ఓటీఎస్ పేరిట వంచన.. మాయమాటలు చెప్పి రూ. కోట్లు గుంజుకున్న జగన్..!
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంగా పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణమివ్వక పోగా వారికి మాయమాటలు చెప్పి, వినక పోతే బెదిరింపులకు పాల్పడి వారి వద్ద నుంచి ఓటీఎస్ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు.
జిల్లాలో ఓటీఎస్ పథకానికి అర్హులు: 1,14,697
సొమ్ములు చెల్లించేందుకు ముందుకు వచ్చినవారు: 47,834
మొత్తం సొమ్ము వసూలు లక్ష్యం ఫ రూ.48.34 కోట్లు
వసూలు చేసిన మొత్తంఫ రూ.14.56 కోట్లు
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంగా పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణమివ్వక పోగా వారికి మాయమాటలు చెప్పి, వినక పోతే బెదిరింపులకు పాల్పడి వారి వద్ద నుంచి ఓటీఎస్ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. గతంలో ఎప్పుడో దశాబ్ధాల క్రితం తీసుకున్న ఇంటి రుణాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పి తమకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ సొమ్ములు చెల్లించిన వారికి అయినా పూర్తిగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారా అంటే అదీలేదు. కేవలం దనార్జనే ధ్యేయంగా ఈ పథకం ప్రవేశ పెట్టిందని విపక్షాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఒక్క రుణం కూడా ఇవ్వలేదు
2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మించుకుందామనుకున్న వారికి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. గ్రామాల్లో జగనన్న లేఔట్లలో ఇళ్లు కాదు ఊళ్లను ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్పి లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామాల్లో రెండు సెంట్లు, పట్టణాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటిలోనే ఇళ్లు నిర్మించుకోవాలని నిబంధన విధించారు. ఇవి గ్రామాలకు శివారు ప్రాంతాల్లో ఉండటం, ప్రభుత్వం ఇచ్చిన లేఔట్లలో ఏవిధమైన మౌలిక వసతులు లేక పోవడంతో అనేక మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం పట్టాదారులను బెదిరించి మరీ ఇక్కడ నిర్మాణాలను ప్రారంభించేలా చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో అనేక ఇళ్లు మధ్యలోనే నిలిచి మొండి గోడలతో దర్శనం ఇస్తున్నాయి. వీరందరి పేర్లు గృహ నిర్మాణ శాఖ పరిధిలో రుణ గ్రస్తులుగా నమోదై ఉంటాయి. వీరికి మళ్లీ రుణం మంజూరు అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఇక తమకు సొంతింటి నిర్మాణం కళగానే మిగిలిపోతుందేమోనని ఈ లబ్ధిదారులు వాపోతున్నారు.
నమ్మించి మోసం
జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా 1983 నుంచి 2011 వరకు రుణాలు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ఎంత మేర రుణం ఉన్నా ప్రభుత్వం నిర్ధేశించిన సొమ్ము కడితే పూర్తిగా మాఫీ చేసేలా ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్)పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది వైకాపా ప్రభుత్వం. దీనిలో భాగంగా గ్రామాల్లో రూ.10వేలు, పురపాలికల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20వేల చొప్పున సొమ్ములు చెల్లిస్తే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మబలికారు. వారు అనుకున్న లక్ష్యం మేరకు ఖజానా నిండటంతో ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలుపుదల చేశారు.
తిరస్కరిస్తున్న బ్యాంకులు
ఈ పథకంలో సొమ్ములు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే పత్రాలను ఏబ్యాంకుకు తీసుకెళ్లినా క్షణాల్లో రుణాలు ఇస్తారని, ఇతరులకు కూడా అమ్ముకోవచ్చన్నారు. కానుక కింద రిజస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉంటుందంటూ వైకాపా ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. ఇది నిజమని నమ్మి డబ్బులు చెల్లించి పత్రాలు పొందిన వారు బ్యాంకులకు ఓటీఎస్ పత్రాలను తీసుకెళుతుంటే ఇవి ఎందుకూ పనికి రావని, వీటిపై రుణాలు మంజూరు చేయలేమని బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో సొమ్ములు చెల్లించిన పేదలు జగన్మాటలు నమ్మి మోసపోయామంటూ బాధపడుతున్నారు. .
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం