సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..
సీఎం రోడ్ షో, సభ కోసం దారి పొడవునా అప్రకటిత ట్రాఫిక్ ఆంక్షలు
బస్సు యాత్రలో జగన్
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ; న్యూస్టుడే, బృందం: చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..
ముఖ్యమంత్రి రోడ్షో సాగుతుందని జాతీయ రహదారిని అష్టదిగ్బంధం చేశారు.. వందలాది వాహనదారులకు తీవ్ర అవస్థలు చూపించారు. చీమలదండులా ఎటుచూసినా కదలని వాహనాలతో అత్యవసర పనులపై వివిధ జిల్లాలకు వెళ్లేవారు మాకేంటీ శిక్ష అంటూ విలవిల్లాడారు.
వైకాపా అధినేత, సీఎం జగన్ రెండురోజులపాటు చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు అవస్థలు మిగిల్చింది. రంగంపేట మండలం ఎస్టీ రాజపురంలోని బస ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరిన యాత్ర పెద్దాపురం, సామర్లకోట కూడళ్ల మీదుగా ఉండూరు వద్ద మధ్యాహ్న భోజన శిబిరం వద్దకు చేరుకుంది. కాకినాడ గ్రామీణం అచ్చంపేట కూడలి వద్ద సాయంత్రం ‘సిద్ధం’ సభ అనంతరం పిఠాపురం, తుని మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. సభలో ప్రసంగం మినహా మరెక్కడా జగన్ పెదవి విప్పలేదు. యాత్ర సాగిన కూడళ్లలో జనం పలచబడడం వైకాపా అధినేతను నిరుత్సాహ పరిచింది. పెద్దాపురం కూడలి వద్ద పట్టుమని పదిమంది కూడా కనిపించలేదు.
సభ కోసం వినియోగించిన బస్సుల బారులు
కీలక మార్గంలో చోదకులకు ఇక్కట్లు..
రాజానగరం-కాకినాడ మార్గంలో రోడ్డు పక్కన గురువారం రాత్రి సీఎం బస చేయడంతో అప్పటి నుంచే పోలీసులు తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బస ప్రాంగణానికి బస్ వెళ్లేటప్పుడు.. బయటకు వచ్చేటప్పుడు గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచే రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లాల్సిన వాహనాలను జగ్గంపేట మీదుగా మళ్లించారు. కొందరు గ్రామాల నుంచి ఏడీబీ రోడ్డులోకి వెళ్తే బారికేడ్లతో అడ్డుకుని వెనక్కి పంపారు. రంగంపేట నుంచి రాజానగరం వెళ్లే ప్రధాన మార్గాన్ని పోలీసులు బ్లాక్ చేయడంతో అంతా గండేపల్లి మీదుగా అదనంగా పది కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
మండుటెండలో నిరీక్షణ
యాత్ర సాగే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో మిట్ట మధ్యాహ్నం వాహన చోదకులు, ప్రయాణికులు విలవిల్లాడారు. జగన్ యాత్ర కారణంగా ప్రత్యక్ష నకరం చూశామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడంతో పోలీసులపై జనం మండిపడ్డారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని.. సీఎం వస్తున్నారని అడ్డుకుంటే ఎలా అంటూ నిలదీశారు.
డబ్బులిచ్చి.. తీసుకొచ్చి..
సీఎం సభకు వస్తే.. బస్సులో అన్ని ఏర్పాట్లుచేసి ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 ఇస్తామని చెప్పి చాలా మందిని తరలించారు. ముందుగా డబ్బులివ్వకుండా.. సభ పూర్తయిన తరువాత వెళ్లేటప్పుడు సొమ్ములిస్తామని ఆశ చూపారు. బస్సుల్లో అల్పాహారం, మంచినీటి సీసాలు మాత్రమే సరఫరా చేశారని పలువురు తెలిపారు.
శంఖవరం: జాతీయ రహదారిపై కత్తిపూడి వద్ద శుక్రవారం రాత్రి ట్రాఫిక్
బయటకొచ్చేసిన జనం
కాకినాడ కలెక్టరేట్: అచ్చంపేట కూడలి వద్ద జరిగిన ‘సిద్ధం’ సిభలో సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే జనం బయటకు వచ్చేశారు. ఆయన సాయంత్రం 4.58 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి, 6.20 గంటలకు ముగించారు. 5.30 నుంచే జనం బయటకు వచ్చి బస్సుల వద్దకు బయలుదేరారు. స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వచ్చామని, తిరిగి ఇళ్లకు చేరుకోడానికి ఇబ్బంది అవుతుందని మధ్యలో వచ్చేస్తున్నామని సమాధానమిచ్చారు. వచ్చామంటే వచ్చాం..వైకాపాపై ప్రేమ ఉండి కాదని’ చెప్పడం గమనార్హం.
సీఎం వస్తున్న మార్గం ఎంత సుందరంగా ఉందో
ఏడీబీ రహదారి ఆర్బీపట్నం వద్ద పోలీసులు బైకును నిలిపివేయడంతో పసికందుతో నిరీక్షణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముమ్మరంగా ఉమ్మడి ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలంతా స్వాగతిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ విజయం సాధిస్తుందని ముప్పిడి సుజాత తెలిపారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
[ 02-05-2024]
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ప్రశాంతంగా హోం ఓటింగ్
[ 02-05-2024]
మండలంలో హోం ఓటింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. రెండు బృందాల పర్యవేక్షణలో అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలో నమోదైన ఓటర్లు ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. -
తాళ్లపూడిలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా