Annavaram: అన్నవరం కొండపై పెళ్లిళ్లకు రుసుముల బాదుడు
ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరానికి భక్తుల తాకిడి నిత్యమూ ఉంటుంది. సత్యదేవుని సన్నిధికి జనం పోటెత్తడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.
దేవస్థానంలో వివాహాలకు మండపాలు
న్యూస్టుడే - అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరానికి భక్తుల తాకిడి నిత్యమూ ఉంటుంది. సత్యదేవుని సన్నిధికి జనం పోటెత్తడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం సహా.. కోస్తా జిల్లాల్లో అన్నవరం కోల్కతా-చెన్నై జాతీయ రహదారి, రైలు మార్గంలోనూ అన్నవరం రాకపోకలకు వీలుగా ఉండటం, పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలవారూ సత్యదేవుని సన్నిధిలో వివాహాలు, విధిగా సత్యనారాయణస్వామి వ్రతానికి మక్కువ చూపడం కద్దు. ధనికేతర కుటుంబాల వారైతే.. వివాహం ఈ కొండమీద చేసుకుంటే ఖర్చు బాగా తగ్గుతుందనే ఆర్థికాంశంకూడా ఇక్కడ ఎక్కువ వివాహాలకు కారణం. అయితే క్రమంగా వివాహం అన్నవరంలోనైనా ఖర్చు రకరకాలుగా తడిసి మోపెడవుతుందనే అసంతృప్తి భక్తుల్లో ఉంది. ఇందుకు దేవస్థానం విధి విధానాలను ఆసరాగా చేసుకుని, సంబంధం ఉన్నా లేకున్నా కొందరు జలగల్లా భక్తులను వేధిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఇటీవల కీలక అధికారుల దృష్టికీ రావడం గమనార్హం.
అన్నవరంలో ఇదీ తంతు..
కొండపై వివాహాలు లేదా ఉపనయనాలు చేసుకునేవారు తమతో కొండ దిగువ నుంచి లేదా ఇంటి నుంచే భోజనాలు, అల్పాహారం వంటివి పైకి తీసుకెళ్లాలంటే టోల్ రుసుం చెల్లించాలి. ఆయా పదార్థాలు 20 మందికి తీసుకువెళ్లినా.. వందల మందికి తీసుకువెళ్లినా ఈ రుసుం కట్టాల్సిందే. ఓ కుటుంబం 50 మంది అతిథులతో ఉపనయనం చేసుకుంటే, కొండ దిగువ నుంచి అల్పాహారం తీసుకువెళ్లడానికి రూ.1,500 రుసుం చెల్లించాలి. అంటే ఒకరు తినే అల్పాహారానికి రూ.30 చొప్పున టోల్ రుసుం కట్టాలన్నమాట. 50 మందికి భోజనాలు తీసుకెళితే ఒక్కో భోజనానికి రూ.60 చొప్పున
రూ.3000 రుసుం చెల్లించాలి. వేలం ద్వారా కొండపై వ్యాపార హక్కులు దక్కించుకున్నవారికి సహకరించేందుకు దేవస్థానం అనుసరిస్తున్న విధానమిది. అన్నవరం కొండపై సగటున ఏటా వేలాది వివాహాలవుతుంటాయి. అక్కడ ఈ తంతు ఆర్థిక భారం అనుకుంటే భక్తుల ప్రత్యామ్నాయాలకు అవకాశాలెన్నో ఉంటాయి. జగన్ సీఎంగా వైకాపా పాలనలో గత రెండేళ్లలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమై, వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది కూడా.
ఆహారం రోడ్డుపై పారేసిన పరిస్థితి
కొండపైకి ఆహారం తీసుకువెళ్తే చెల్లించాల్సిన రుసుం భారీగా గత ఏడాది జూన్లో పెంచారు. టిఫిన్లు తెచ్చుకుంటే రుసుం రూ. 1,500 నుంచి రూ.3 వేలకు, భోజనాలకు రూ. 3 వేలు నుంచి రూ.5 వేలకు పెంచారు. దీంతో దుమారం రేగింది. అప్పట్లో కాకినాడకు చెందిన ఓ పెళ్లిబృందం వారి ఇంటి పులిహోర, సాంబారుతో భోజనాలు కొండపైకి తీసుకువెళ్తుండగా ఘాట్రోడ్డు టోల్గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. రూ. 6 వేలు రుసుం చెల్లించాలని ఒత్తిడి చేశారు. పిల్లల కోసం అతి తక్కువ భోజనాలు తీసుకువెళ్తున్నామని చెప్పినా సిబ్బంది వినిపించుకోలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు వారు తెచ్చుకున్న ఆహారాన్ని టోల్గేటు వద్దే పడేసి నిరసన తెలిపి వెళ్లిపోయారు. అనకాపల్లికి చెందిన ఓ పెళ్లి బృందం పెళ్లికి వచ్చిన వారికి అల్పాహారం కొండ దిగువున కొనుగోలు చేసుకున్నారు. రూ. 3,200కు అల్పాహారాన్ని తీసుకుని క్యారేజీల్లో తీసుకువస్తుండగా టోల్గేటు వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. కొండపైకి తీసుకువెళ్లాలంటే రూ. 3 వేలు చెల్లించాల్సిందేనని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆర్థిక భారమవుతుందని అల్పాహారం తీసుకువెళ్లలేదు. దీంతో ఆ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు ఆహారం లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అల్పాహారానికి రూ 1,500, భోజనానికి రూ. 3 వేలు యథావిధిగా అమలు చేస్తున్నారు. పెళ్లిబృందాలు కొండపై భోజనాలు తయారు చేసుకుంటే రూ.18 వేలు చెల్లించాలని నిబంధన పెట్టారు.
వివాహ రిజిస్ట్రేషన్ల నిలిపివేత
దేవస్థానంలో వివాహం చేసుకునే వారికి వివాహ రిజిస్ట్రేషన్లు గత ఏడాది ఏప్రిల్ నుంచి నిలుపుదల చేశారు. కొండపై వివాహాలు చేసుకునేవారు వివాహం సమయంలోనే దేవస్థానం నిబంధనలకు అనుగుణంగా ధ్రువీకరణలు ఇచ్చి రుసుం చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేసేవారు. న్యాయపరమైన ఇబ్బందులు, దేవస్థానం నుంచి ఇచ్చే ధ్రువీకరణలకు చట్టబద్ధత లేదనటంతో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియనే నిలిపి వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు