రైతుకు గండెకోత
కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.
కృష్ణా కరకట్ట గండి పూడ్చేదెప్పుడూ?
నదిలో కలిసిపోతున్న పంట భూములు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, కొల్లూరు
అరవింద వారధికి ఎగువన నది వెంబడి పడిన గండి విస్తరించిన దృశ్యం
కృష్ణానదికి వరదతో కట్ట తెగి పంట భూములు కోతకు గురవుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కళ్ల ముందే నదిలో కలిసిపోతుండడంతో అన్నదాతలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. కట్ట బలహీనపడి ఏటా కొంతభూమి కోతకు గురై నదిలో కలిసిపోతోంది. రూ.కోట్ల విలువైన భూములు కోల్పోతున్న కర్షకులు నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్నారు. కట్ట బలోపేతం చేసి భూములు కోతకు గురికాకుండా చూడాలని సాగుదారులు చేస్తున్న వినతులు బుట్టదాఖలవుతున్నాయి. ఇదీ బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఆరవింద వారధి ఎగువ భాగంలో నది వెంబడి ఉన్న భూములు ఉన్న రైతుల దుస్థితి.
కొల్లూరు మండలంలో కృష్ణానది పాయ నుంచి లంక గ్రామాలను అనుసంధానం చేసే అరవింద వారధి ఎగువభాగంలో నాణ్యమైన మట్టి లభిస్తోంది. అరవింద వారధికి ఎగువన సహజ సిద్ధంగా కట్టకు ఏర్పడిన గండి ద్వారా నది నుంచి నీరు ఒక పాయగా చీలి పెసర్లంక, ఆవులవారిపాలెం గ్రామాల మీదుగా పోతార్లంక శివారులో గాజుల్లంక వద్ద కృష్ణానది నుంచి చీలిన చినరేవులో కలుస్తుంది. మరోవైపు లంక భూముల నుంచి వర్షపు నీరు ఈ గండి నుంచి కృష్ణానదిలోకి వెళ్లడానికి వీలుగా గండి ఏర్పడింది. దీనిని ఆనుకుని ఇటుకల తయారీ కోసం కొన్నేళ్లుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటుకలకు డిమాండ్ పెరిగిన కొద్దీ ఇక్కడ మట్టి తవ్వకాలు పెరిగి కొందరు కట్టకు పక్కనే తవ్వకాలు చేయడంతో గండి బాగా విస్తరించింది. ఇక్కడి పొలాలను కొనుగోలు చేసిన ఇటుక వ్యాపారులు మట్టి ఎంత లోతు వరకు వస్తే అక్కడి వరకు తవ్వకాలు చేశారు. విద్యుత్తు స్తంభం కంటే లోతుకు ఇక్కడ తవ్వకాలు చేశారు. కట్టకు సమీపంలోనే అత్యంత లోతుకు తవ్వకాలు చేయడం వల్ల కట్ట బలహీనమై ఏటా గండి విస్తరిస్తోంది. నదికి వరద ఎక్కువగా ఉన్నప్పుడు గండి నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి పొలాలను కోతకు గురి చేస్తూ ప్రవహించడంతో భూములు కోతకు గురవుతున్నాయి. మరోవైపు కరకట్ట నుంచి లంక గ్రామాల్లోకి రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. నదికి వరద సమయంలో నీటితో పాటు కొట్టుకొచ్చిన ఇసుక మేట వేసి ఈ ప్రాంతం ఎగుడుదిగుడుగా తయారైంది. ఏటికేడు గండి విస్తరించడంతో ఇటువైపు వచ్చే నీటి పరిమాణం పెరిగి లంక గ్రామాలకు సంకటంగా మారింది. ఈ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను చుట్టుముట్టడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది. గతేడాది వచ్చిన వరదకు ఇటుక బట్టీలతో పాటు పంట పొలాలు ముంపునకు గురై భారీ నష్టం వాటిల్లింది.
కట్ట కోతకు గురైన దృశ్యం
వరద వస్తే వణుకే..
కృష్ణానదికి 6 లక్షల క్యూసెక్కుల నీటి పరిమాణం దాటితే గండి నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో పాటు పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. నది మధ్యలో ఉన్న భూములు అత్యంత సారవంతమై విలువైన వాణిజ్య పంటలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.లక్షల ధర పలుకుతోంది. ఇక్కడ సాగు చేసేవారందరూ సన్న, చిన్నకారు రైతులే. అర ఎకరం, ఎకరం, రెండెకరాలలోపు భూములు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారికి వరద వచ్చిన ప్రతిసారి పదిసెంట్ల నుంచి 20సెంట్ల వరకు భూమి కోతకు గురై నదిలో కలిసిపోవడంతో కొన్నాళ్లకు పూర్తిగా భూమి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ సాగు చేసే కంద, అరటి, బొప్పాయి, పసుపు, తమలపాకులు, నిమ్మ ఇలా అత్యంత ఖరీదైన పంటలు ఉన్నాయి. ఇవి ముంపునకు గురైన ప్రతిసారి రైతులు రూ.కోట్ల విలువైన దిగుబడులు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే తమ భూమి పూర్తిగా నదిలో కలిసిపోతుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కనిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తమ భూములు కాపాడాలని పదే పదే విన్నవిస్తున్నారు. వరద సమయంలో ప్రత్యక్షంగా రైతుల అవస్థలను చూసిన నేతలు, అధికారులు అప్పటికప్పుడు ఉపశమనం కలిగేలా హామీలు ఇవ్వడం మినహా ఇప్పటివరకు నిర్మాణాత్మకంగా చేపట్టిన చర్యలు శూన్యం. నేతల హామీలు నీటి మీద రాతల్లా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలెక్కని ప్రణాళికలు
భవిష్యత్తులో గండి మరింత పెద్దది కాకుండా వరద సమయంలో భూములు కోతకు గురికాకుండా ఉండటానికి కృష్ణానది పరిరక్షణ విభాగం అధికారులు కొన్నేళ్లుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రక్షణ గోడ నిర్మించడం ద్వారా భూములు కాపాడాలని ప్రణాళికలు రూపొందించారు. తొలుత రూ.8.49 కోట్లతో అంచనాలు తయారు చేయగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి మోక్షం లభించలేదు. దీంతో ప్రస్తుతం రూ.10.44 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపారు. వీటికి కూడా నిధులు విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
ప్రతిపాదనలు పంపాం
- కృష్ణారావు, కార్యనిర్వాహక ఇంజినీరు, కృష్ణానది పరిరక్షణ విభాగం
కొల్లూరు మండలంలో అరవింద వారధి ఎగువభాగంలో కట్టకు పడిన గండిని పరిశీలించాం. భూములు కోతకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే