కార్డే రూ.1,000 వసూలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. చిన్నారుల ఆసుపత్రులకు సంబంధించి ఒకప్పుడు రూ.200 మాత్రమే ఓపీ రుసుము ఉంటే ఇప్పుడు రూ.300-500 తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ కార్డు పేరిట మరో రూ.100-200 అదనంగా తీసుకుంటుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల