విద్యార్థులూ విజయీభవ
విద్యార్థుల భవితను నిర్దేశించే ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
మూడు జిల్లాల్లో పటిష్ట ఏర్పాట్లు
నిమిషం దాటినా అనుమతి నిరాకరణ
న్యూస్టుడే, శ్యామలాసెంటర్, అమలాపురం కలెక్టరేట్, కాకినాడ నగరం
విద్యార్థుల భవితను నిర్దేశించే ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. 9 గంటల తరువాత నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని అధికారులు సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామని ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి ఎన్ఎస్వీఎల్ నరసింహం తెలిపారు.
ఆర్ఐవో నరసింహం
పకడ్బందీగా నిర్వహణ
ఇంటర్ పరీక్షలను ఈ దఫా మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటుచేశారు..144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతీ విద్యార్థి హాజరును ఆన్లైన్లో తీసుకుంటారు. పరీక్ష పత్రాలకు క్యూఆర్ కోడ్ను జోడించారు. పేపర్ ఎక్కడ ఫొటో తీసినా.. స్కాన్ చేసినా తెలిసిపోతుంది. పరీక్ష కేంద్రాల ఆవరణలోకి చరవాణులు అనుమతించరు. పేపర్లను భద్రపరిచే స్టేషన్లలో కూడా ఇంటర్ బోర్డు అందించే ప్రత్యేకమైన ఫోన్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగ అధికారులకు వచ్చిన సందేశాలను చూసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పైగా ఈ ఫోన్ పరీక్షకు 15 నిమిషాల ముందు మాత్రమే పనిచేస్తుంది. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటరును నియమించారు.
అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఇంటర్మీడియట్ అధికారులు
సమస్యాత్మక కేంద్రాల వద్ద చర్యలు
తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం మురముండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కాకినాడలో శంఖవరం కేంద్రాన్ని సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణించారు. అలాగే 600మంది విద్యార్థులు దాటిన చోట ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు.. వాటిలో తూర్పులో పరిశీలిస్తే రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల (950), రంగంపేట కళాశాల (680), వీటీ జూనియర్ కళాశాల, నిడదవోలు వికాస్ జూనియర్ కళాశాల (622), ఎస్కేఆర్ మహిళా కళాశాల (688)ఉన్నాయి. అలానే కేంద్రాల వద్దకు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని ఆర్ఐఓ తెలిపారు. కాలిక్యులేటర్, చేతి గడియారం, స్మార్ట్ వాచ్ పెట్టుకొని వెళ్లినా సిబ్బంది తీసివేయాలని నిబంధనలు పెట్టినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఏ కళాశాల సిబ్బంది అయినా విద్యార్థికి హాల్టిక్కెట్ ఇవ్వకపోతే నేరుగా నెట్సెంటర్లో పేరు, పుట్టినతేదీ వివరాలతో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఇంటర్ విద్యాశాఖాధికారి జీజీకే నూకరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు