బస్తా సిమెంట్కే దిక్కులేదు.. వీళ్లా ఊళ్లు నిర్మించేది..!
జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి.
రెండు నెలలుగా నిలిచిన సరఫరా
పాలకుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. నవరత్న పథకాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. అందుకోసం పెద్ద ఎత్తున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నాం. దీనికి అన్నిరకాలుగా సాయం అందిస్తున్నాం..’
ఇవి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభల్లో చెప్పే మాటలు..
సెంటున్నర భూమిలో ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం రూ.7.5 లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాధి స్థాయికి మాత్రమే వస్తున్నాయి. తర్వాత అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి. రెండు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పైకప్పు స్థాయి వరకు వచ్చింది.. శ్లాబు వేద్ధామంటే సిమెంటు లేదు. త్వరలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ సక్రమంగా సరఫరా చేస్తే ఏదోలా అప్పోసొప్పో చేసి ఇళ్లు కట్టుకుంటాం..
ఐ.పోలవరం మండలంలో ఓ లబ్ధిదారుడి ఆవేదన..
ముమ్మిడివరంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఇలా..
న్యూస్టుడే, ముమ్మిడివరం: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి. అయితే గత రెండు నెలలుగా గృహ నిర్మాణశాఖ గోదాముల్లో సిమెంటు నిల్వలు నిండుకోవడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంటు బస్తా రూ.267లకు అందిస్తుండగా.. బయట మార్కెట్లో రూ.300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతోంది. సిమెంటు సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు.. ప్రైవేటు మార్కెట్లో బస్తాకు రూ.50 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అసలే ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం సరిపోక అప్పులపాలవుతుంటే.. సిమెంటు సరఫరా లేక లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది.
ముమ్మిడివరం నగర పంచాయతీ, గ్రామీణ మండలంలో 1,605 ఇళ్లు మంజూరు కాగా.. 643 గృహాలు పునాధి నుంచి స్లాబుస్థాయి వరకు ఉన్నాయి. వీటి నిర్మాణానికి లబ్ధిదారులు సిమెంటు కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా గోదాములు ఖాళీ అవడంతో లబ్ధిదారులు సిమెంటు కోసం వచ్చి వెళ్తున్నారు. మండలంలో 108 మెట్రిక్ టన్నుల సిమెంటు అవసరమని అధికారులు ఇండెంట్ పెట్టి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ రాలేదు. ఇలా అయితే ఇళ్ల నిర్మాణం ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి..
జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధిత అధికారులు 1,950 మెట్రిక్ టన్నుల వరకు సిమెంటు అవసరమని ఇండెంట్ పెట్టారు. అయితే రెండు నెలలుగా సరఫరా నిలిచిపోవడంతో గృహ నిర్మాణశాఖ కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక వారు తలలు పట్టుకుంటున్నారు. సిమెంటు కంపెనీలకు నిధులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సిమెంటు ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ అంతుచిక్కక.. అంతిమంగా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అంతా మాయ..
జిల్లాలో 320 లేఔ ట్లలో 56 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీటిలో తొలి విడతగా 25,038 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 5,500 ఇళ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఎన్నికల నేపధ్యంలో అవి రద్దయ్యాయి. మరో 27 వేల ఇళ్ల నిర్మాణానికి లేఔట్లలో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఫేజ్-2లో వీటికి అవకాశం కల్పిస్తామని చెప్పి.. లోతట్టుగా ఉన్న వాటిని అభివృద్ధి చేయక.. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేకుండా చేశారు. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు లబ్ధిదారులను మభ్య పెట్టడానికి ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపి.. హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేసి.. పాత పట్టాలనే కొత్తగా ఇచ్చినట్లు మాయ చేశారు. అయితే వీటిలో చాలా మందికి నేటికీ తమ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో అర్ధంకాని పరిస్థితి. ఇవి జగనన్న నవరత్నాల చిత్రాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ.. కోనసీమ జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం
[ 29-04-2024]
ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది. -
హోటలలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు
[ 29-04-2024]
భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు జరిపారు. -
కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీని సాధిద్దాం
[ 29-04-2024]
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. -
బటన్నోక్కే వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలి
[ 29-04-2024]
బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలంతా సాగనంపాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా ఓటు వేయాలని సీనియర్ తెదేపా నాయకుడు పెండ్యాల అచ్చిబాబు తెలిపారు. -
పింఛన్దారులను మండుటెండలో తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుంది
[ 29-04-2024]
మండుటెండలో పింఛన్దారులను అటూ ఇటూ తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. -
వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి.. కూటమిదే విజయం: పవన్కల్యాణ్
[ 29-04-2024]
వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
[ 29-04-2024]
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కాటన్ దొర కట్టారు.. జగన్ చెడగొట్టారు
[ 29-04-2024]
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ.. ఉభయ గోదావరి జిల్లాల కర్షకుల ఆశా దీపం. ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు ఈ ప్రాంత ప్రజలు, రైతుల కోసం అంతలా ఆలోచించి ఆనకట్ట కట్టారు. -
మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి
[ 29-04-2024]
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. -
ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’
[ 29-04-2024]
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. -
వైకాపా అండ.. అక్రమ దందా
[ 29-04-2024]
అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. -
మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
[ 29-04-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. -
వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
[ 29-04-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మూగబోయిన జీవితాలు
[ 29-04-2024]
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. -
బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు
[ 29-04-2024]
బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
పిఠాపురం.. కొరకరాని కొయ్య
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. -
హోం ఓటింగ్కు 69 బృందాలు
[ 29-04-2024]
పోలింగ్ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం.. ఓట్లు దండుకుందాం
[ 29-04-2024]
అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా లేనిది ఈ ఏడాది ఇప్పుడే పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటున్నారు. గతంలో పదిమందితో కలిసి వేడుక చేసుకునే వాళ్లు ఇప్పుడు 100మందిని పిలుస్తున్నారు. అంతా ఎన్నికల మహత్యం మరి!. -
ఆంధ్రాలో మార్పు కోసమే కూటమి
[ 29-04-2024]
ఆంధ్రాలో అరాచక పాలన అంతమొందించేందుకే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలంతా ‘సిద్ధం’గా ఉన్నారని రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర
[ 29-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించనున్నారు. -
నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’