ఉద్యోగుల ఉసురు తగలదా.. జగన్..
నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది.
న్యూస్టుడే, కాకినాడ నగరం
నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది. సీపీఎస్ రద్దుపైనా మాట తప్పింది. వారికి చెల్లించవలసిన ప్రయోజనాలపైనా మాట ఇచ్చి మోసం చేసింది. రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి.. ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్కు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.
అదనం కాదు.. హక్కులకూ దిక్కులేదు..
వివిధ సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమం (పాత చిత్రం)
ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలకు ఒక డీఏ చొప్పున ఇవ్వాలి. ఈ డీఏలను చెల్లించడంలో జగన్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉద్యోగులకు 4 నెలల డీఏ బకాయిలున్నాయి. ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా రెండు డీఏ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఒక డీఏ వచ్చే నెల జీతంతో కలిపి రానుంది. మిగతాది ఈ ఏడాది ఆగస్టులో జమ అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. తన పదవీ కాలం తర్వాత వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను మభ్యపెడుతూ రెండు డీఏలను తానే చెల్లించేస్తున్నట్లుగా ముందస్తు ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండు డీఏ బకాయిలు అలాగే ఉండిపోయాయి. నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితి ఉండటంతో ఉద్యోగులు ఆ రెండు డీఏలపై ఆశలు వదలుకున్నారు.
ఉద్యోగులకు నవరత్నాలివే..
నిరసనలో భాగంగా ఎద్దుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీ సిబ్బంది
వైకాపా గత ఎన్నికలకు ముందు పేదల ఓట్ల కోసం నవరత్న పథకాలను ప్రకటించింది. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ ఆసరా, భరోసా వంటి 9 పథకాలకు నవరత్నాలని పేర్లు చెప్పి వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఆ ఉద్యోగులకూ పలు హామీలు ఇచ్చింది. అయితే వారికి నవరత్నాలు అమలుకు బదులు నవ సమస్యలతో వేస్తోంది.
- వైద్యబీమా పేరుతో ఉద్యోగుల నుంచి సొమ్ములు జమ చేసుకుని వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులకు ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్కు కొర్రీలపై కొర్రీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.
- సరెండర్ లీవులకు మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులకు గ్రీన్ ఛానెల్లో బూజుపట్టి మోక్షం లభించడం లేదు.
- నాలుగేళ్లుగా ఒక్క డీఏను సక్రమంగా చెల్లించలేదు. పీఆర్సీ బకాయిలదీ అదే తీరు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ను తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
- సీపీఎస్ను రద్దు చేయలేదు.. ఇందుకోసం ఉద్యోగుల వేతనాల నుంచి కేటాయిస్తున్న 10 శాతం సొమ్ము సైతం ఖాతాల్లో పడటం లేదు. ప్రభుత్వమూ తన వాటాను జమ చేయడం లేదు.
- ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు చెల్లించడం లేదు. దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం లేదు. దీంతో పిల్లల చదువుల, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం, తదితర ఖర్చుల కోసం ఉద్యోగులు ప్రైవేటు రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది.
- పింఛనర్లకు ఒకటో తేదీ నాటికి సొమ్ము అందడం లేదు. అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. అదనపు క్వాంటమ్ను దెబ్బతీశారని వారు వాపోతున్నారు.
- అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు లేవు. వేతనాల కోసం నిరసనలకు దిగితే ఎస్మా ద్వారా బెదిరిస్తున్నారు.
- కొత్తగా ఉద్యోగ విరమణ చేసే వారికి వివిధ ఆర్థిక ప్రయోజనాలను నాలుగేళ్ల తర్వాత చెల్లిస్తామంటున్నారు.
- ఉపాధ్యాయులకు అప్రంటీస్ విధానాన్ని పదేళ్ల క్రితం రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కొత్త ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో పాఠశాలలు: 1269
ఉపాధ్యా యులు: 6 వేల మంది
ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు: 6 వేల మంది
ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు
-మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు ఉంచడం తగదు. గత ఏడాది డీఏ బకాయిల చెల్లింపునకు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అదీ ఒక డీఏ మాత్రమే మేలో జమ అవుతుంది. మిగతా ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. ఇప్పటికే పీఆర్సీ పెండింగ్లో ఉంది. కష్టపడి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్
[ 27-07-2024]
భారీ వర్షాలతో వరద నీటిలో ఉన్న అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాలను కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. -
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి