భార్య వరకట్న మరణం కేసులో..ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు ఏడేళ్లు జైలు
అదనపు కట్నం కోసం వివాహితను వేధించి.. ఆమె మరణానికి కారణమైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు ఏడేళ్లు, అతడి కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెల్లడించారు.
రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్టుడే: అదనపు కట్నం కోసం వివాహితను వేధించి.. ఆమె మరణానికి కారణమైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు ఏడేళ్లు, అతడి కుటుంబీకులైన మరో నలుగురికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెల్లడించారు. సీఐ వి.శ్రీనివాసరావు వివరాలు మేరకు.. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన శ్రిదంతా నరసింహమూర్తి తన రెండో కుమార్తె లక్ష్మీ లావణ్య(27)ను శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలన గ్రామానికి చెందిన గుజ్జల రవికి ఇచ్చి 2019లో వివాహం చేశారు. రవి రాజమహేంద్రవరం ఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేసేవాడు. వివాహం అనంతరం నూతన దంపతులు నగరంలోని రైల్వే క్వార్టర్స్లో కాపురం పెట్టారు. పెళ్లైన ఆరు నెలల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని లావణ్యను వేధించడం మొదలు పెట్టాడు. ఆమెను పుట్టింటికి పంపేవాడు కాదు. 2021 లావణ్య సోదరికి పెళ్లిచూపులు జరుగుతున్నా ఆమెను పంపలేదు. దీంతో దంపతుల మధ్య వివాదం జరిగి తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన కుమార్తె మృతికి భర్త రవితోపాటు అత్తమామలు రాములు, రమణమ్మ, వారి కుటుంబీకులైన బొమ్మిడి సుందరమ్మ, తుంగాన జయలక్ష్మిలే కారణమని నరసింహమూర్తి రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాటి సీఐ ఎ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు. కేసులో పలు వాదనలు విన్న రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు. వివాహిత మృతికి ప్రధాన కారకుడైన భర్త రవికి ఏడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా, వివాహితను వేధింపులకు గురిచేసిన రాములు, రమణమ్మ, సుందరమ్మ, జయలక్ష్మిలకు మూడేళ్లు జైలు శిక్ష విధించారు.
మరో కేసులో భర్తకు మూడేళ్ల జైలు
నిడదవోలు: భార్యను వేధించిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి జి.రామకృష్ణ మంగళవారం తీర్పునిచ్చినట్లు సమిశ్రగూడెం ఎస్ఐ రమేష్ తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన అడుసుమిల్లి శశ్య శ్రావణికి 2010 మే 20న విశాఖకు చెందిన అడుసుమిల్లి వెంకటేశ్వరరావుతో వివాహమైందని తెలిపారు. ఆ సమయంలో నగదు, బంగారం, కొంత భూమి కట్నంగా ఇచ్చినా ఆయన భార్యను శారీరకంగా, మానసికంగా వేధించి, భూమి విక్రయించి డబ్బు తీసుకురావాలని పుట్టింటికి పంపించినట్లు వివరించారు. దీంతో రూ.32 లక్షలు మళ్లీ ఇవ్వగా మద్యానికి బానిసైన భర్త ఇంకా డబ్బు తీసుకురావాలని వేధిస్తుండడంతో ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. కోర్టులో నేరం రుజువుకావడంతో భర్త వెంకటేశ్వరరావుకు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ గంగాధర్ వాదించగా సీఐ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ కె.సోమరాజు సహకారం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?