అన్నవరానికి ‘ప్రసాద్’!
అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం.
కేంద్రం నుంచి రూ.20 కోట్ల నిధులు
7న వర్చువల్గా శంకుస్థాపన చేసే అవకాశం?
అన్నదాన భవనం నమూనా
అన్నవరం, న్యూస్టుడే: అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం. ఈ నిధులతో నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణం సహా విద్యుత్తు వాహనాలూ సమకూర్చనున్నారు.
గత అయిదేళ్లుగా ‘ప్రసాద్’ పథకం ఊరిస్తోంది. 2018 జనవరిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా రూ.54.62 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. రత్న, సత్యగిరులు, కొండ దిగువన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివరణాత్మక అంచనాలు (డీపీఆర్) సిద్ధం చేశారు. రూ.50 కోట్లు మంజూరయ్యే అవకాశముందని కేంద్ర అధికారులు చెప్పడంతో ప్రతిపాదిత అంచనాల్లో మిగిలిన రూ.4.62 కోట్లు డిపాజిట్ చేసేందుకు దేవస్థానం అంగీకరించి 2022 నవంబరులోనే లేఖ ఇచ్చింది. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. ముందుగా రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది. పనులపై కేంద్రం దృష్టికి మరోసారి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈనెల 7న వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మోదీ చేతులమీదుగా జరుగుతుందా? కేంద్ర మంత్రుల ద్వారానా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఈ పనులు పూర్తయితే..
నిత్యాన్నదాన భవనాన్ని ఆలయానికి దగ్గరలో తొలగించిన తితిదే భవన స్థలంలో నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన ప్రణాళిక ప్రకారం రెండు అంతస్తుల్లో ఇది రూపొందనుంది. ఒక్కో అంతస్తులో రెండేసి హాళ్లు ఉంటాయి. ఒకేసారి 1400-1500 మంది భోజనం చేసేందుకు వీలుంటుంది. సుమారు రూ.12.50 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న భవనం ఎటూ చాలకపోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూకాంప్లెక్స్ నిర్మాణం కూడా ప్రస్తుతం ఉన్న అన్నదాన భవనం వద్ద సుమారు రూ. 6 కోట్ల నుంచి 7 కోట్ల వ్యయంతో నిర్మించి అక్కడ నుంచి ఆలయ ప్రాంగణానికి క్యూలైన్లు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?