అధికారులూ.. హద్దుమీరితే అంతే సంగతి
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మొట్టికాయలు తింటున్నారు.
ఈసీ కొరడా నేపథ్యంలో చర్చ
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైకాపాకు అనుకూలంగా యంత్రాంగం
ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మొట్టికాయలు తింటున్నారు. రాష్ట్రంలో తాజాగా ముగ్గురు ఐఏఎస్, అయిదుగురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఉమ్మడి జిల్లాలోనూ పలుచోట్ల కోడ్ ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నా చర్యలు చేపట్టే విషయంలో అధికారులు మిన్నకుంటున్నారు. వీరంతా అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితిని ఈసీ చర్యలు సూచిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా వాలంటీర్లు, ఇద్దరు ఒప్పంద సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది ఒకరిద్దరిపై వేటు పడింది. ప్రతి నియోజకవర్గంలో నియమావళి సక్రమంగా అమలు చేయకపోయినా.. పార్టీలు, నాయకులకు అనుకూలంగా వ్యవహరించినా ఆధారాలతో ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మన వద్ద పరిశీలిస్తే..
- జిల్లాలో వైకాపా నాయకుల కనుసన్నల్లోనే నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు చూసినా నేటికీ చర్యలు లేవు.
- రాజమహేంద్రవరం నగరంలో వైకాపా అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో మీకు చీర అందిందా... బాగుందా..? మీ ప్రాంతంలో రోడ్డు పనులు మరో వారంలో ప్రారంభమవుతాయి... మాకే ఓటేయండంటూ ప్రచారం చేస్తున్నారు. తాయిలాలు పంచి వాటి గురించి ప్రచారంలో ప్రస్తావించడం ఓటర్లను ప్రలోభానికి గురిచేయడమేన్న వాదన వినిపిస్తోంది. వీటిపైనా అధికారులు స్పందించడం లేదు.
- ప్రభుత్వ పథకాల గురించి అధికారిక కార్యక్రమాల్లో పూర్వపు కలెక్టర్ ప్రసంగాలను వాహనంపై ప్రచారం చేస్తూ కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబు లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నం ఇటీవల వెలుగుచూసింది. వాహనానికి ఎటువంటి అనుమతులు లేవని ఆర్వో స్పష్టంచేసినా నేటికీ చర్యలు లేవు. ఇక్కడ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
- కాకినాడ అర్బన్ రెండో డివిజన్లో వైకాపా ప్రచార సామగ్రిని మంగళవారం రాత్రి పోలీసులు, జËనసేన నాయకులు పట్టుకున్నారు. సామగ్రితోపాటు అందులో తాయిలాలు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడికి భాజాపా నాయకులు చేరుకోవడంతో అధికారపక్షం, కూటమి నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి.
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరంలో ఆదివారం మంత్రి విశ్వరూప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు చిన్నారులు ప్రమాదకరంగా ఆయన ప్రచార వాహనానికి వేలాడుతూ వెళ్లినా వైకాపా నాయకులు వారించలేదు. ఓ కన్నేసి ఉంచాల్సిన అధికారులు మిన్నకుండిపోయరు. స్థానిక ఎంపీడీవో దృష్టికి వెళ్లినా చిన్నారులు స్వచ్ఛందంగా పాల్గొంటే తామేం చేస్తామని, సి-విజిల్ యాప్లో ఫిర్యాదులొస్తే స్పందిస్తామనే కోణంలో మాట్లాడారు.
- కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వ వాహనమనే స్టిక్కర్ ఉండే కారులో సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్కు వచ్చారు. ఆయన అనుచరుల కారుపై అధికార పార్టీ సిద్ధం లోగో, సీఎం జగన్, జగ్గిరెడ్డి చిత్రాలున్నాయి. సుమారు గంటసేపు ఈ కార్లు అక్కడి ఆవరణలోనే ఉన్నాయి. అయిప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం