ప్రజా గోడుకు.. గళం నీవే చంద్రన్నన
జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రైతాంగం సమస్యలను జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మత్స్యకారుల ఇబ్బందులనూ పట్టించుకోలేదు.
తెదేపా అధినేతపై డెల్టావాసుల ఆశలు
నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
ఈనాడు, బాపట్ల
ఎడాపెడా ఇసుక తవ్వకాల కారణంగా నదిలో గుంతలు
జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రైతాంగం సమస్యలను జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. మత్స్యకారుల ఇబ్బందులనూ పట్టించుకోలేదు. చేతికొచ్చిన పంట మిగ్జాం తుపానుతో అందకుండా పోయింది. ఆ సమయంలో చంద్రబాబునాయుడు డెల్టా ప్రాంతంలో పర్యటించి రైతులకు కొండంత అండగా నిలిచారు. ప్రస్తుతం ప్రజాగళం సభల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన వేమూరు నియోజకవర్గం కొల్లూరు, రేపల్లె నియోజకవర్గం రేపల్లె పట్టణానికి వస్తున్నారు. దీంతో ప్రజలు, రైతాంగం, తెదేపా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో కొల్లూరు మండలంలో ఎన్టీఆర్ పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కొంతమేరకు పనులు పూర్తి చేసింది. తర్వాత వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పథకం కింద సాగవ్వాల్సిన వేలాది ఎకరాలకు నీరు సమస్యగా మారింది. లంక గ్రామాలకు అనుసంధాన రహదారులు, ఇతర వసతులు కల్పిస్తామన్న వైకాపా ప్రభుత్వ హామీ కలగానే మిగిలింది. రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో మత్స్యకారుల ప్రయోజనాలకు సంబంధించిన హార్బర్ నిర్మాణం వంటివి విస్మరించటంతో ఆయా వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలివి.
- కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని 4950 ఎకరాలకు నీరందించేలా పోతార్లంక ఎత్తిపోతల పథకం పనులను తెదేపా ప్రారంభించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. ప్రస్తుతం 400 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. తెదేపా అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతాంగం కోరుతోంది.
- గాజుల్లంక, పెదలంక, ఈపూరు, జువ్వలపాలెం ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా వైకాపా ముఖ్య ప్రజాప్రతినిధి తన కుమారుల్ని ముందు పెట్టి పెద్దమొత్తంలో ఇసుక తవ్వకాలు చేయటంతో ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. అనధికార ఇసుక తవ్వకాలతో వైకాపా ప్రజాప్రతినిధి రూ.కోట్లు వెనకేసుకుని రైతులు, ప్రజల నోట్లో మట్టికొట్టారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రాకపోకలకు ఉద్దేశించిన అరవింద వారధికి ఆ ఇసుక తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉన్నా వైకాపా నాయకులు వ్యక్తిగత లబ్ధి చూసుకున్నారు. కొల్లూరు మండలాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోవటమే కాదు చాలా పొలాలు కోతకు గురై నదిలో కలిసిపోయి రైతులకు నష్టం సంభవించింది. సేద్యానికి ఇబ్బందికరంగా మారింది. కౌలు రైతుకు రెండో పంç పండితేనే గిట్టుబాటు అవుతుంది. ఇక్కడ భూగర్భజలాలు అడుగంటడం, ఆరుతడికి నీళ్లిచ్చే పరిస్థితి లేకపోవటంతో ఇంజిన్లు పెట్టుకుని పంటలు కాపాడుకోవాల్సి వస్తోంది. అందుకు ఎకరాకు రూ.5-6 వేలు అదనంగా ఖర్చవుతోంది. ఇదంతా కూడా వైకాపా నాయకులు చేసిన ఇసుక తవ్వకాల వల్లే తమకు ఈ పరిస్థితి అని రైతాంగం బోరుమంటోంది. ఈ సమస్యలకు మార్గం చూపాలని చంద్రన్నను అక్కడి ప్రజానీకం కోరుతోంది.
పోతర్లంక ఎత్తిపోతల పథకం
కాల్వల్లో పూడికలు, తూటికాడ పేరుకుపోయినా తొలగింపే లేదు. డెల్టా ప్రాంతంలో కాల్వలు శిథిలావస్థలో ఉన్నా వాటికి మరమ్మతులు చేయటం లేదు.
కౌలు రైతాంగం చాలా ఇబ్బందులో ఉంది. మొదటి పంట మిగ్జాంతో తుడిచిపెట్టుకు పోగా రెండో పంటకు ఆరుతడిగా నీళ్లు అందక దిగుబడులపై ప్రభావం చూపటంతో వచ్చే ఖరీఫ్కు సన్నద్ధమయ్యే పరిస్థితి వారికి లేకుండా పోయింది. కౌలు రైతు ప్రయోజనాలను జగన్ ప్రభుత్వం విస్మరించింది.
కొల్లూరు నుంచి గాజుల్లంకకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇసుక బట్టీలతో లంక గ్రామాల వాసులకు నిత్యం కునుకు ఉండటం లేదు. బట్టీల నుంచి విపరీతంగా పొగ వెలువడటంతో పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.
తెనాలి-కొల్లూరు ప్రధాన రహదారి మినహా డెల్టా ప్రాంతంలో మిగిలిన గ్రామాలకు వెళ్లే రహదారులు మోకాల్లోతు గుంతలు పడి దారుణంగా ఉన్నా పట్టించుకోవటం లేదు.
జంపని చక్కెర కర్మాగారం మూతపడటంతో కార్మికులకు ఏకవిడత చెల్లింపుల పథకం కింద రూ.14 కోట్లకు నాలుగో వంతు మాత్రమే ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని అందించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల