పాడి పరిశ్రమకు గడ్డుకాలం
జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధార పడి జీవిస్తున్నారు. వారికి గత అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పథకాలను తొలగించిన ప్రభుత్వం
పోషకుల రాయితీపైనా వేటు
ఇలా ట్రాక్టర్తో గడ్డి లోడు కావాలంటే రూ.వేలు కట్టాల్సిందే..
పార్వతీపురం పట్టణం, గ్రామీణం, న్యూస్టుడే : జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధార పడి జీవిస్తున్నారు. వారికి గత అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వెంటాడుతున్న అవస్థలు..
జిల్లాలో పశుపోషకులు లక్షల్లో ఉన్నారు. చాలా కుటుంబాలు గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలను పెంచి వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఎక్కువ మందికి పచ్చిక బయళ్లు, వరి గడ్డి అవసరం. వరి చేను నూర్పు అనంతరం వచ్చే గడ్డిని ఏడాది పొడుగునా నిల్వ ఉంచి పశుగ్రాసంగా వాడేవారు. కొన్నేళ్లుగా యంత్రాలతో కోత, నూర్పు తదితర కారణాలతో కొరత ఏర్పడింది. మరోవైపు చెరువులు, వాగులు, గుంతలు ఎండిపోయి నెర్రలు చాచడంతో నీరు సైతం దొరకడం లేదు.
పెరిగిన గ్రాసం ధరలు..
వేసవి రావడంతో పొలాల్లో ఎక్కడా పచ్చగడ్డి అందుబాటులో లేదు. దీంతో పశువులు విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వం రాయితీపై పాతర గడ్డి ఇవ్వని కారణంగా పల్లెల్లో వరి గడ్డే దిక్కైంది. ప్రస్తుతం ట్రాక్టరు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. కేవలం దానిపైనే ఆధారపడడం, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో పాల దిగుబడి సైతం తగ్గిందని పోషకులు వాపోతున్నారు. మొక్కజొన్న, ఇతర జొన్నలు, అలసందలు, సజ్జలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
గతంలో అండ ఇలా..
- తెదేపా ప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి పెంపునకు ఏటా పశుపోషకులకు పాతర గడ్డి(సైలేజ్) దాణా అందించేవారు.
- ఏటా టన్నుల కొద్దీ పాతర గడ్డిని నేరుగా గ్రామాల్లో ఇచ్చేవారు. 75 శాతం రాయితీపై కిలో రూ.2కే సరఫరా అయ్యేది. పశు దాణా కూడా 75 శాతం రాయితీపై కిలో రూ.4 చొప్పున పంపిణీ జరిగేది.
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధుల కింద పశువుల సంరక్షణ కోసం గోకులం, మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది.
- అప్పట్లో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పశు గ్రాసం సాగు చేయించారు. అధిక సంఖ్యలో రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని వేసవిలో ఉపయోగించేవారు.
- వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు పొలాల్లో అందుబాటులో ఉండే చేతి పంపుల వద్ద తొట్టెలు నిర్మించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కొత్తవాటిని ప్రారంభించకపోగా.. అప్పటికే ప్రారంభమైన వాటిని సైతం ఆపేసింది. తెదేపా ప్రభుత్వం కిలో దాణామృతం రూ.3 చొప్పున ఇవ్వగా.. వైకాపా ఆ ధరను రూ.6.50కి పెంచింది.
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..
పశు గ్రాసం కొరత లేదు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. 2.23 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విత్తనాలు, 0.96 మెట్రిక్ టన్నుల అలసందలు, 3.74 మెట్రిక్ టన్నుల జొన్న రకాలు, సజ్జలు 0.126 మెట్రిక్ టన్నులను 75 శాతం సబ్సిడీపై అందజేశాం. టీఎంఆర్ దాణా 20 మెట్రిక్ టన్నులను 60 శాతంపై ఇచ్చాం.
- మన్మధరావు, పశుసంవర్ధక శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడాది దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?