టైరు పంక్చరై చెట్టును ఢీకొన్న కారు
రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఘటనలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దంపతులు మృతి
కారులోనే ఇరుక్కుపోయిన మృతుడు రాజగోపాలరెడ్డి
వినుకొండ రూరల్, పట్నంబజారు, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఘటనలో తల్లిదండ్రులు మృత్యువాత పడగా కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినుకొండ పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా మునగాలకు చెందిన గంగారపు రాజగోపాలరెడ్డి(52), శివలక్ష్మి(45) దంపతులు. వీరు కుమారుడు రాకేశ్రెడ్డితో కలిసి రెండేళ్లుగా గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. స్వగ్రామంలో బ్యాంకు పని ఉండటంతో గురువారం వేకువన 4గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద టైరుకు పంక్చర్ కావడంతో కారు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొట్టింది. కారు నడుపుతున్న రాజగోపాలరెడ్డి అందులోనే ఇరుక్కుని చనిపోగా, అతని భార్య శివలక్ష్మి కారులోంచి ఎగిరి కిందపడడంతో మృతిచెందింది. రాకేశ్రెడ్డికి రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాలతో కారులోనే ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి బాధితుడిని వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. భార్యాభర్తల మృతదేహాలకు పంచనామా చేసి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.
మృతురాలు శివలక్ష్మి
రూ.లక్ష నగదు కనిపించలేదని ఆందోళన: బ్యాంకులో రుణానికి సంబంధించి రూ.1.20 లక్షలు నగదు కారులో తీసుకెళ్తున్నామని, దానిని తీసుకోమని రాకేశ్రెడ్డి తమ బంధువులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులను అడగ్గా కారులో నగదు రూ.20 వేలు మాత్రమే ఉందని, మృతురాలి వద్ద ఉన్న బంగారం జాగ్రత్త పరిచామని, అన్ని విషయాలు కెమెరాలో రికార్డు చేశామని పోలీసులు చెప్పారు. రూ.లక్ష ఏమైనట్లు అని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు
రాజగోపాలరెడ్డి, శివలక్ష్మి మృతితో గుంటూరు ఆర్టీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. బుధవారం రాత్రి రాజగోపాలరెడ్డి తన ఇంటి సమీపంలోని బంధువుల ఇంటిలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం తెల్లవారుజామున బయలుదేరి వెళుతూ ప్రమాదానికి గురై మృతి చెందడంపై బంధువులు విషాదంలో మునిగిపోయారు. రాజగోపాలరెడ్డి మృధుస్వభావని, చుట్టుపక్కల వారందరితో కలివిడిగా ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు.
ధ్వంసమైన కారు పరిశీలిస్తున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!