భోజనం పెట్టేదెలా జగనన్నా..!
వసతి గృహాల్లో భోజన బిల్లులు పేరుకుపోయాయి.దుకాణాల వద్ద సరకులు అరువు తెచ్చి వార్డెన్లు వంటావార్పు చేస్తున్నారు. కొందరైతే తమ జీతం డబ్బులను సైతం ఖర్చు చేయాల్సి వస్తోంది.
అరువు తెచ్చి వసతి గృహాల్లో వంటా, వార్పు
రూ.90 లక్షల మేర బిల్లుల బకాయి
కాకినాడలో ఓ వసతి గృహంలో పిల్లలు
న్యూస్టుడే, కాకినాడ నగరం: వసతి గృహాల్లో భోజన బిల్లులు పేరుకుపోయాయి.దుకాణాల వద్ద సరకులు అరువు తెచ్చి వార్డెన్లు వంటావార్పు చేస్తున్నారు. కొందరైతే తమ జీతం డబ్బులను సైతం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో వసతి గృహాల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో కళాశాలకు చెందిన 12, పాఠశాలలకు చెందినవి 21 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,780 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
ఇలా ఎన్నాళ్లు నెట్టుకొస్తారు..
వసతి గృహాల నిర్వహణకు బియ్యాన్ని ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. మిగతా వంట ఖర్చును బిల్లుల రూపంలో వసతి గృహాధికారులకు మంజూరు చేస్తోంది. కొన్ని వసతి గృహాలకు గత ఏడాది సెప్టెంబరు నుంచి మరి కొన్నింటికి డిసెంబరు నుంచి బిల్లులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.90 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తారు. ఈలోగా బిల్లులు మంజూరు కాకుంటే సరకులు తెచ్చిన దుకాణ యజమానుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొనకతప్పదని వార్డెన్లు వాపోతున్నారు.
తెదేపా హయాంలో పెంపు..
2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం మెనూ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచింది. మూడు నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు రూ.550 నుంచి రూ.1000కు, అయిదు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 నుంచి రూ.1,250కు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.800 నుంచి రూ.1400కు పెంచింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ మెనూ ఛార్జీలను పెంచుతామంటూ ఊరించి ఏడాది క్రితం నామ మాత్రంగా పెంచారు. సరాసరి రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే పెంపుదల చేశారు. పెరిగిన ధరలకు ఈ ఛార్జీలు ఏ మాత్రం చాలడం లేదని వార్డెన్లు వాపోతున్నారు.
ఇవీ లెక్కలు..
కాకినాడ జిల్లాలో మూడు సహాయ సాంఘిక సంక్షేమశాకాధికారుల (ఏఎస్డబ్ల్యూవో) పరిధిలో 33 వసతి గృహాలున్నాయి. కాకినాడ ఏఎస్డబ్ల్యూవో పరిధిలో 12 వసతి గృహాలున్నాయి. ఇందులో 7 కళాశాల, 5 పాఠశాల వసతి గృహాలున్నాయి. ఇందులో 600 మంది పిల్లలు వసతి పొందుతున్నారు. ఈ వసతి గృహాలకు ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు రావాల్సి ఉంది. రూ.20 లక్షల వరకు బిల్లులు రావాలి. తుని ఏఎస్డబ్ల్యూవో పరిధిలో 9 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 3 కళాశాల, 6 పాఠశాలల వసతి గృహాలు. ఇక్కడ 380 మంది పిల్లలు వసతి పొందుతున్నారు. జనవరి నుంచి రూ.20 లక్షల మేర బిల్లులు రావాలి. పెద్దాపురం ఏఎస్డబ్ల్యూవో పరిధిలో 12 వసతి గృహాలున్నాయి. ఇందులో 2 కళాశాల, 9 పాఠశాల, ఒక ఆనంద నిలయం వసతి గృహాలున్నాయి. వీటికి గతేడాది సెప్టెంబరు నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.
ఎదురుచూస్తున్నాం..
భోజన ఖర్చుల(మెనూ ఛార్జీల) బిల్లుల బకాయిలు రావాల్సి ఉంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేశాం. వాటి కోసం ఎదురు చూస్తున్నాం. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అప్పులు, అరువులతో నెట్టికొస్తున్నాం.
-బాన్బాబు, సత్యనారాయణ, వాణి, (కాకినాడ, తుని, పెద్దాపురం) సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంక్షేమాధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్