అంతా ఆయనే.. ఇంతలో ఈయన
వైకాపాలో పీఠాలు కదులుతున్నాయ్.. ఇప్పటికే పలువురు సిట్టింగులకు సెగ తగిలింది. కొందరిని ఎటూ కాకుండా చేస్తే.. ఇంకొందర్ని ఇతర నియోజకవర్గాలకు సాగనంపారు.
వైకాపా సమన్వయకర్తల మార్పుపై కీలక నేతల పట్టు
ఎవరు అభ్యర్థిగా ఉంటారో తెలియక శ్రేణుల్లో గందరగోళం
ఈనాడు, కాకినాడ: వైకాపాలో పీఠాలు కదులుతున్నాయ్.. ఇప్పటికే పలువురు సిట్టింగులకు సెగ తగిలింది. కొందరిని ఎటూ కాకుండా చేస్తే.. ఇంకొందర్ని ఇతర నియోజకవర్గాలకు సాగనంపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త సమన్వయకర్తలను తెరమీదికి తెచ్చారు. వీరే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులని ప్రకటించారు. తాజా పరిణామాలు చూస్తే వీరు కూడా ఉంటారో.. లేదో.. చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు స్థానికంగా కొందరు నేతల రాజకీయ వ్యూహాలు, వ్యక్తిగత ప్రాబల్యం కోసం పావులు కదుపుతున్న తీరు చూస్తే ఫ్యాను పార్టీలో గందరగోళం నెలకొంది.
రాజకీయాల ‘కాక’నాడ..
కాకినాడ జిల్లాలో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సిట్టింగులకు బదులు కొత్తవారిని అధిష్ఠానం దింపింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాలతోపాటు.. కొవ్వూరు, గోపాలపురంలోనూ కొత్తవారు కొలువుదీరారు. కోనసీమలోని రామచంద్రపురం, పి.గన్నవరంలోనూ ఇదే పరిస్థితి. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడితే తమకు చేసిన సామాజిక న్యాయం ఇదా అని వారు వాపోతున్నారు. సీఎం జగన్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే ఏకంగా జనసేన అధినేతతో భేటీ అయితే.. మిగిలిన ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అదునుకోసం చూస్తున్నారు. తాజాగా నియమితులైన సమన్వయకర్తల్లో కొందర్ని మార్చొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏమంటిరి.. ‘‘సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఎంపీగా ఉన్నా.. ఇప్పటివరకు మేము మార్పులు, చేర్పులు చేసినా సరే వారు సమన్వయకర్తలే.. ఒకసారి జాబితా ప్రకటించాక అప్పుడు అభ్యర్థులుగా మారిపోతారు... అంటూ వైవీ సుబ్బారెడ్డి సెలవివ్వడం దుమారం రేపింది. ‘ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే.. మార్చాల్సిన వాటిలో 99 శాతం చేసేశా.. ఒకటో అరో ఉంటాయంతే.. అని పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మరుసటిరోజే మాట మార్చారు. వివిధ జిల్లాల్లోని అయిదు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేయడం గందరగోళానికి తెరలేపింది.
వాళ్లు నచ్చలే.. వీళ్లు వద్దులే..
కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు కీలక నేతల పట్టుదల అధిష్ఠానానికి శిరోభారంగా మారింది. అంతా నేనే అనుకుని ఇన్నాళ్లూ జిల్లాలో చక్రం తిప్పిన ఓ నాయకుడికి కొత్తగా వచ్చిన మరో నేతకూ మధ్య పొసగడం లేదు.
- కాకినాడ జిల్లాలో మట్టి రుచి మరిగిన ఓ నేత అన్ని నియోజకవర్గాల్లో కొండలు, చెరువులపై కన్నేశాడు. సొంత సైన్యంతో తలదూర్చి ఇష్టారీతిన తవ్వకాలు మొదలుపెట్టాడు. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు..నీ పెత్తనం ఏంటని ఎదురుతిరిగారు. వారందరికీ ఇప్పుడు టికెట్లు లేకుండా పోయాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మరో నియోజకవర్గంలో ఓ నాయకుడిని మార్చాలని చూసినా.. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో సాధ్యపడలేదు.
- కాకినాడ జిల్లాకు కొత్తగా వచ్చిన ఓ అభ్యర్థి.. ఇప్పుడున్న బృందం అనుకూలంగా లేదంటూ ఇన్నాళ్లూ చక్రం తిప్పిన నేతతోపాటు, మరికొందరిని మార్చాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ అభ్యర్థి మాట కొంతలో కొంతైనా వినకపోతే మొండికేస్తాడనే తర్జనభర్జనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఓకే.. ఇప్పుడు నియమించిన సమన్వయకర్తను ఉంచితే ఇబ్బందని ఈ కొత్త అభ్యర్థి వాదన వినిపించారు. మరోచోట ఎప్పట్నుంచో సమన్వయకర్తగా ఉన్న వ్యక్తిని మార్చి 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మెట్టలోని ఓ నియోజక వర్గంలో కొత్తగా నియమించిన నాయకుడితో పనికాదని.. ఆయన ఆరోగ్యం అంత బాగాలేదని.. ఎన్నికల్లో ఎలా గ్రామాలకు వెళ్తారని ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తన అనుచరుడికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఇంకోచోట వయసు మీరిన అభ్యర్థినీ పక్కన పెట్టాలని ఈయన ప్రతిపాదించగా మన్యంలోని నేత అడ్డుతగిలినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం