ఉద్యోగుల ఉసురు తగలదా.. జగన్..
నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది.
న్యూస్టుడే, కాకినాడ నగరం
నిరుద్యోగులతోనే కాదు.. ఉద్యోగులతోనూ జగన్ ప్రభుత్వం చెలాగాటమాడుతోంది. గత ఎన్నికల ముందు ఉద్యోగులు, నిరుద్యోగలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను పెడచెవిన పెట్టింది. సీపీఎస్ రద్దుపైనా మాట తప్పింది. వారికి చెల్లించవలసిన ప్రయోజనాలపైనా మాట ఇచ్చి మోసం చేసింది. రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పి.. ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్కు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.
అదనం కాదు.. హక్కులకూ దిక్కులేదు..
వివిధ సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమం (పాత చిత్రం)
ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలకు ఒక డీఏ చొప్పున ఇవ్వాలి. ఈ డీఏలను చెల్లించడంలో జగన్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఉద్యోగులకు 4 నెలల డీఏ బకాయిలున్నాయి. ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా రెండు డీఏ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో ఒక డీఏ వచ్చే నెల జీతంతో కలిపి రానుంది. మిగతాది ఈ ఏడాది ఆగస్టులో జమ అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. తన పదవీ కాలం తర్వాత వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను మభ్యపెడుతూ రెండు డీఏలను తానే చెల్లించేస్తున్నట్లుగా ముందస్తు ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండు డీఏ బకాయిలు అలాగే ఉండిపోయాయి. నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితి ఉండటంతో ఉద్యోగులు ఆ రెండు డీఏలపై ఆశలు వదలుకున్నారు.
ఉద్యోగులకు నవరత్నాలివే..
నిరసనలో భాగంగా ఎద్దుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీ సిబ్బంది
వైకాపా గత ఎన్నికలకు ముందు పేదల ఓట్ల కోసం నవరత్న పథకాలను ప్రకటించింది. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ ఆసరా, భరోసా వంటి 9 పథకాలకు నవరత్నాలని పేర్లు చెప్పి వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఆ ఉద్యోగులకూ పలు హామీలు ఇచ్చింది. అయితే వారికి నవరత్నాలు అమలుకు బదులు నవ సమస్యలతో వేస్తోంది.
- వైద్యబీమా పేరుతో ఉద్యోగుల నుంచి సొమ్ములు జమ చేసుకుని వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులకు ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్కు కొర్రీలపై కొర్రీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు.
- సరెండర్ లీవులకు మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. బిల్లులకు గ్రీన్ ఛానెల్లో బూజుపట్టి మోక్షం లభించడం లేదు.
- నాలుగేళ్లుగా ఒక్క డీఏను సక్రమంగా చెల్లించలేదు. పీఆర్సీ బకాయిలదీ అదే తీరు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ను తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
- సీపీఎస్ను రద్దు చేయలేదు.. ఇందుకోసం ఉద్యోగుల వేతనాల నుంచి కేటాయిస్తున్న 10 శాతం సొమ్ము సైతం ఖాతాల్లో పడటం లేదు. ప్రభుత్వమూ తన వాటాను జమ చేయడం లేదు.
- ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు చెల్లించడం లేదు. దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడం లేదు. దీంతో పిల్లల చదువుల, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం, తదితర ఖర్చుల కోసం ఉద్యోగులు ప్రైవేటు రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది.
- పింఛనర్లకు ఒకటో తేదీ నాటికి సొమ్ము అందడం లేదు. అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. అదనపు క్వాంటమ్ను దెబ్బతీశారని వారు వాపోతున్నారు.
- అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు లేవు. వేతనాల కోసం నిరసనలకు దిగితే ఎస్మా ద్వారా బెదిరిస్తున్నారు.
- కొత్తగా ఉద్యోగ విరమణ చేసే వారికి వివిధ ఆర్థిక ప్రయోజనాలను నాలుగేళ్ల తర్వాత చెల్లిస్తామంటున్నారు.
- ఉపాధ్యాయులకు అప్రంటీస్ విధానాన్ని పదేళ్ల క్రితం రద్దు చేశారు. దాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కొత్త ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో పాఠశాలలు: 1269
ఉపాధ్యా యులు: 6 వేల మంది
ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు: 6 వేల మంది
ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు
-మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు ఉంచడం తగదు. గత ఏడాది డీఏ బకాయిల చెల్లింపునకు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అదీ ఒక డీఏ మాత్రమే మేలో జమ అవుతుంది. మిగతా ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. ఇప్పటికే పీఆర్సీ పెండింగ్లో ఉంది. కష్టపడి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
[ 04-05-2024]
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ‘మీ మేనమామగా చెబుతున్నా.. అంటూ పలు సందర్భాల్లో సీఎం జగన్ ప్రకటించుకుంటున్నా అప్పుడే పుట్టిన బుజ్జాయిలపై శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. -
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
[ 04-05-2024]
సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. -
జనం భూముల్లో.. జగన్ బూచోడు
[ 04-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైకాపా బూచోళ్లు వచ్చి వాలిపోతున్నారు. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు. రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అయిదేళ్లలో పెద్దఎత్తున పరాధీనం అయిపోయాయి. ఇది చాలదన్నట్లు ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్)- 2023 అంటూ కొత్తదానిని వైకాపా ప్రభుత్వం ప్రజలపై ప్రయోగిస్తోంది. -
వైకాపా వంచన.. అభాగ్యుల వేదన
[ 04-05-2024]
గొంతు తడారిపోతోంది.. కళ్లు మసకబారుతున్నాయి... నిస్సత్తువ ఆవహించిన ఆ శరీరం పింఛను కోసం కి.మీ దూరం నుంచి వచ్చింది.. కీళ్ల నొప్పులు.. ఇతర అనారోగ్య సమస్యలతో ఇంకొందరు.. ఇబ్బంది పడుతూనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. -
అక్కడికెళ్తేనే ఓటరు స్లిప్పులిస్తారట..
[ 04-05-2024]
ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేయాల్సి ఉన్నప్పటికీ కొందరు బీఎల్వోలు సచివాలయాల నుంచి కదలడంలేదు. ఓటర్లనే గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పిస్తున్నారు. దీంతో మండుటెండలో ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. -
వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
[ 04-05-2024]
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. -
వేమగిరి.. మోగనుంది విజయ శంఖారావం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న (సోమవారం) ప్రధాని నరేంద్రమోదీ రాజమహేంద్రవరం రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం గ్రామీణం పరిధి వేమగిరిలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. -
తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేడు
[ 04-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు కాకినాడ సిటీ, గ్రామీణ నియోజకవర్గాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి సాయంత్రం 6 గంటలకు చాపర్లో కాకినాడ గ్రామీణ మండలం తూరంగి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
[ 04-05-2024]
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత ప్రజలదే: యనమల
[ 04-05-2024]
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలదేనని, ఓటు హక్కు వినియోగంతోనే అది సాధ్యమని తెదేపా పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. గోపాలపురంలో శుక్రవారం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బీసీ సామాజిక నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. -
జగనన్న ఏలు‘బడి’లో ఇంతే..
[ 04-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని గత ప్రభుత్వ హయాంలో ఏటా 9, 10 తరగతులు చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేవారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైకాపా లక్ష్యం
[ 04-05-2024]
కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రామచంద్రపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురం మండలం పేరూరులోని బీఆర్కే హాలులో శెట్టిబలిజల ఆత్మీయ సమావేశాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. -
చిన్న పిల్లల సంరక్షణకూ ‘చేతులు రాలేదు’
[ 04-05-2024]
వలస కార్మికుల పిల్లల సంరక్షణకు జగన్ ప్రభుత్వానికి చేతులు రాలేదు. తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పనులకు వెళ్లే సమయంలో వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించే బాధ్యతల నుంచి తప్పించుకుని వారి ఉసురుపోసుకుంది. -
గోరంట్ల ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
[ 04-05-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారంలో వైకాపా అనుయాయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శుక్రవారం 27వ డివిజన్లో గోరంట్లతో పాటు ఆయన కుమార్తె శిరీష ప్రచారంలో పాల్గొన్నారు. -
రెండు రోడ్లు వేసి అదే అభివృద్ధి అంటారా?
[ 04-05-2024]
రాజధానిని ఏర్పరుచుకోలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కొవ్వూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి శుక్రవారం కొవ్వూరు మండలం దొమ్మేరు, చాగల్లు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..