జనసేనానికి జననీరాజనం
: అడుగడుగునా పూల జల్లులు..జై జనసేన అంటూ నినాదాలు.. చిన్నారులు మొదలు యువత, మహిళల అపూర్వ స్వాగతాల నడుమ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార యాత్ర మంగళవారం ఉత్సాహంగా సాగింది.
35 కి.మీ. మేర సాగిన పవన్ ప్రచార యాత్ర
పిఠాపురం, కొత్తపల్లి, న్యూస్టుడే: అడుగడుగునా పూల జల్లులు..జై జనసేన అంటూ నినాదాలు.. చిన్నారులు మొదలు యువత, మహిళల అపూర్వ స్వాగతాల నడుమ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార యాత్ర మంగళవారం ఉత్సాహంగా సాగింది. ప్రజలతో కలసి అడుగులేస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
వారాహి విజయభేరి యాత్ర నాలుగో రోజు పవన్ ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలు జడ్పీ బాలుర పాఠశాల పక్కనున్న హెలీప్యాడ్ వద్ద ఉదయం 10గంటలకు దిగారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ జాతీయ రహదారి మీదుగా వై జంక్షన్, పశువుల సంత, ఆర్టీసీ బస్టాండు మీదుగా ఏబీసీ చర్చికి 10.15 గంటలకు చేరుకున్నారు.. 10.40 గంటలకు ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి ర్యాలీగా స్టేట్ బ్యాంకు వద్ద నుంచి మాధవపురం రోడ్డు, ఇసుకపల్లి, నాగులాపల్లి, పొన్నాడ, మూలపేట, రామన్నపాలెం, ఉప్పాడ, కొత్తపల్లి, యండపల్లి జంక్షన్ మీదుగా పాదగయ కూడలి, జగ్గయ్యచెరువు నుంచి కుమారపురంలో తాను బస చేసే హోటల్కు సాయంత్రం 4.27 గంటలకు చేరుకున్నారు. దాదాపు ఆరున్నర గంటల పాటు ప్రజలతో మమేకమై 35 కిలోమీటర్ల మేర ఎన్నికల ప్రచారం సాగించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. ః మంగళవారం సాయంత్రం పవన్ తెనాలి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి పిఠాపురం ఈ నెల 8న వస్తారు. 9న ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.
బిడ్డా.. నువ్వు గెలవాలి: అమీనాబాద్ కూడలిలో ఆత్మీయ ఆలింగనం
ఇదీ మా అజెండా
ఈనాడు, కాకినాడ: ‘పిఠాపురం నియోజకవర్గానికి శతాబ్దాల చరిత్ర ఉంది.. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేతాల కూడలిగా ప్రసిద్ధి పొందింది.. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తా.. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెదేపా- జనసేన- భాజపా కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయబోతున్నామనే అంశంపై జనసేనాని ఇచ్చిన హామీలతో కరపత్రాన్ని పిఠాపురం మండలం కుమారపురంలోని బస ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తెదేపా అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారని, వర్మ అనుభవం ఈ ఎన్నికల్లో తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ తెలిపారు. అందరం సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వర్మ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు, కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలు బుధవారం నుంచి ఇంటింటికీ వివరిస్తామన్నారు. అన్ని మండలాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు.
పవన్ కల్యాణ్ హామీలతో కరపత్రం.. ఇంటింటి ప్రచార కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. చిత్రంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ తదితరులు
అభిమాన జనసంద్రం నడుమ జనసేనాని
ప్రచారంలో పవన్తో స్వీయచిత్రం తీసుకుంటున్న మహిళలు
`
అమీనాబాద్లో పసికందును ఎత్తుకొని మురిపెంగా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే