అంతన్నావ్.. ఇంతన్నావ్.. రేషన్ సరకులు ఎగ్గొట్టావ్!
రేషన్ సరకుల విషయంలో జగన్ సర్కార్ మాట తప్పింది.. మడం తిప్పింది. పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల సరకులు రాయితీపై అందిస్తామని చెప్పి ఎగనామం పెట్టింది.
జగన్ సర్కార్లో పేదలకు దగా
ఇచ్చేది రెండు.. కందిపప్పునకూ ఎగనామం
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
2014 సంవత్సరానికి ముందు రేషన్ దుకాణంలో బియ్యంతో పాటు పంచదార, కిరోసిన్, కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి, కారం, ఉప్పు, పసుపు పంపిణీ చేసేవారు. చంద్రబాబు పాలనలో ఎన్ని ఇస్తున్నారు? ఇదీ ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ప్రశ్న.
2019.. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజాపంపిణీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కందిపప్పు, వంటనూనె ధరలు పేద కుటుంబాలకు పెను భారంగా మారాయి. జగన్ సర్కార్ రేషన్ దుకాణాల ద్వారా పల్లెలకు కేవలం రెండే సరకులు ఇస్తోంది. పట్టణ ప్రాంతాలకు కొంత కాలంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నారు.
రేషన్ సరకుల విషయంలో జగన్ సర్కార్ మాట తప్పింది.. మడం తిప్పింది. పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల సరకులు రాయితీపై అందిస్తామని చెప్పి ఎగనామం పెట్టింది. కేవలం బియ్యం, పంచదార మాత్రమే చౌక దుకాణాల ద్వారా ఎండీయూ వాహనాలతో పంపిణీ చేస్తోంది. కందిపప్పును గత కొద్ది నెలలుగా పంపిణీ చేయడమే మానేసింది. పంపిణీ వాహనాలు ఇంటింటికీ వస్తాయా అంటే అదీ లేదు.
ఇంటింటికీ రేషన్ వట్టిమాటే!
వైకాపా అధికారంలోకి వచ్చాక.. ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనాన్ని రూ.8 లక్షలకు కొనుగోలు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.90 కోట్లను వాహనాల కొనుగోలు పేరుతో ఖర్చుచేశారు. ఇంటింటికీ రేషన్ ఇప్పటికీ పలుచోట్ల ఇవ్వడం లేదు. వీధుల్లో వాహనాలు పెట్టి సరకులు విక్రయిస్తున్నారు. చౌక దుకాణాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 95 శాతం కార్డుదారులకు సరకుల పంపిణీ జరిగేది. ఎండీయూ వాహనాలు వచ్చాక.. ప్రతినెలా 90 శాతానికి మించి సరకుల బట్వాడా జరగడం లేదు. కేవలం వైకాపా కార్యకర్తల కోసం ఎండీయూ వాహనాల వ్యవస్థను తెచ్చారనే ఆరోపణలున్నాయి.
రూ.40 కందిపప్పును రూ.67 చేశారు
ఉమ్మడి జిల్లాలో కార్డుదారుకు రాయితీ కందిపప్పు 11 నెలలుగా సక్రమంగా పంపిణీ చేయడం లేదు. వాస్తవంగా 2019 వరకు చౌక దుకాణాల్లో రాయితీపై కందిపప్పు కిలో రూ.40 చొప్పున కార్డుకు రెండు కిలోలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. ధర కిలో రూ.67కు పెంచేశారు. రెండు కిలోల బదులు కిలో ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడదీ ఇవ్వడం లేదు. దీంతో పేదలు అధిక ధరలకు బయట కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
పేదలపై రూ.210 కోట్ల భారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 17,76,533 బియ్యం కార్డులున్నాయి. ఒక కార్డుకు కిలో చొప్పున సరఫరా చేస్తే నెలకు 1,776 టన్నుల కందిపప్పు అవసరం. ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67కు పంపిణీ చేసేది. సరఫరా లేకపోవడంతో పేదలు బహిరంగ మార్కెట్లో కిలో రూ.180 చొప్పున కొనుగోలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. చౌక దుకాణంలో ఇచ్చే ధరతో పోల్చితే కిలోకు రూ.113 అదనం. గత 11 నెలల వ్యవధిలో ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో బియ్యం కార్డుదారులైన పేదలపై రూ.210 కోట్ల భారం పడింది.
ప్రభుత్వానికి మిగులు రూ.240 కోట్లు
ఉమ్మడి జిల్లాలో 1,129 ఎండీయూ వాహనాల పరిధిలో 2,856 చౌక దుకాణాలున్నాయి. నెలకు 1,776 టన్నుల కందిపప్పు అవసరంగా కాగా.. 11 నెలల వ్యవధిలో 19,536 టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 2,410 టన్నులు మాత్రమే కార్డుదారులకు అందించారు. 17,126 టన్నులు పేదలకు చేరలేదు. ఇలా రూ.240 కోట్లు ప్రభుత్వం మిగుల్చుకుంది. ఈ ఏడాది నాలుగు నెలలు కందిపప్పు పంపిణీ మాటేలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..