దళితుల భూముల్లో ధ్వంస రచన
ఇసుక..మట్టి కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు అడ్డంగా మేసేస్తున్నారు. నిబంధనలతో పనిలేదు.. అధికారం మనదే కదా ఏమైనా చేసేయొచ్చనే ధీమా.
గోదావరిలో అడ్డుకట్టలు వేసి మరీ వైకాపా అరాచకాలు
అడ్డగోలుగా లంక మట్టి, ఇసుక దోపిడీ
శివాయిలంకలో మట్టి అక్రమ తవ్వకాల వద్ద దళితుల నిరసన
పి.గన్నవరం, న్యూస్టుడే: ఇసుక..మట్టి కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు అడ్డంగా మేసేస్తున్నారు. నిబంధనలతో పనిలేదు.. అధికారం మనదే కదా ఏమైనా చేసేయొచ్చనే ధీమా. గోదావరి తీరంలో దళితులకు కేటాయించిన లంక భూములనూ వారు వదల్లేదు. అక్కడి మట్టి, బొండు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ నిత్యం తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించినవారిని కేసులతో బెదిరిస్తున్నారు.
ఇష్టానురంగా తవ్వేయడంతో చెరువులా ఇలా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో శివాయిలంక గ్రామం ఉంది.. ఇక్కడి దళితులకు వైనతేయ గోదావరితీరం వెంట లంక భూములను మూడు దశాబ్దాల క్రితం పట్టాలిచ్చి పంపిణీ చేశారు. పెరుగు లంకల్లో వీరు సేద్యం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు కొందరు వైకాపా నాయకుల అండతో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒక ప్రైవేటు సంస్థ ఈ లంక భూముల్లో ఇష్టానుసారంగా యంత్రాలతో మట్టిని తవ్వేస్తోంది. అనంతరం టిప్పర్లలో తరలిస్తున్నారు. అలానే ఇక్కడి నదీతీరం వెంట ఇసుక, బొండు ఇసుక దోచేస్తున్నారు. ఒక సంస్థకు గంపగుత్తగా ఆర్డరు ఉందంటూ అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తక్షణమే తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండు చేస్తూ గురువారం శివాయిలంక గ్రామానికి చెందిన దళితులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు.
కేసుల పేరుతో భయపెడుతున్నారు
గతంలో దళితులకు ఇచ్చిన పట్టా భూములతోపాటు పెరుగులంక భూముల్లో ఇసుక, మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. అడ్డుకుంటుంటే కేసుల పేరుతో భయపెడుతున్నారు. ఈ కారణంగా చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. పట్టాభూమి చెంతన ఉన్న శ్మశానాన్ని సైతం వదలడంలేదు. ఇప్పటికైనా అడ్డుకట్టవేయాలి.
పుచ్చకాయల సాయిబాబు, శివాయిలంక
అడ్డుకట్టలు.. ఆపై బాటలు
గోదావరి నదీ పాయకు అక్రమార్కులు వేసిన అడ్డుకట్ట
దళితుల భూముల్లో రేయింబవళ్లు సాగిపోతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మట్టి, ఇసుకను తరలించేందుకు అక్రమార్కులు వేసిన రవాణా మార్గాలను చూస్తే మతి పోవాల్సిందే. వైనతేయ గోదావరి ప్రధానపాయతో పాటు కిలోమీటరున్నర దూరంలో కందాలపాలెం, శివాయిలంక, పల్లిపాలెం ప్రాంతాల్లోని చిన్నపాటి నదీపాయలకు అయిదు వరకు అడ్డుకట్టలు వేశారు. పల్లిపాలెం వద్ద ఏకంగా డ్రెడ్జర్ వినియోగించారు. నదీపాయల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం చట్టరీత్యా నేరం. రక్షణకు వీలుగా ప్రత్యేకంగా మద్రాస్ రివర్ కన్జర్వెన్సీ యాక్టు ఉంది. అయినా అక్రమార్కులకు పట్టడంలేదు. మత్స్యకారుల వేట పడవలు నదీపాయల్లో వెళ్లేందుకు సైతం వీలులేకుండా పోతుంది. పి.గన్నవరం ఇన్ఛార్జి తహసీల్దార్ దేవళ్ల శ్రీనివాసరావు స్పందిస్తూ ‘‘శివాయిలంక పరిధిలో లంకమట్టి తవ్వకాలను ఆ ప్రాంతానికి చెందిన దళితులు అడ్డుకున్నారని సమాచారం వచ్చింది. సిబ్బందిని అక్కడకు పంపాం. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామ’ని తెలిపారు.
గ్రామం కనుమరుగు
వైనతేయ గోదావరి ఒడ్డున శివాయిలంక ఉంది. పూర్తిగా వరద తాకిడి ప్రాంతమిది. ఏటా ఇక్కడ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఇలాగే తవ్వేస్తుంటే భవిష్యత్తులో గ్రామం కనుమరుగవుతుంది. ఇప్పటికే వరదలకు నదీకోత బారినపడుతుంది.
ఉండ్రు భాస్కరరావు, శివాయిలంక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.