బస్తా సిమెంట్కే దిక్కులేదు.. వీళ్లా ఊళ్లు నిర్మించేది..!
జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి.
రెండు నెలలుగా నిలిచిన సరఫరా
పాలకుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. నవరత్న పథకాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. అందుకోసం పెద్ద ఎత్తున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నాం. దీనికి అన్నిరకాలుగా సాయం అందిస్తున్నాం..’
ఇవి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభల్లో చెప్పే మాటలు..
సెంటున్నర భూమిలో ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం రూ.7.5 లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాధి స్థాయికి మాత్రమే వస్తున్నాయి. తర్వాత అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి. రెండు నెలల క్రితమే ఇంటి నిర్మాణం పైకప్పు స్థాయి వరకు వచ్చింది.. శ్లాబు వేద్ధామంటే సిమెంటు లేదు. త్వరలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. అన్నీ సక్రమంగా సరఫరా చేస్తే ఏదోలా అప్పోసొప్పో చేసి ఇళ్లు కట్టుకుంటాం..
ఐ.పోలవరం మండలంలో ఓ లబ్ధిదారుడి ఆవేదన..
ముమ్మిడివరంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ఇలా..
న్యూస్టుడే, ముమ్మిడివరం: జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంటు అందిస్తున్నారు. దీన్ని పునాధి స్థాయిలో 30 బస్తాలు, తర్వాత కట్టుబడికి 20.. ఇలా ప్లాస్టరింగ్ పూర్తి చేసే సమయానికి పూర్తిగా అందించాలి. అయితే గత రెండు నెలలుగా గృహ నిర్మాణశాఖ గోదాముల్లో సిమెంటు నిల్వలు నిండుకోవడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంటు బస్తా రూ.267లకు అందిస్తుండగా.. బయట మార్కెట్లో రూ.300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతోంది. సిమెంటు సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు.. ప్రైవేటు మార్కెట్లో బస్తాకు రూ.50 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అసలే ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం సరిపోక అప్పులపాలవుతుంటే.. సిమెంటు సరఫరా లేక లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది.
ముమ్మిడివరం నగర పంచాయతీ, గ్రామీణ మండలంలో 1,605 ఇళ్లు మంజూరు కాగా.. 643 గృహాలు పునాధి నుంచి స్లాబుస్థాయి వరకు ఉన్నాయి. వీటి నిర్మాణానికి లబ్ధిదారులు సిమెంటు కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా గోదాములు ఖాళీ అవడంతో లబ్ధిదారులు సిమెంటు కోసం వచ్చి వెళ్తున్నారు. మండలంలో 108 మెట్రిక్ టన్నుల సిమెంటు అవసరమని అధికారులు ఇండెంట్ పెట్టి రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ రాలేదు. ఇలా అయితే ఇళ్ల నిర్మాణం ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి..
జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధిత అధికారులు 1,950 మెట్రిక్ టన్నుల వరకు సిమెంటు అవసరమని ఇండెంట్ పెట్టారు. అయితే రెండు నెలలుగా సరఫరా నిలిచిపోవడంతో గృహ నిర్మాణశాఖ కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక వారు తలలు పట్టుకుంటున్నారు. సిమెంటు కంపెనీలకు నిధులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సిమెంటు ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ అంతుచిక్కక.. అంతిమంగా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అంతా మాయ..
జిల్లాలో 320 లేఔ ట్లలో 56 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీటిలో తొలి విడతగా 25,038 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 5,500 ఇళ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో ఎన్నికల నేపధ్యంలో అవి రద్దయ్యాయి. మరో 27 వేల ఇళ్ల నిర్మాణానికి లేఔట్లలో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఫేజ్-2లో వీటికి అవకాశం కల్పిస్తామని చెప్పి.. లోతట్టుగా ఉన్న వాటిని అభివృద్ధి చేయక.. ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేకుండా చేశారు. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు లబ్ధిదారులను మభ్య పెట్టడానికి ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ల పేరుతో కొత్త నాటకానికి తెరలేపి.. హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేసి.. పాత పట్టాలనే కొత్తగా ఇచ్చినట్లు మాయ చేశారు. అయితే వీటిలో చాలా మందికి నేటికీ తమ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో అర్ధంకాని పరిస్థితి. ఇవి జగనన్న నవరత్నాల చిత్రాలు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు