ఆడిందే ఆట.. పాడిందే ‘వైకాపా’ పాట
ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసి ఖజానాను ఖాళీచేశారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం
కాకినాడ నగరపాలికలో ఏడాదిన్నరపాటు ఇష్టారాజ్యం
న్యూస్టుడే, బాలాజీచెరువు(కాకినాడ): ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేసి ఖజానాను ఖాళీచేశారు. చివరకు పొరుగుసేవల విధానంలో పారిశుద్ధ్య సేవలందిస్తున్న కార్మికులకు అయిదు నెలలుగా జీతాలివ్వలేని దుస్థితికి దిగజార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంగా అడ్డగోలు పనులకు జీహుజూరు అన్నారు. ప్రత్యేక అధికారి పాలనలో కాకినాడలో నష్టమే తప్పా.. ఒరిగిందేమీ లేదని నగర వాసులు వాపోతున్నారు.
కాకినాడ నగరపాలక సంస్థ పాలకమండలి పదవీ కాలం 2022, సెప్టెంబర్ 15తో ముగిసింది. నాటి నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆరునెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి పాలనను పొడిగిస్తోంది. ప్రత్యేక అధికారి పాలనలో 18 నెలలుపాటు సుమారు రూ.50 కోట్ల మేర వివిధ అభివృద్ధి పనులకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారు.
సంత చెరువు వద్ద సాధారణ నిధులతో నిర్మించిన దుకాణ సముదాయం
కన్నెత్తి చూడలే!
కాకినాడ నగరపాలక సంస్థకు గతంలో ఆరుగురు ఐఏఎస్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. దాన కిషోర్ హయాంలో చలానా కుంభకోణం వెలికితీశారు. కోన శశిధర్, ముద్డాడ రవిచంద్ర వంటి ఐఏఎస్ అధికారులు ప్రత్యేక పాలనలో తమదైన ముద్ర వేశారు. 18 నెలలపాటు పనిచేసిన ప్రత్యేక అధికారి... నగరపాలక సంస్థ వైపు కన్నెత్తి చూడలేదు. స్మార్ట్సిటీ కార్పొరేషన్ వ్యవహారాలనూ పట్టించుకోలేదు.
- నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణను ఒక్కరోజు కూడా పరిశీలించలేదు. దీంతో పారిశుద్ధ్యం గాడి తప్పి వాహనాలన్నీ మూలకు చేరాయి. ఇలాంటి కీలకమైన పనులకు నిధులు వెచ్చించలేదు.
- వీధి దీపాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహణ కాలం ముగియడంతో వెళ్లిపోయింది. కొత్త సంస్థకు
- అప్పగించాలని దస్త్రం తయారు చేసినా దానికీ అతీగతీ లేదు.
- రూ.100 కోట్లతో సిద్ధం చేసిన స్మార్ట్సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రెండేళ్లుగా పునరుద్ధరించలేదు.
ఆ ఇద్దరిదే పెత్తనం
నగరపాలక సంస్థలో ఇద్దరు కీలక అధికారులు చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఒకరు ఆరేళ్లుగా ఇక్కడే తిష్ఠవేశారు. మరో అధికారిణి నాలుగేళ్లకు పైగా కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరు అధికార పార్టీ నేత చెప్పిన పనే చేస్తారు. అది నిబంధనలకు విరుద్ధమైనా వెనక్కితగ్గరు. ఆమోదించేలా దస్త్రాలు తయారు చేస్తారు. వీరిని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
ఇదీ పరిస్థితి
- సంతచెరువు పార్కు వద్ద రూ.3 కోట్ల సాధారణ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. పార్కు స్థలాన్ని కొల్లగొట్టి, అధికారం అడ్డం పెట్టుకుని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారు. దుకాణాల కేటాయింపునకు వేలం పాట నిర్వహించకుండా వ్యాపారుల నుంచి రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
- జగన్నాథపురంలోని ఒక మాజీ కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో ఇష్టానుసారంగా ఆలయాల నిర్మాణానికి సాధారణ నిధులు కేటాయించి, పనులు పూర్తి చేశారు. ఆ మాజీ కార్పొరేటర్ బినామీ గుత్తేదారు అవతారమెత్తి అధికార పార్టీ నేత అండదండలతో సాధారణ నిధులు కొల్లగొట్టారు.
- నగర శివారు ప్రతాప్ నగర్లో ఎస్.అచ్యుతాపురం రైల్వేగేటు వద్ద ఆలయ సింహద్వారం నిర్మాణానికి రూ.8.50 లక్షల సాధారణ నిధులు వెచ్చించారు.
- సాధారణంగా ఎంపీ ల్యాడ్స్, సీఎండీఎఫ్, ప్రభుత్వ గ్రాంటుల నుంచి వివిధ వర్గాలకు సామాజిక భవనాలు నిర్మిస్తారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులను వీటికి పెద్ద ఎత్తున కేటాయించేశారు. ఎన్నికలు కోడ్ రాకుండానే కొన్నింటిని ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపనలు చేశారు.
- టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఈ కాలంలోనే తెరతీశారు. స్థానిక ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంగా స్థలాల కొనుగోలు దస్త్రం ఆమోదించేశారు. ఏకంగా రూ.500 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రాల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను ఎక్కువ ధరకు కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ఒత్తిడి తెచ్చి భూముల మార్కెట్ విలువ పెంచేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?